YCP : హిందూపురం వైసీపీలో రచ్చ.?పంచాయితీ తాడేపల్లికి చేరిన సమస్య కొలిక్కి రాలేదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీలో వర్గ విభేదాలకు.. సరికొత్త రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది హిందూపురం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై అసమ్మతి ప్రభావం కనిపిస్తోంది. వీటిన్నింటి మధ్య ఎమ్మెల్సీ ఇక్బాల్ ఒంటరి పోరాటం చేస్తున్నారనే చెప్పాలి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు మహ్మద్ ఇక్బాల్. ఆయన మాజీ పోలీస్ అధికారి. ఎన్నికల్లో ఓడినా.. ఎమ్మెల్సీని చేసింది వైసీపీ. అయితే ఇక్బాల్ హిందూపురం వచ్చిన్పటి నుంచీ పార్టీలో అసమ్మతి కాక రేపుతూనే ఉంది.
2019 వరకు హిందూపురం వైసీపీకి అన్నీ తానై నడిపిన నవీన్ నిశ్చల్ను కాదని ఇక్బాల్కు ఎన్నికల్లో ఛాన్స్ ఇవ్వడంతో మొదలైన పంచాయితీ మూడేళ్లయినా సమసి పోలేదు. ఇక్బాల్ పెత్తనాన్ని సహించలేని నవీన్ నిశ్చల్ వర్గం యాంటీగా మారిపోయింది. ఇటీవల ఇక్బాల్ విదేశాలకు వెళ్లిన సమయంలో అసమ్మతి వర్గమంతా ఏకమైంది. కర్నాటకలోని ఒక రిసార్ట్లో ప్రత్యేకంగా సమావేశమై కలకలం రేపింది. తర్వాత అలాంటి మీటింగ్స్ హిందూపురంలోనూ జరిగాయి. చివరకు అంతా కలిసి తాడేపల్లి వెళ్లి పార్టీ పెద్దలతో భేటీ అయ్యారు. ఇక్బాల్పై ఫిర్యాదు చేశారు. కానీ.. అక్కడ నుంచి ఎలాంటి పురోగతి లేదని భావించిన అసమ్మతి వర్గం ఇంకా స్పీడ్ పెంచింది.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
విదేశాల నుంచి వచ్చాక హిందూపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ పాల్గొంటున్నారు. ఈ ప్రొగ్రామ్కు నవీన్ నిశ్చల్ వర్గం దూరంగా ఉంటోంది. అంతా కలిసికట్టుగా కార్యక్రమం నిర్వహించాలని పార్టీ పెద్దలు చెప్పినా.. తమ పంచాయితీ తేలేవరకు గడప దాటేది లేదని తెగేసి చెబుతోంది అసమ్మతివర్గం. దీంతో ఇక్బాల్ కూడా అసమ్మతి నేతల తీరు.. చేష్టలపై వైసీపీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. మూడేళ్లుగా సహాయ నిరాకరణ పాటించినా.. ఈ దఫా మాత్రం గట్టిగా నిలబడంతో అసమ్మతివర్గం భవిష్యత్ కార్యాచరణపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠకు దారితీస్తోంది.
ప్రస్తుతం హిందూపురం వైసీపీలో క్యాంపు రాజకీయాలు జోరుగా ఉన్నాయి. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి శంకర నారాయణ చొరవ తీసుకుని ఇక్బాల్, నవీన్ నిశ్చల్ వర్గాల మధ్య సయోధ్యకు ప్రయత్నించడం లేదు. ఈ తగువు పార్టీ పెద్దలే తేల్చాలని అనుకుంటున్నారో ఏమో.. మాజీ మంత్రి చప్పుడు చేయడం లేదు. అసమ్మతి వర్గానికి తెరవెనక అండగా ఉన్న నవీన్ నిశ్చల్ .. జరుగుతున్న పరిణామాలపై నోరు మెదపడం లేదు. పార్టీ కేడర్ దృష్టంతా తాడేపల్లి వైపే ఉందట. రెండు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడం.. విభేదాల పరిష్కారానికి అక్కడేం చేస్తున్నారో అని ఆరా తీస్తున్నారు. మరి.. హిందూపురం రగడకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.
- Tags
- ap
- controversy
- hindupuram
- Politics
- ycp
తాజావార్తలు
-
Se*xual Harassment : పోలీస్ అకాడమీలో పోకిరి.. లేడీ ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు..
-
FIFA World Cup 2026 Final: స్పెయిన్ VS అర్జెంటీనా.. గెలిచేది ఎవరో చెప్పిన రొనాల్డో
-
ROKO: లార్డ్స్ వన్డేలో అరుదైన మైలురాయిని అందుకున్న రోహిత్, విరాట్ కోహ్లీ.. ఇంకా ఎన్ని రికార్డులు అందుకుంటారో..
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!