టీడీపీకి కలిసిరాని ఒంగోలు లోక్సభ రాజకీయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రకాశం జిల్లా ఒంగోలు లోక్సభ సెగ్మెంట్. ఇప్పటి వరకూ 17సార్లు ఎన్నికలు జరిగాయి. టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన పది ఎన్నికల్లో కేవలం రెండుసార్లు మాత్రమే సైకిల్ గెలిచింది. ఒకసారి బెజవాడ పాపిరెడ్డి.. మరోసారి కరణం బలరామ్లే టీడీపీ ఎంపీలుగా గెలిచారు. మొదటి నుంచి కాంగ్రెస్కు.. తర్వాత వైసీపీకి పెట్టని కోటలా మారింది ఒంగోలు లోక్సభ స్థానం. పైగా ఇక్కడ అభ్యర్థిని బరిలో దించాలంటే టీడీపీకి తలకు మించిన భారంగా ఉంటోందట. ఎన్నికల్లో ఎవరో ఒకర్ని నియమించడం.. ఓటమి తర్వాత వారు కనిపించకుండా పోవడం టీడీపీలో కామనైంది.
2014లో టీడీపీలో చేరిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి సైకిల్ గుర్తుపై పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ మాగుంటకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది టీడీపీ. గత ఎన్నికల సమయంలో మాగుంట టీడీపీకి గుడ్బై చెప్పి వైసీపీలో చేరిపోయారు. మంత్రిగా పనిచేసిన శిద్దా రాఘవరావు ఆ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసినా తెలుగుదేశానికి లక్ కలిసి రాలేదు. ఎన్నికల తర్వాత శిద్దా కూడా వైసీపీలో చేరిపోయారు. అప్పటి నుంచి ఒంగోలు టీడీపీకి పార్లమెంట్ ఇంఛార్జ్ కరువైపోయారు. లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం కొండెపి మాత్రమే టీడీపీ గెల్చుకుంది. జిల్లాల విభజనలో టీడీపీ గెలిచిన అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాలు బాపట్ల జిల్లా పరిధిలోకి వెళ్లాయి. దీంతో ఒంగోలు లోక్సభ పరిధిలో టీడీపీ మరింత వీకైందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read
- OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
- OTR : అమరావతిపై మంత్రి నారాయణ స్పీడ్ తగ్గిందా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?
- Off The Record : ఆకునూరి మురళి రాజీనామా వెనుక అసలు కథ ఏంటి? విద్యా కమిషన్లో ఏం జరిగింది?
- OTR : Congress లిస్ట్లో ఆ రెండు జిల్లాలదే సస్పెన్స్.. రంగారెడ్డి, సంగారెడ్డి డీసీసీ రేసు..!
తూర్పు, పశ్చిమ ప్రాంతాల కలయికతో ఉండే ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్లో పశ్చిమ ప్రాంతం గత ఎన్నికల్లో టీడీపీని కోలుకొలేని దెబ్బతీసింది. నాయకులు నిస్తేజంగా ఉన్నా కేడర్ పార్టీ కార్యక్రమాలను నెట్టుకొస్తోంది. జిల్లాల పునర్విభజన టీడీపీకి కష్టాలు తప్పడం లేదు. కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే పార్టీకి మిగలడంతో ఆందోళన చెందుతున్నారట. ఎప్పటిలా లోక్సభ విషయంలో కాడి వదిలేసి.. అసెంబ్లీలపై దృష్టి పెట్టాలా అని లెక్కలు వేసుకుంటున్నారట. గతంలోలా ఎన్నికల సమయానికి ఎవరో ఒకరు టీడీపీలోకి వస్తారు.. ఎన్నికల్లో పోటీ చేస్తారు అని సర్ది చెప్పుకొనే పరిస్థితి ఉందట. ఎన్నికల ఖర్చు తడిసి మోపెడు కావడం.. ఎవరైనా పార్టీని వీడి వెళ్లిపోతే మరో నాయకుడిని సిద్ధం చేసుకోకపోవడం పెద్ద మైనస్గా ఉందన్నది కేడర్ చెప్పేమాట.
ఎన్నికలకు ముందుగానే లోక్సభకు ఒక బలమైన నేతను ప్రకటిస్తే.. అసెంబ్లీ ఇంఛార్జ్లను కలుపుకొని వెళ్లి.. టీడీపీని బలోపేతం చేసుకునే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారట పార్టీ నాయకులు. మరి.. టీడీపీ అధిష్ఠానం ఏం చేస్తుందో.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
West Bengal: మమత మేనల్లుడి కోటకు బీటలు.. ఫల్తాలో భారీ విజయం దిశగా బీజేపీ..
-
Puri Jagannadh: ‘పర్ఫెక్ట్ హస్బెండ్’ ఆడియో వివాదం పై.. ఎట్టకేలకు నోరు విప్పిన పూరి జగన్నాథ్
-
Rahul Gandhi: “భయపడొద్దు.. ముస్లింలకు మద్దతుగా నిలవాలి”.. రాహుల్ గాంధీ
-
Avika Gor: “ఆయనతో స్క్రీన్ షేర్ చేయడం నా డ్రీమ్”.. నానిపై అవికా గోర్ మనసులో మాట
-
Gurindervir Singh: భారత అత్యంత వేగవంతమైన రన్నర్గా గురిందర్వీర్ సింగ్ నయా రికార్డు.. 10.09 సెకన్లలో 100 మీటర్లు పూర్తి
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?