Ganta Confusion: ఎమ్మెల్యే గంటా దారెటు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ మాజీ మంత్రి రాజకీయ దోబూచులాడుతున్నారు. పార్టీలోనే ఉంటానంటారు. హైకమాండ్ పిలిస్తే మాత్రం పలకరు. ఉనికి కోసమే అనుకుంటే.. వ్యూహాలను తెరపైకి తెస్తారు. రెండున్నరేళ్లుగా ఇదే ఆయన స్టయిల్. ఇప్పుడైనా క్లారిటీకి వస్తున్నారా అంటే వెయింట్ అండ్ సీ అంటున్నారు. ఇంతగా కన్ఫ్యూజన్లో ఉన్న ఆ నేత ఎవరు?
టీడీపీ కోసం బహిరంగ వేదికలపైకి వచ్చిన సందర్భం లేదు
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. టీడీపీ ఎమ్మెల్యే. సైకిల్ పార్టీతో సుదీర్ఘ అనుభవం ఉన్న కాపు నేత. అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ వార్తల్లో నిలిచేందుకు తాపత్రయపడతారు. ఈక్వేషన్లు, కేలిక్యూలేషన్లతో రాజకీయాలను తన చుట్టూ తిప్పుకోవాలనే ఆత్రం ఆయనలో కనిపిస్తుంది. ప్రస్తుతం విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి MLAగా ఉన్న ఆయన రాజకీయ స్తబ్ధత పాటిస్తున్నారు. పార్టీకి, ప్రజలకు పెద్దగా అందుబాటులో ఉండటం లేదు. నార్త్ బాధ్యతలను ఇంఛార్జ్ చేతుల్లో పెట్టి యాక్టివ్ పాలిటిక్స్కు దూరం జరిగినట్టు కనిపించారు. కానీ.. GVMC ఎన్నికల్లో అధినాయకుడితో కలిసి ప్రచారం చేసిన తర్వాత.. పార్టీకోసం బహిరంగ వేదికలపైకి వచ్చిన సందర్భం లేదు.
Also Read
చంద్రబాబుతో భేటీకి టైమ్ ఫిక్స్ అయ్యాక వాయిదా వేసుకున్న గంటా..!
గంటాకు టీడీపీ హైకమాండ్కు మధ్య దూరం పెరిగిందనే భావన ఉంది. అది నిజమే అన్నట్టు ఆయన వైఖరి ఉంటోంది. ఉత్తరాంధ్రలో పార్టీ పటిష్టత, భవిష్యత్ ప్రణాళికల కోసం చంద్రబాబు ఎమ్మెల్యేలతో ముఖాముఖీ సమావేశం అవుతున్నారు. ఆ భేటీ కోసం ఎన్టీఆర్ భవన్ నుంచి గంటాకు పిలుపు వచ్చింది. డేట్.. టైమ్ ఫిక్స్ అయ్యాక ఆఖరి నిముషంలో అధినేతతో భేటీ వాయిదా వేసుకున్నారు గంటా. దీనికి ఆయన దగ్గర బలమైన కారణాలు ఏవీ కనిపించలేదు. దీంతో అసలు ఏం జరుగుతుందనే ఉత్సుకత రాజకీయ వర్గాల్లో రేకెత్తింది.
అసలు సంగతి వేరే ఉందా?
చాలా కాలంగా గంటా శ్రీనివాస్ పక్కపార్టీలవైపు చూస్తున్నారనే ప్రచారం నలుగుతోంది. మొదట్లో వైసీపీలో చేరేందుకు గట్టి ప్రయత్నాలు చేసినా వర్కవుట్ కాలేదు. మంత్రి అవంతి, ఎంపీ విజయసాయిరెడ్డి వంటి వారు బహిరంగ వేదికలపైనే వ్యతిరేకించారు. ఆ తర్వాత టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్న గంటా.. మధ్యలో కాస్త యాక్టివ్ రోల్ తీసుకునేందుకు ప్రయత్నించారు. తాజాగా అధినేతతో సమావేశానికి గంటా డుమ్మాకొట్టడం వెనక అసలు కారణాలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. త్వరలో చంద్రబాబును వ్యక్తిగతంగా వెళ్లి కలవాలనే ఆలోచనలో భాగంగానే మీటింగ్కు హాజరు కాలేదని గంటా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే.. అసలు సంగతి ఖచ్చితంగా వేరే ఉందనేది వినికిడి.
చిరంజీవితో జరిగే భేటీలో రాజకీయాలపై చర్చిస్తారా?
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవితో గంటా భేటీ కానున్నారు. వీరిద్దరి మధ్య చాన్నాళ్లుగా అనుబంధం ఉంది. ఈసారి భేటీ పూర్తిగా రాజకీయ చర్చలకు సంబంధించిందేనని భోగట్టా. వచ్చే ఎన్నికల నాటికి జనసేన, తెలుగుదేశం జట్టుకట్టే సంకేతాలు కనిపిస్తున్నాయి.
క్షేత్రస్ధాయిలో ఇప్పటికే రెండుపార్టీలు ఒక అవగాహనకు వచ్చేసినట్టే చెబుతున్నారు. ఈ తరుణంలో రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరించాలనేది గంటా ఆలోచనట. కాపు సామాజికవర్గం నాలుగురోడ్ల కూడలిలో రాజకీయ అవకాశం కోసం ఎదురు చూస్తోంది. అలాగని కొత్త పార్టీల వంటి ప్రయోగాలు చేసే అవకాశం, ఆస్కారం కనిపించడం లేదు. దీంతో సామాజికవర్గాన్ని జనసేనవైపు డ్రైవ్ చేయడం ద్వారా ఓటింగ్ శాతం పెంచుకోవడం కీలకమనే చర్చకు దారితీసింది. టీడీపీ, జనసేనల మధ్య సర్దుబాట్లు, ఓటింగ్ శాతం ఆధారంగా తన రాజకీయ భవిష్యత్ను నిర్ణయించుకోవాలనే ఆలోచనలో గంటా ఉన్నారట. అప్పటి వరకు ఆయన వెయింట్ అండ్ వాచ్ విధానంలో ఉంటారట.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!