YCP : ఎమ్మెల్యే ద్వారంపూడి అండ చూసుకునే ఎమ్మెల్సీ అనంత బాబు రెచ్చిపోయాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుబ్రహ్మణ్యం మృతి కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు హంతకుడని వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. రాష్ట్రమంతా ఈ వ్యవహారం గందరగోళంగా మారినా, ఎమ్మెల్సీ లైట్ తీసుకున్నారు. ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. చివరకు ఆయన మెడకే ఉచ్చు బిగుస్తోంది. అయితే, ఇప్పుడు దీని వెనక ఆసక్తికర చర్చ జరుగుతోందట.
ఘటన జరిగినప్పుడు అనంతబాబు ద్వారంపూడిని కాంటాక్ట్ అయ్యారా?అనంత బాబు రెండు పదవులు రావడంలో ద్వారంపూడి కీ రోల్?సమస్య పరిష్కారమైందని అనంతబాబు ఊహించారా?ఎవరూ ఏమి చేయలేని స్థాయికి పరిస్థితులు
Also Read
- Botsa Satyanarayana : యుద్ధం సాకుతో ఇష్టారీతన ప్రజలపై భారంమోపుతున్నారు
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
ఎమ్మెల్సీ అనంత బాబుకు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడితో మంచి సంబంధాలున్నాయి. ప్రతి చిన్న విషయానికి ఆయన సలహాలు సూచనలు తీసుకుంటూ ఉంటారు. ఈ ఘటన జరిగినప్పుడు కూడా ఎమ్మెల్సీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ని కాంటాక్ట్ అయ్యారట. దానికి ఎమ్మెల్యే కూడా తన స్థాయిలో ప్రయత్నాలు చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ద్వారంపూడికి వైసిపి పెద్దలతో మంచి ర్యాపో ఉంటుంది. బయటకు వచ్చి బహిరంగంగా మాట్లాడలేను గాని ఏం చేయాలో అది చేస్తానని భరోసా ఇచ్చారట.
అనంత బాబు గతంలో డిసిసిబి చైర్మన్ గా పని చేశారు. 2021 లో ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. రెండు పదవులు రావడంలో చంద్రశేఖర్ రెడ్డి చక్రం తిప్పారనే ప్రచారం అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. ఇంకేముంది అధిష్టానం దగ్గరి వ్యక్తి అంత ధైర్యం ఇవ్వడంతో అనంత బాబు సైతం ఊపిరిపీల్చుకున్నారట. ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్లేనని ఖుషి అయిపోయారట. తీరా సీన్ మొత్తం రివర్స్ అయింది. ఆయన కూడా ఏమి చేయలేని స్థాయికి పరిస్థితులు వెళ్ళిపోయాయి. ఆందోళనలు, నిరసనలు పెరుగుతున్నా, అనంత బాబు మాత్రం పెళ్లిళ్లు పేరంటాలకు తిరిగారు.
సుబ్రహ్మణ్యం మృతి చెందిన తర్వాత రోజు అనంతబాబు ప్రెస్ మీట్ పెట్టడానికి సిద్ధమయ్యారు. తనపై వచ్చేవి కేవలం ఆరోపణలేనని క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చెయ్యాలనుకున్నారట. కానీ దానికి ద్వారంపూడి ససేమిరా అన్నారట. మృతదేహం అక్కడ ఉండగా ఇలా నువ్వు బయటికి రావడం మంచిది కాదని, హితబోధ చేశారట. అయినా తాను అట్నుంచి నరుక్కు వస్తుంటే, నువ్వు ఎందుకు గాబరా పడతావని చెప్పారట ఎమ్మెల్యే. దాంతో ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకున్నారట అనంత బాబు..
ద్వారంపూడి మాటలను లెక్క చెయ్యని అధిష్టానం?పార్టీ కంటే ఎవరూ ముఖ్యం కాదని హైకమాండ్ తేల్చి చెప్పిందా?
తన పరిధి దాటి పోయిందని ద్వారంపూడి చేతులెత్తేశారా?
ఈ మొత్తం ఎపిసోడ్ ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్ళడానికి ద్వారంపూడి ప్రయత్నాలు చేశారట. కానీ పార్టీ అధినాయకత్వం మాత్రం చంద్రశేఖర్ రెడ్డి చెప్పిన వాటిని పట్టించుకోలేదట. అక్కడితో ఊరుకుంటే పర్లేదు. మీరు కూడా బహిరంగంగా ఎటువంటి కామెంట్స్ చేయొద్దని చెప్పారట. పార్టీ కంటే ఎవరూ ముఖ్యం కాదని తేల్చి చెప్పారట. పార్టీ బాగుంటేనే అందరూ బాగుంటారని, వ్యక్తుల కోసం వ్యవస్థను నాశనం చేయలేమని అన్నారట. అయినా ఈ విషయంలో పార్టీకి ఒక లైన్ ఉందని అనవసరంగా లేనిపోని తలనొప్పులు తెచ్చి పెట్టొద్దని అన్నారట. దాంతో ద్వారంపూడి సైలెంట్ అయిపోయారట. ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా చేయగలను గాని, తన పరిధి దాటి పోయిందని చేతులెత్తేసారట ద్వారంపూడి. ఏదో జరుగుతుంది అనుకున్న అనంత బాబు చివరకు నిరాశ చెందారట.
తాజావార్తలు
-
Elon Musk: మస్క్కు చైనా గూఢచారుల విందు?.. ట్రంప్ చైనా పర్యటనపై కొత్త వివాదం
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
Botsa Satyanarayana : యుద్ధం సాకుతో ఇష్టారీతన ప్రజలపై భారంమోపుతున్నారు
-
KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
-
TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!