Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Guntur Ycp Mlas Comments On Government

గుంటూరు జిల్లా వైసీపీలో సెల్ఫ్‌గోల్‌…!

Published Date :December 15, 2021 , 5:06 pm
By Manohar
గుంటూరు జిల్లా వైసీపీలో సెల్ఫ్‌గోల్‌…!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

గుంటూరు జిల్లా వైసీపీలో సెల్ఫ్‌గోల్‌…! స్ట్రాటజీ లోపించిందో ఏమో.. సొంత ప్రభుత్వాన్నే ఇరకాటంలో పెట్టేశారు అధికారపార్టీ ఎమ్మెల్యేలు. స్వపక్షంలో విపక్షంగా మారి చర్చల్లోకి వచ్చారు. మంత్రి, ఎమ్మెల్యేలు మీటింగ్‌కు వచ్చినా.. కలెక్టర్‌, JCలు రాకపోవడం అనుమానాలకు కారణమై.. కొత్త చర్చకు దారితీసింది. ఎందుకిలా?

వాళ్ల పరువు వాళ్లే తీసేసుకుంటున్నారా?

Also Read

  • Off The Record: రచ్చ రచ్చ అవుతున్న గజ్వేల్ కాంగ్రెస్ గొడవ
  • Off The Record: విభేదాలకు చెక్ పెట్టబోతున్న పవన్ కల్యాణ్‌..!
  • Off The Record: ఆ జిల్లా కలెక్టర్ ని చూసి ఎమ్మెల్యేలు భయపడుతున్నారా..?
  • Off The Record: కలిసిరాని నియోజకవర్గాన్ని టీడీపీ పూర్తిగా సైడ్ చేసేసినట్టేనా?
Add as a preferred
source on google

గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలుంటే.. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది 15. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలలో మద్దాలి గిరి.. వైసీపీకి జై కొట్టేశారు. దాంతో అధికారపార్టీ బలం పదహారుకు పెరిగింది. ఈ జాబితాలో సీనియర్‌ ఎమ్మెల్యేలకు.. విపక్షాలపై విరుచుకుపడేవాళ్లకు కొదవ లేదు. కాకపోతే.. ఎమ్మెల్యేలకు బొత్తిగా స్ట్రాటజీ లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాళ్ల పరువు వాళ్లే తీసేసుకుంటున్నారు. ప్రభుత్వానికి మాట రాకుండా కాపుకాయడం సంగతి దేవుడెరుగు.. రక్షించాల్సిన వాళ్లే తమ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే పరిస్థితి తెస్తున్నారు. ఇటీవల జరిగిన గుంటూరు జిల్లా పరిషత్‌ సమావేశం చూసినవాళ్లకు కలిగే అనుమానం ఇదే.

జడ్పీ మీటింగ్‌లో పాండిత్యం ప్రదర్శించిన ఎమ్మెల్యే..!
అధికారులు వారిస్తున్నా.. మిర్చి రైతులకు పరిహారం ఇవ్వాలని తీర్మానం..!

సమావేశంలో ప్రతిపక్షం లేకపోతే బాగోదని అనుకున్నారో ఏమో.. వైసీపీ ఎమ్మెల్యేలే ఆ పాత్ర పోషించారు. అసెంబ్లీ స్థాయిలో మాట్లాడాల్సిన అంశాలను జడ్పీ మీటింగ్‌లో ప్రస్తావించి ఆశ్చర్య పరిచారు ఓ ఎమ్మెల్యే. నీళ్లు.. రూరల్‌ రోడ్ల సమస్యలు ప్రస్తావించాల్సిన చోట.. తన పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ ఏవేవో.. మాట్లాడటం.. ఆ ఎమ్మెల్యేకి మామూలైందట. గుంటూరు జిల్లాలో మిర్చి ప్రధాన పంట. ప్రస్తుతం పంటకు తామర తెగులు వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో దెబ్బతిన్న రైతులకు పరిహారం ఇవ్వాలని జడ్పీ మీటింగ్‌లో బలవంతంగా రాష్ట్రంలో లక్షా 20 వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నదని.. అందరికీ పరిహారం ఇచ్చినట్టు అవుతుందని తీర్మానం చేయించారు ఎమ్మెల్యేలు. అప్పటికే అధికారులు వారిస్తున్నా.. ఎమ్మెల్యేలు వినలేదట. ఆ సమావేశానికి వచ్చిన MP ఒకరు వ్యవసాయశాఖ కమిషనర్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పారట. జడ్పీ మీటింగ్‌లో తీర్మానం చేస్తే ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుందని కమిషనర్‌ చెప్పినట్టు తెలుస్తోంది. రాష్ట్రమంతా ఇదే పద్ధతిలో సర్కార్‌పై ఒత్తిడి పెంచుతారని వెల్లడించారట. కానీ.. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు జడ్పీ సమావేశంలో అత్యుత్సాహం చూపించారట.

