తెలంగాణ కాంగ్రెస్లో కొత్త పేచీలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాకు అది చెప్పలేదు.. ఇది చెప్పలేదు. తెలంగాణ కాంగ్రెస్లో నిత్యం ఇలాంటి పంచాయితీలు ఏవో ఒకటి కామన్. చీమ చిటుక్కుమన్నా హైకమాండ్కు వెంటనే ఫిర్యాదు చేసేస్తారు. పేచీలకు అదీ ఇదీ అనే విభజన రేఖ ఏదీ ఉండదు. ప్రస్తుతం అలాంటి ఒక అంశమే పార్టీలో చర్చగా మారింది.
గాంధీభవన్లో జరిగిన మీటింగ్పై కాంగ్రెస్ సీనియర్లు గుర్రు
Also Read
- Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
- OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
- Off The Record: పాలకొల్లు వైసీపీకి ఎందుకు కలిసిరావడం లేదు?
- Off The Record: ఆ 24 మంది ఎవరు? తాడిపత్రిలో జేసీ సంచలన హెచ్చరిక
కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు చేపడుతోందని ఉద్యమిస్తోన్న వామపక్ష పార్టీలతో అఖిలపక్ష సమావేశం పేరుతో మీటింగ్ నిర్వహించారు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్రెడ్డి. కేంద్ర సర్కార్ విధానాలతోపాటు.. పోడు భూముల అంశంపై ఆందోళనకు దిగాలని ఆ సమావేశంలో నిర్ణయించారు. ఈ మీటింగ్కు గాంధీభవన్ వేదికైంది. చాలా రోజుల తర్వాత లెఫ్ట్ పార్టీల నాయకులు గాంధీభవన్కు వచ్చారు. భారత్ బంద్తోపాటు.. పోడు భూముల సమస్యలపై ఆయా వర్గాలకు దగ్గర కావాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. గాంధీభవన్లో జరిగిన ఈ సమావేశమే కాంగ్రెస్ సీనియర్ నాయకులలో రచ్చకు కారణమైంది.
కీలక సమావేశం ఎందుకు చెప్పలేదని ప్రశ్న!
అఖిలపక్షం పేరుతో నిర్వహించిన ఈ సమావేశాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తప్పు పడుతున్నారు. గాంధీభవన్లో జరిగిన భేటీపై కనీసం పార్టీ నాయకులమైన తమకు సమాచారం లేదని గుర్రుగా ఉన్నారట. ఇదే అంశాన్ని AICC రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్కు ఫిర్యాదు చేశారట. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి గీతారెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్లు అసంతృప్తి వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు. గాంధీభవన్లో పార్టీ ఆధ్వర్యంలో ఒక కీలక సమావేశం నిర్వహించేటప్పుడు ఇతర కాంగ్రెస్ నేతలకు చెప్పకుండా చేయడం ఏంటన్నది వారి ప్రశ్న.
కమ్యూనికేషన్ గ్యాపే కొత్త చర్చగా మారిందా?
వాస్తవానికి పార్టీలో అందరికీ సమావేశంపై సమాచారం ఇవ్వాలని.. మీటింగ్కు వచ్చే వారిలో సమన్వయం చేసుకోవాలని తనకు సన్నిహితంగా ఉండే ఓ నాయకుడికి పీసీసీ చీఫ్ చెప్పారట. ఆయనేమో.. సొంతపార్టీ నేతలకు సమాచారం ఇవ్వలేదట. ఇప్పుడీ కమ్యూనికేషన్ గ్యాపే కొత్త చర్చగా మారి.. రచ్చ రచ్చ అవుతోంది. కాంగ్రెస్ సీనియర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పీసీసీ చీఫ్ దగ్గర ప్రస్తావించారట పార్టీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్. సీనియర్లకు సమాచారం ఇవ్వకూడదనే ఆలోచన ఏమీ లేదని.. అఖిలపక్ష భేటీకి పార్టీ నుంచి ఒక్కరే వెళ్తారు కదా అని రేవంత్ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఛాన్స్ చిక్కితే పైచెయ్యి సాధించే పనిలో ఉన్నారా?
పీసీసీకి కొత్త కమిటీ వచ్చాక భారీ స్థాయిలో సభలు… సమావేశాలు ఏర్పాటు చేస్తున్నా.. సీనియర్ల మధ్య పొసగడం లేదన్నది ఓపెన్ టాక్. ఇప్పటికే అనేక ఫిర్యాదు వెళ్లాయి. భారీ ఎత్తున నిర్వహించిన కార్యక్రమాలకు కొందరు సీనియర్లు ఇప్పటికీ హాజరు కాలేదు. ఛాన్స్ చిక్కితే పైచెయ్యి సాధించే పనిలో ఉన్నారు. ఇప్పుడు గాంధీభవన్ మీటింగ్ కూడా ఈ కోవలోకే చేరి చర్చగా మారింది. మరి.. కాంగ్రెస్లో అంతే అని ఊరుకుంటారో.. లేక ఇలా జరిగితేనే అంతా అదుపులో ఉంటారని ఊరుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
-
Rishab Shetty: రామాయణ ట్రైలర్కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
-
Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!