టీడీపీకి కలిసిరాని ఒంగోలు లోక్సభ రాజకీయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకాశం జిల్లా ఒంగోలు లోక్సభ సెగ్మెంట్. ఇప్పటి వరకూ 17సార్లు ఎన్నికలు జరిగాయి. టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన పది ఎన్నికల్లో కేవలం రెండుసార్లు మాత్రమే సైకిల్ గెలిచింది. ఒకసారి బెజవాడ పాపిరెడ్డి.. మరోసారి కరణం బలరామ్లే టీడీపీ ఎంపీలుగా గెలిచారు. మొదటి నుంచి కాంగ్రెస్కు.. తర్వాత వైసీపీకి పెట్టని కోటలా మారింది ఒంగోలు లోక్సభ స్థానం. పైగా ఇక్కడ అభ్యర్థిని బరిలో దించాలంటే టీడీపీకి తలకు మించిన భారంగా ఉంటోందట. ఎన్నికల్లో ఎవరో ఒకర్ని నియమించడం.. ఓటమి తర్వాత వారు కనిపించకుండా పోవడం టీడీపీలో కామనైంది.
2014లో టీడీపీలో చేరిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి సైకిల్ గుర్తుపై పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ మాగుంటకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది టీడీపీ. గత ఎన్నికల సమయంలో మాగుంట టీడీపీకి గుడ్బై చెప్పి వైసీపీలో చేరిపోయారు. మంత్రిగా పనిచేసిన శిద్దా రాఘవరావు ఆ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసినా తెలుగుదేశానికి లక్ కలిసి రాలేదు. ఎన్నికల తర్వాత శిద్దా కూడా వైసీపీలో చేరిపోయారు. అప్పటి నుంచి ఒంగోలు టీడీపీకి పార్లమెంట్ ఇంఛార్జ్ కరువైపోయారు. లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం కొండెపి మాత్రమే టీడీపీ గెల్చుకుంది. జిల్లాల విభజనలో టీడీపీ గెలిచిన అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాలు బాపట్ల జిల్లా పరిధిలోకి వెళ్లాయి. దీంతో ఒంగోలు లోక్సభ పరిధిలో టీడీపీ మరింత వీకైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read
తూర్పు, పశ్చిమ ప్రాంతాల కలయికతో ఉండే ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్లో పశ్చిమ ప్రాంతం గత ఎన్నికల్లో టీడీపీని కోలుకొలేని దెబ్బతీసింది. నాయకులు నిస్తేజంగా ఉన్నా కేడర్ పార్టీ కార్యక్రమాలను నెట్టుకొస్తోంది. జిల్లాల పునర్విభజన టీడీపీకి కష్టాలు తప్పడం లేదు. కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే పార్టీకి మిగలడంతో ఆందోళన చెందుతున్నారట. ఎప్పటిలా లోక్సభ విషయంలో కాడి వదిలేసి.. అసెంబ్లీలపై దృష్టి పెట్టాలా అని లెక్కలు వేసుకుంటున్నారట. గతంలోలా ఎన్నికల సమయానికి ఎవరో ఒకరు టీడీపీలోకి వస్తారు.. ఎన్నికల్లో పోటీ చేస్తారు అని సర్ది చెప్పుకొనే పరిస్థితి ఉందట. ఎన్నికల ఖర్చు తడిసి మోపెడు కావడం.. ఎవరైనా పార్టీని వీడి వెళ్లిపోతే మరో నాయకుడిని సిద్ధం చేసుకోకపోవడం పెద్ద మైనస్గా ఉందన్నది కేడర్ చెప్పేమాట.
ఎన్నికలకు ముందుగానే లోక్సభకు ఒక బలమైన నేతను ప్రకటిస్తే.. అసెంబ్లీ ఇంఛార్జ్లను కలుపుకొని వెళ్లి.. టీడీపీని బలోపేతం చేసుకునే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారట పార్టీ నాయకులు. మరి.. టీడీపీ అధిష్ఠానం ఏం చేస్తుందో.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!