Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Is There Pressure From Mlas Behind The Suspension Of Warangal Land Pooling G O

వరంగల్ ల్యాండ్ పూలింగ్ జీవో నిలిపివేత వెనుక ఎమ్మెల్యేల ఒత్తిడి ఉందా?

NTV Telugu Twitter
Published Date :May 13, 2022 , 11:19 am
By soma gopal
వరంగల్ ల్యాండ్ పూలింగ్ జీవో నిలిపివేత వెనుక ఎమ్మెల్యేల ఒత్తిడి ఉందా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

గ్రేటర్ వరంగల్ చుట్టూ ఇప్పటికే కొంత ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగింది. మిగతా రింగ్ రోడ్డును నిర్మించేందుకు కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, ఈ రింగ్ రోడ్డు చుట్టూ ల్యాండ్ పూలింగ్​కి ప్లాన్ చేసింది. వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో కలిపి మొత్తం 27 గ్రామాల్లో 21,517 ఎకరాలను సేకరించేందుకు సిద్ధమైంది. వరంగల్​ రింగ్​రోడ్డు వెంట, 27 గ్రామాల్లో భారీ భూ సేకరణకు జీవోను కూడా విడుదల చేసింది. ఆఫీసర్లు సర్వే కూడా ప్రారంభించడంతో ఆయా సర్వే నెంబర్లలో, భూములున్న రైతులు ఆందోళనలకు దిగారు. పచ్చని పొలాల్లో వెంచర్ల ఏర్పటును వ్యతిరేకించారు. ఏటా రెండు, మూడు పంటలు పండే భూములను రియల్ ఎస్టేట్​దందా కోసం ఇవ్వబోమని, గ్రామాల్లో నిరసన దీక్షలకు దిగారు. గ్రామగ్రామాల్లో ధర్నాలు నిరసనలకు రైతులు దిగడంతో, కేయూడీఏ కూడా వెనక్కి తగ్గింది. రైతుల ప్రతిఘటన, ఆగ్రహానికి వెనక్కి తగ్గిన అధికారులు ప్రస్తుతానికి ల్యాండ్ పూలింగ్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేశారు. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు, ల్యాండ్ పూలింగ్ నిరసనల ఎఫెక్ట్ అటు తిరిగి ఇటు తిరిగి స్థానిక ప్రజాప్రతినిధులపై పడింది.

పరకాల వర్ధన్నపేట, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేలపైన ఒత్తిడి పెడగడంతో, ల్యాండ్ పూలింగ్ అంశం పైనా అధికార పార్టీ నేతలు వెనకకు తగ్గక తప్పలేదు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రతిపక్షాలు , రైతులు సంధిస్తున్న ప్రశ్న, ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెనుదుమారం రేపుతోంది. నోటిఫికేషన్ జారీ చేసిన తమ భూముల చెంతనే, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల, ఇతర నాయకుల భూములున్నా, వాటిని ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎందుకు సేకరించడం లేదని నిలదీస్తున్నారు రైతులు. అన్నదాతల భూములతో రియల్ వ్యాపారం చేయాలనుకుంటున్నారా? టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల, వారి అనుచరుల భూముల ఎందుకు కనిపించడం లేదనేది విపక్షాల వేస్తున్న ప్రశ్నలు, ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.

ఎమ్మెల్యేలు వారి అనుచర వర్గం భూముల రేట్లను పెంచుకునేందుకు రైతుల భూములను టార్గెట్ చేశారనే వాదన, వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు వరంగల్ రింగు రోడ్డు చుట్టూ రెవెన్యూ శాఖకు చెందిన కొందరు అధికారులను భాగస్వామ్యం చేసుకొని, అధికార పార్టీ నేతలు ఇటీవల పెద్దఎత్తున భూములు కొనుగోలు చేశారనే విమర్శలు పెరిగాయి. ముఖ్యంగా హసన్ పర్తి, ఐనవోలు, దామెర, ఆత్మకూరు మండలాల్లో రింగు రోడ్డు సమీపంలో రెవెన్యూ అధికారులను అడ్డుపెట్టుకోని కొందరు నేతలు బినామిలతో ముందు జాగ్రత్తగా భూములు కొనుగోలు చేశారనే విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

వరంగల్ మహానగర రింగు రోడ్డు చుట్టూ భూసేకరణ అంశంలో ముందస్తుగా భూమిని కొనుగోలు చేశారనే ప్రచారం ఎందుకు తెరమీదకు వచ్చిందన్న ప్రశ్నకు అనేక సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల భారీస్థాయిలో భూములు కొనుగోలు చేశారనే ప్రచారం జరగడంలో నిజమెంత అనేది వెలికి తీయాలని రైతులు..విపక్షాలు ఒత్తిడి చేయడం జిల్లాలో కాకరేపింది. ఇప్పటికే ధాన్యం కొనుగోలు అంశంలో రైతుల్లో పెరిగిన వ్యతిరేకతకు తోడు, ల్యాండ్ పూలింగ్ అంశంలోనూ రైతుల ఆగ్రహం, నష్టం జరుగుతుందని గుర్తించిన ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, అరూరి రమేష్, అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారట. అధికారులపైనా ఒత్తిడి తెచ్చి ల్యాండ్ పూలింగ్ జీవో ను రద్దు చేయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇంత చేసిన ఎమ్మెల్యేలు, స్థానిక నేతలపై, రైతుల్లో కోపం తగ్గలేదట. ముందస్తుగా భూములుకొని, మాకు అన్యాయం చేస్తున్నారనే భావనతోనే రైతులు ఉండటం, స్థానిక ప్రజా ప్రతినిధులను కలవరానికి గురి చేస్తోందట. అకునున్నది ఒకటి, జరుగుతున్నది మరొకటిని ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్నారట.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Farmers
  • Land Pooling G.o
  • Outer Ring Road
  • Warangal

తాజావార్తలు

  • Off The Record: మూడు రాజధానులపై వైసీపీ స్టాండ్‌ మారుతోందా?.. ఒకటే రాజధాని..?

  • Off The Record: పదవులు లేకపోతే ఆ బీజేపీ నేతలు బయటకు రారా..?

  • Shalini Pandey : తడిసిన అందాలతో హీటు పెంచేసిన శాలినీ పాండే

  • Gaddar Awards : గద్దర్ అవార్డ్స్ మెమెంటో రిలీజ్ చేసిన ప్రభుత్వం

  • Karimnagar: స్వర్గం నుంచి దిగివచ్చిన తల్లిదండ్రులు.. AI వీడియో చూసి బాలిక కన్నీరు

ట్రెండింగ్‌

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్స్‌కు అలర్ట్.. ఇకపై ఆ నంబర్ల నుంచే అధికారిక కాల్స్‌..!

  • 2025 Yezdi Adventure: ఫీచర్లు, డిజైన్‌లో భారీ మార్పులతో యెజ్డీ అడ్వెంచర్ లాంచ్..!

  • Motorola edge 60: 50MP ట్రిపుల్ కెమెరా, IP68 + IP69 రెసిస్టెంట్‌తో లాంచ్ కాబోతున్న మోటరోలా ఎడ్జ్ 60..!

  • REDMAGIC Tablet 3 Pro: 8200mAh బ్యాటరీ, గేమింగ్‌కి హై స్పీడ్ గ్యారంటీతో రాబోతున్న REDMAGIC టాబ్లెట్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions