Off The Record: నాగర్ కర్నూల్ జడ్పీ రాజకీయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగర్కర్నూల్ జడ్జీ ఛైర్మన్ ఎన్నిక వెనుక ఎలాంటి రాజకీయం నడిచింది ? ఎంపీ తనయుడు ఛైర్మన్ కాకుండా అడ్డుకున్న ఎమ్మెల్యే ఎవరు ? ఇప్పుడా ఎంపీ తనయుడు ఏం చేస్తున్నారు ? ఎక్కడ కోల్పోయారో అక్కడే సాధించాలని…ఆ నేత కొత్త ప్లాన్ సిద్దం చేసుకుంటున్నారట. ఇంతకీ ఆ నేత ఎవరు ?
నాగర్కర్నూల్ జిల్లా పరిషత్ రాజకీయం రంజుగా సాగాయ్. జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు వేసిన ఎత్తుగడలకు తండ్రీ కొడుకులు కుదేలయ్యారు. 2019లో జెడ్పీ చైర్పర్సన్ పదవి ఎస్సీ వర్గాలకు రిజర్వ్ చేశారు. దీంతో ఎంపీ రాములు… తన కొడుకు భరత్ను కల్వకుర్తి నుంచి పోటీచేయించి గెలిపించుకున్నారు. తర్వాత భరత్కే జిల్లా పరిషత్ పీఠమంటూ ప్రచారం జరిగింది. భరత్ పదవీ చేపట్టడం లాంఛనమనే అభిప్రాయం ఉండేది. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్.. నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డిల…పరిస్థితిని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకున్నారు. తెల్కపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు పద్మావతిని… ఛైర్పర్సన్గా ఎంపిక చేశారు. .
Also Read
- Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
- Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
- Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
- Off The Record : బీఆర్ఎస్ లో కలకలం రేపుతున్న సభ్యత్వ నమోదు వ్యవహారం
జడ్పి చైర్ పర్సన్ గా ఎన్నికైన పద్మావతి తనకు ముగ్గురు సంతానం అనే విషయాన్ని దాచారంటూ ప్రత్యర్థి కోర్టుకు వెళ్లారు. దీంతో ఎన్నిక రద్దయింది. ఇపుడైనా తనకు పదవి లభిస్తుందని ఆశపడ్డ భరత్కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఈ సారి ఊర్కొడ జడ్పిటిసి శాంత కుమారికి జడ్పి చైర్ పర్సన్ పదవి దక్కింది. దీంతో నాగర్కర్నూలు ఎంపీ రాములు వర్గీయులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తీవ్ర మనస్థాపం చెందిన భరత్…పదవికి రాజీనామా చేసి… పొగొట్టుకున్న చోటే వెతుక్కుంటానని ప్రటించారు. అచ్చంపేటలోనే తానేంటో నిరూపించుకుంటానంటూ ప్రకటించారు. నియోజకవర్గంలో విస్త్రతంగా పర్యటిస్తుండటంతో…టీఆర్ఎస్ రెండువర్గాలుగా చీలిపోయింది.
తన కుమారుడికి జడ్పీ ఛైర్మన్ పదవి రాకుండా అచ్చంపేట ఎమ్మెల్యే బాలరాజే అడ్డుకున్నారని ఎంపి రాములు అండ్ టీం ఆరోపిస్తోంది. జడ్పి చైర్మన్ ఎన్నిక రోజే గువ్వల బాలరాజుతో నీకేం అన్యాయం చేశానంటూ ఎంపి రాములు ప్రశ్నించారు. ఈ పరిణామం కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ను షాకయ్యేలా చేసింది. అంతా భరత్కే అవకాశం ఉంటుందని భావిస్తున్న తరుణంలో…ఈ మార్పుపై పెద్ద రాజకీయమే నడిచినట్లు తెలుస్తోంది.
జడ్పీటీసి భరత్ దూకుడు…రెండోసారి కూడా చైర్మన్ పదవిని దూరం చేసిందని చర్చించుకుంటున్నారు . భరత్ జడ్పీ ఛైర్మన్ అయితే…భవిష్యత్లో అచ్చంపేట లో తనకు పోటీ ఉంటుందని గువ్వల బాలరాజ్ భావించారు. అందుకే ఇలా స్కెచ్ వేసారని చర్చించుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చట్టసభలకు పంపించడం కోసమే…జడ్పి చైర్మన్ అవకాశం ఇవ్వలేదేమో అని భరత్ వ్యాఖ్యానించడండతో అచ్చంపేట టిఆర్ఎస్లో కాక రేపుతోంది. టికెట్ దక్కక పోతే రెబల్గా అయినా బరిలోకి దిగడం ఖాయమని భరత్ టీం చెబుతోందట. ఈ పరిణామాలన్నీఅచ్చంపేట భవిష్యత్ రాజకీయాలపై ఎలా ప్రభావం చూపుతాయో చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!