Kodad Assembly constituency : అక్కడ అధికార పార్టీలో కుంపట్లు రాజుకున్నాయా..? ఢీ అంటే ఢీ అంటున్నారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodad Assembly constituency
అక్కడ అధికార పార్టీలోనే కుంపట్లు రాజుకున్నాయి. రెండు వర్గాలు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ.. రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నాయి. ఎవరు పైచెయ్యి సాధిస్తారో కానీ.. ఢీ అంటే ఢీ అనేలా సొంత పార్టీ నేతల మధ్య పొలిటికల్ సెగలు రేగుతున్నాయి. అదెక్కడో ఈ స్టోరీలో చూద్దాం.
కోదాడ టీఆర్ఎస్ పాలిటిక్స్లో ఉన్నట్టుండి వేడి రాజుకుంది. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్కు.. అక్కడ పార్టీ సీనియర్లకు అస్సలు పడటం లేదు. ఎమ్మెల్యేకు మున్సిపల్ ఛైర్పర్సన్ శిరీష దంపతులకు మధ్య తాజాగా ఓ రేంజ్లో ఆధిపత్య పోరాటం మొదలైంది. అంతా టీఆర్ఎస్ నాయకులే అయినప్పటికీ వైరిపక్షాల మాదిరి రాజకీయాలు చేస్తున్నారు. రోజులు గడిచేకొద్ది సమస్య శ్రుతిమించుతుందే తప్ప.. వెనక్కి తగ్గేందుకు ఎవరూ ఆలోచించడం లేదు. దాంతో రేపటి రోజున ఏం జరుగుతుందో కేడర్కు అంతుచిక్కడం లేదట.
Also Read
ప్రస్తుతం కోదాడ మున్సిపాలిటీ కేంద్రంగా గులాబీ శిబిరంలో అగ్గి రాజుకుంది. నిన్న మొన్నటి వరకు కలిసి సాగిన ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్పర్సన్ భర్త వననర్తి లక్ష్మీనారాయణకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాను లేని సమయంలో మున్సిపల్ సమావేశం నిర్వహించారని ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ కస్సుమంటున్నారట. కోరం లేకపోయినా.. కాంగ్రెస్ కౌన్సిలర్లను రప్పించి సమావేశం నడిపించారనేది ఎమ్మెల్యే ఆరోపణ. అయితే లక్ష్మీనారాయణ వర్గం వాదన మరోలా ఉంది. మున్సిపల్ సమావేశం ఎప్పుడు నిర్వహించాలో.. ఎలా నిర్వహించాలో.. పురపాలక సంఘం పరిధిలో అభివృద్ధి పనులపై నిర్ణయం ఛైర్పర్సన్ చేతుల్లో ఉంటుందని.. ఎమ్మెల్యే కాదని చెబుతున్నారట. ఈ విషయంలో రెండువర్గాలు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి.
మున్సిపాలిటీలో కామటి పోస్టుల భర్తీపై వచ్చిన ఆరోపణలు.. ఇతరత్రా అంశాల్లో ఎమ్మెల్యేకు.. వనపర్తి వర్గానికి గ్యాప్ వచ్చినట్టు తెలుస్తోంది. కాకపోతే పార్టీకి ఇబ్బంది కలిగించేలా.. ఎమ్మెల్యేను ఇరకాటంలో పెట్టేలా లక్ష్మీనారాయణ బ్యాచ్ తీరు ఉందనేది మల్లయ్య వర్గం వాదన. పైగా ఈ సమస్యను ఇంతటితో వదిలిపెట్టకుండా సొంత పార్టీ ఛైర్పర్సన్పైనే అవిశ్వాసం పెట్టేలా పావులు కదుపుతోందట ఎమ్మెల్యే శిబిరం. ఆ చర్యలకు టీఆర్ఎస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుందని ప్రచారం చేస్తున్నారట. అసలే గ్రూపులు.. ముఠాలు.. వర్గాలు కోదాడ టీఆర్ఎస్ కుంపట్లు రాజేస్తుంటే.. సరిదిద్దాల్సింది పోయి.. కొత్త సమస్యలు తలకెత్తుకుంటున్నారనే చర్చ సాగుతోంది. అభిప్రాయ భేదాలను తొలగించి.. అనుమానాలను నివృత్తి చేయాల్సి చోట తెగేవరకు లాగడం వల్ల ఎవరికి మేలో గుర్తించాలంటోంది కేడర్.
కోదాడ వ్యవహారాలపై టీఆర్ఎస్ అధిష్ఠానం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న అంశాలపై సమాచారం తెప్పించుకున్నారట. మరి.. నేతల మధ్య తలెత్తిన సమస్యలను సర్దుబాటు చేస్తారో.. లేక కఠిన చర్యల దిశగా అడుగులు వేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
-
OTR: ఖద్దర్ వర్సెస్ కలెక్టర్
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!