వరంగల్ ల్యాండ్ పూలింగ్ జీవో నిలిపివేత వెనుక ఎమ్మెల్యేల ఒత్తిడి ఉందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రేటర్ వరంగల్ చుట్టూ ఇప్పటికే కొంత ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరిగింది. మిగతా రింగ్ రోడ్డును నిర్మించేందుకు కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ ఇటీవల నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, ఈ రింగ్ రోడ్డు చుట్టూ ల్యాండ్ పూలింగ్కి ప్లాన్ చేసింది. వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో కలిపి మొత్తం 27 గ్రామాల్లో 21,517 ఎకరాలను సేకరించేందుకు సిద్ధమైంది. వరంగల్ రింగ్రోడ్డు వెంట, 27 గ్రామాల్లో భారీ భూ సేకరణకు జీవోను కూడా విడుదల చేసింది. ఆఫీసర్లు సర్వే కూడా ప్రారంభించడంతో ఆయా సర్వే నెంబర్లలో, భూములున్న రైతులు ఆందోళనలకు దిగారు. పచ్చని పొలాల్లో వెంచర్ల ఏర్పటును వ్యతిరేకించారు. ఏటా రెండు, మూడు పంటలు పండే భూములను రియల్ ఎస్టేట్దందా కోసం ఇవ్వబోమని, గ్రామాల్లో నిరసన దీక్షలకు దిగారు. గ్రామగ్రామాల్లో ధర్నాలు నిరసనలకు రైతులు దిగడంతో, కేయూడీఏ కూడా వెనక్కి తగ్గింది. రైతుల ప్రతిఘటన, ఆగ్రహానికి వెనక్కి తగ్గిన అధికారులు ప్రస్తుతానికి ల్యాండ్ పూలింగ్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేశారు. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు, ల్యాండ్ పూలింగ్ నిరసనల ఎఫెక్ట్ అటు తిరిగి ఇటు తిరిగి స్థానిక ప్రజాప్రతినిధులపై పడింది.
పరకాల వర్ధన్నపేట, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేలపైన ఒత్తిడి పెడగడంతో, ల్యాండ్ పూలింగ్ అంశం పైనా అధికార పార్టీ నేతలు వెనకకు తగ్గక తప్పలేదు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రతిపక్షాలు , రైతులు సంధిస్తున్న ప్రశ్న, ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెనుదుమారం రేపుతోంది. నోటిఫికేషన్ జారీ చేసిన తమ భూముల చెంతనే, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల, ఇతర నాయకుల భూములున్నా, వాటిని ల్యాండ్ పూలింగ్ ద్వారా ఎందుకు సేకరించడం లేదని నిలదీస్తున్నారు రైతులు. అన్నదాతల భూములతో రియల్ వ్యాపారం చేయాలనుకుంటున్నారా? టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల, వారి అనుచరుల భూముల ఎందుకు కనిపించడం లేదనేది విపక్షాల వేస్తున్న ప్రశ్నలు, ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.
Also Read
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
- OTR: గూడూరు వైసీపీలో ఇంచార్జ్ మార్పు చిచ్చు.. నేతలను బుజ్జగించేందుకు మిథున్ రెడ్డి ఎంట్రీ
ఎమ్మెల్యేలు వారి అనుచర వర్గం భూముల రేట్లను పెంచుకునేందుకు రైతుల భూములను టార్గెట్ చేశారనే వాదన, వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు వరంగల్ రింగు రోడ్డు చుట్టూ రెవెన్యూ శాఖకు చెందిన కొందరు అధికారులను భాగస్వామ్యం చేసుకొని, అధికార పార్టీ నేతలు ఇటీవల పెద్దఎత్తున భూములు కొనుగోలు చేశారనే విమర్శలు పెరిగాయి. ముఖ్యంగా హసన్ పర్తి, ఐనవోలు, దామెర, ఆత్మకూరు మండలాల్లో రింగు రోడ్డు సమీపంలో రెవెన్యూ అధికారులను అడ్డుపెట్టుకోని కొందరు నేతలు బినామిలతో ముందు జాగ్రత్తగా భూములు కొనుగోలు చేశారనే విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
వరంగల్ మహానగర రింగు రోడ్డు చుట్టూ భూసేకరణ అంశంలో ముందస్తుగా భూమిని కొనుగోలు చేశారనే ప్రచారం ఎందుకు తెరమీదకు వచ్చిందన్న ప్రశ్నకు అనేక సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల భారీస్థాయిలో భూములు కొనుగోలు చేశారనే ప్రచారం జరగడంలో నిజమెంత అనేది వెలికి తీయాలని రైతులు..విపక్షాలు ఒత్తిడి చేయడం జిల్లాలో కాకరేపింది. ఇప్పటికే ధాన్యం కొనుగోలు అంశంలో రైతుల్లో పెరిగిన వ్యతిరేకతకు తోడు, ల్యాండ్ పూలింగ్ అంశంలోనూ రైతుల ఆగ్రహం, నష్టం జరుగుతుందని గుర్తించిన ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, అరూరి రమేష్, అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారట. అధికారులపైనా ఒత్తిడి తెచ్చి ల్యాండ్ పూలింగ్ జీవో ను రద్దు చేయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇంత చేసిన ఎమ్మెల్యేలు, స్థానిక నేతలపై, రైతుల్లో కోపం తగ్గలేదట. ముందస్తుగా భూములుకొని, మాకు అన్యాయం చేస్తున్నారనే భావనతోనే రైతులు ఉండటం, స్థానిక ప్రజా ప్రతినిధులను కలవరానికి గురి చేస్తోందట. అకునున్నది ఒకటి, జరుగుతున్నది మరొకటిని ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్నారట.
తాజావార్తలు
-
Raviteja: ‘ఇరుముడి’ విధ్వంసం.. వివేక్ ఆత్రేయతో మాస్ మహారాజా క్రేజీ ప్రాజెక్ట్ ఖరారు!
-
Joe Root: రిక్కీ పాంటింగ్ రికార్డు చెల్లాచెదురు.. జో రూట్ అరుదైన ఘనత..
-
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
-
Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!