అధికారులను పిలిచినా రాలేదన్న సంకేతాలు వెళ్లాయా?

ఇదే కాదు.. జడ్పీ మీటింగ్‌కు మంత్రి మేకతోటి సుచరిత.. ఎమ్మెల్యేలు వస్తే.. జిల్లా కలెక్టర్‌ డుమ్మా కొట్టేశారు. వేరే పని ఉందని వెళ్లిపోయారు. జాయింట్‌ కలెక్టర్‌ను పిలిస్తే.. కరోనా లక్షణాల పేరు చెప్పి మీటింగ్‌ ఛాయలకు రాలేదు. మరో ఇద్దరు JCలు ఉన్నా.. వారికి మీటింగ్‌ సమాచారమే లేదట. మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తే.. కిందిస్థాయి అధికారులే జడ్పీ మీటింగ్‌లో కనిపించారు. కలెక్టర్‌, JC ఎందుకు రాలేదో..మీటింగ్‌కు వచ్చిన ప్రజాప్రతినిధులకు తెలుసు. అయినప్పటికీ మీటింగ్‌ సమాచారం ఉండి కూడా పైఅధికారులు రాకపోవడం బాధాకరమని కామెంట్‌ పాస్‌ చేశారు హోంమంత్రి. ఈ స్టేట్‌మెంట్‌ బయటకు రాంగ్ సిగ్నల్‌ పంపింది. మంత్రులు.. ఎమ్మెల్యేలను అధికారులు లైట్‌ తీసుకున్నారా.. లెక్క చేయడం లేదా అని చెవులు కొరుక్కున్నారు. అధికారులు మీటింగ్‌కు ఎందుకు రాలేదో చెబితే సరిపోయేది. కానీ.. వాళ్లు పిలిచినా రాలేదన్న సంకేతాలు బయటకు వెళ్లిపోయాయి.

అధికారులు వ్యూహాత్మకంగానే మీటింగ్‌కు రాలేదా?

ఈ సమాచార లోపంపై మరో చర్చ కూడా జరుగుతోంది. జడ్పీ మీటింగ్‌లో మిర్చిపంటను, ఇతర సమస్యలను అధికారపార్టీ ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తారని తెలిసే.. ఉన్నతాధికారులు రాలేదని చెబుతున్నారు. పంట నష్టం వివరాలు సమర్పిస్తే.. దానికి పరిహారం ఇచ్చే స్థితిలో ప్రభుత్వం ఉందా.. లేదా..? ఎందుకొచ్చిన గొడవ అనుకొని వ్యూహాత్మకంగా గైర్హాజరైనట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇవేమీ పట్టించుకోని అధికారపార్టీ ప్రజాప్రతినిధులు.. మిర్చి పంట నష్టంపై అంచనాలు వేసేసి.. పరిహారం ఇవ్వాల్సిందేనని జడ్పీ మీటింగ్‌లో తీర్మానం చేసేసి ప్రభుత్వానికి పంపించేశారు. దాన్ని కనుక ప్రతిపక్షం పట్టుకుని పరిహారం ఏది? ఎక్కడా? అని అంటే ఇరకాటంలో పడేది సర్కారే. అంతేకాదు కంటి తుడుపు చర్యగా.. మొక్కుబడిగా తీర్మానం చేసి చేతులు దులిపేసుకుంటున్నారనే విమర్శలను వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. వెనకా ముందు ఆలోచించకుండా ఏదంటే అది మాట్లాడి సెల్ఫ్‌గోల్‌ వేసుకుంటున్నారని.. ఎమ్మెల్యేలకు బొత్తిగా స్ట్రాటజీ లేకుండా పోయిందనే కామెంట్స్‌ జోరందుకున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • Guntur
  • guntur ycp mlas
  • ycp
  • YCP MLAs

తాజావార్తలు

  • Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ ‘రాగి సమోసా’ను ‘సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!

  • Tamil Politics: విజయ్‌పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?

  • RCB vs MI : RCB బౌలర్ల ధాటికి ముంబై తడబాటు.. భువనేశ్వర్ కుమార్ ‘నాలుగు’ వికెట్ల పంజా.!

  • PM Modi: పవన్ ఇంటికి ప్రధాని మోడీ.. సోషల్ మీడియాలో ఫ్యామిలీ పిక్ వైరల్! ఫోటో చూశారా..

  • PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions