ఆది మీద అనుమానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ వ్యక్తిపై పార్టీకి నమ్మకం లేదా? పార్టీని భుజాన వేసుకుని తిరుగుతున్నా అధిష్ఠానం నమ్మడం లేదా? సొంత కుటుంబం నుంచే ఆ మాజీ మంత్రి రాజకీయ భవిష్యత్ ఇబ్బందిలో పడబోతుందా?
ఎవరూ ఊహించని విధంగా బీజేపీలో చేరిన ఆది
వైసీపీలో గెలిచి టీడీపీలో చేరి.. మంత్రి పదవి పట్టేశారు ఆదినారాయణరెడ్డి. మంత్రి అవడమే జిల్లా మొత్తం పెత్తనం చేశారు. పార్టీ అవసరాలలో భాగంగా ఆగర్భ శత్రువు రామసుబ్బారెడ్డితో రాజీ పడి 2019 ఎన్నికల్లో జమ్మలమడుగు వదిలి కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీలో ఉండగా తాను విమర్శించిన జగన్మోహన్రెడ్డి సీఎం కావడంతో ఆదికి భవిష్యత్ కళ్లముందు కనిపించింది. అంతే ఎవరూ ఊహించని విధంగా బీజేపీలో చేరిపోయారు.
Also Read
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- OTR: ఆ ముగ్గురు నేతలపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుందా..?
- Off The Record: నోటిఫికేషన్ రాకముందే కూటమిలో కుంపటి.. మేయర్ పదవులపై టీడీపీ-జనసేన మధ్య రచ్చ?
- Off The Record: 20 ఏళ్లుగా ఎన్నికలే లేవు.. శ్రీకాకుళం ఎన్నికల వాయిదా వెనుక అసలు కథ ఇదే?
కీలక కమిటీలో ఆదికి చోటు కల్పించని బీజేపీ
అగ్రనేతలు లేని బీజేపీ ఆది రాగానే ఆదరించింది. బాధ్యతలు కూడా అప్పగించింది. భవిష్యత్లో ఎలా ఉంటారో ఏమో కానీ.. ప్రస్తుతానికి బీజేపీతో కలిసి మెలిసిపోతున్నారు. అంతా బాగుందనుకుంటున్న టైమ్లో బీజేపీలో ఆది మీద అనుమానాలు మొదలయ్యాయనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో బీజేపీని సమన్వయ పర్చడానికి ఓ కమిటీని వేసింది పార్టీ హైకమాండ్. ఆదినారాయణరెడ్డితోపాటు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేష్లకు అందులో చోటుకల్పించారు. కమిటీలో 12 మంది ఉంటే ఆదికి ఒక్కరికే చోటు దొరకలేదు. రెడ్డి సామాజికవర్గం. అదీ సీఎం జగన్ సొంత జిల్లా. అలాంటిచోట ఆది ఉండాలి. ఆయనకు ప్రాధాన్యం దక్కాలి. కానీ హైకమాండ్ ఆయన్ను లైట్ తీసుకుంది. కమిటీలో ప్రాధాన్యం ఇవ్వలేదు.
అన్న కుమారుడు టీడీపీలో ఉండటం వల్లే ఆదికి బీజేపీలో ప్రాధాన్యం తగ్గిందా?
కమిటీలో చోటుదక్కకపోవడానికి కారణం ఆది ఫ్యామిలీనేనట. ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరడంతో తన రాజకీయ వారసుడని ఆయన గతంలో ప్రకటించిన అన్న కొడుకు భూపేష్రెడ్డి టీడీపీలో చేరిపోయారు. జమ్మలమడుగు ఇంఛార్జ్ అయిపోయారు. ఒకప్పుడు అన్నదమ్ముల అనుబంధం అంటే ఇలాగే ఉండాలి అన్నట్టు ఉండే ఆది ఫ్యామిలీలో తొలిసారి చీలిక వచ్చింది. తలో పార్టీలో చేరిపోయారు. సొంత అన్న కొడుకు టీడీపీలో ఉండటం వల్లే ఆదికి బీజేపీ ప్రాధాన్యం తగ్గించిందని ప్రచారం జరుగుతోంది.
అటు మొగ్గు చూపుతారనే కమిటీలోకి తీసుకోలేదా?
రక్తసంబంధంతో ఆది అటు మొగ్గితే ప్రమాదం అనుకుందో ఏమో కీలకమైన కమిటీలో చేర్చకుండా బీజేపీ పక్కన పెట్టిందని ఆయన అనుచరులు చెవులు కొరుక్కుంటున్నారు. అందులో ఎంత నిజం ఉందో ఏమో కానీ.. ఫ్యామిలీ వల్లే పదవి రాలేదనే ఫీలింగ్లో ఆది అనుచరులు ఉన్నారట.
తాజావార్తలు
-
Vivo X500 Series: సెప్టెంబర్లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
-
IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన ‘ఇరుముడి’
-
Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ హీరోగా ‘శివాలయం’ మూవీ!
-
Gold Price Today: మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. రూ.1.63 లక్షలు దాటిన గోల్డ్ ధర
-
Shoriful Islam History: 140 ఏళ్లలో ఇదే తొలిసారి.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ స్టార్!
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..