Congress : లోకల్ Vs నాన్ లోకల్..ఆధిపత్యపోరుతో కాంగ్రెస్ లో రచ్చ రచ్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యాపేట కాంగ్రెస్లో స్థానికత అంశం ఒక్కసారిగా తెరపైకి వచ్చి చర్చగా మారింది. ఇక్కడ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి, కాంగ్రెస్ నేత పటేల్ రమేష్రెడ్డి మధ్య ఓ రేంజ్లో వర్గపోరు నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై పోటీ చేయడానికి ఇద్దరూ కుస్తీ పడుతున్నారు. దీంతో రెండు వర్గాలు హోరాహోరీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.. అదే విధంగా మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. ఇప్పుడు లోకల్.. నాన్ లోకల్ అంశం వీరి మధ్య చిచ్చు పెడుతోంది.
రమేష్రెడ్డిపై ఆ మధ్య కొందరు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఆ విషయం తెలిసి భగ్గుమన్నారు రమేష్రెడ్డి. మాజీ మంత్రి దామోదర్రెడ్డిని ఉద్దేశించి ఆయన ఘాటైన వ్యాఖ్యలే చేశారు. సూర్యాపేటకు నేనే లోకల్ నాపై ఫిర్యాదు ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు రమేష్రెడ్డి. ఇక్కడే 27 ఏళ్లుగా రాజకీయాల్లో ఎదిగిన తనను స్థానిక ప్రజలు తప్పకుండా ఎన్నికల్లో ఆశీర్వదిస్తారని.. ఎవరైనా అడ్డుకుంటే సహించేది లేదని ఆయన చెప్పారు. ఈ విమర్శలే ప్రస్తుతం లోకల్ కాంగ్రెస్లో చర్చగా మారాయి. పైగా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న రచ్చబండలోనే ఈ కామెంట్స్ చేయడం కాకా రాజేస్తోంది.
Also Read
- Off The Record: రూ.50 కోట్ల భూమి కోసం రికార్డులు తారుమారు! తాడిపత్రిలో అధికారులపై వేటు
- Off The Record: భోగాపురం ఎయిర్ పోర్టులో భోజనాల గోల.. లోకల్ లీడర్ల ‘చిలక్కొట్టుడు’ లీలలు
- OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
- OTR : సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖకు చిక్కులు? పదవిపై కత్తి వేలాడుతుందా?
సూర్యాపేటలోని పలు మండలాల్లో రమేష్రెడ్డి కొద్దిరోజులుగా రచ్చబండలో పాల్గొంటున్నారు. మాజీ మంత్రిని ఉద్దేశించి పదునైన విమర్శలు ఆపడం లేదు. వీటిపై దామోదర్రెడ్డి వర్గీయులు కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఆ ఫిర్యాదును కూడా రమేష్రెడ్డి అనుకూలంగా మలచుకోవడంతో విభేదాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో అనే ఆసక్తి నెలకొంది. సందర్భం వచ్చినప్పుడల్లా ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో లోకల్ నాన్ లోకల్ అంశాన్ని చర్చల్లో పెడుతున్నారు.
కొన్నాళ్లుగా సూర్యాపేట కాంగ్రెస్లో అలికిడి లేదు. రెండు వర్గాలు కామ్గానే ఉన్నాయి. కానీ.. రాహుల్ గాంధీసభ, రైతు డిక్లరేషన్, రచ్చబండ కార్యక్రమాలతో సూర్యాపేటలో ఒక్కసారిగా మార్పు వచ్చేసింది. ఆధిపత్యపోరాటంలో రెండు వర్గాలు పోటాపోటీగా ప్రొగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాయి. రమేష్రెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మనిషిగా గుర్తింపు ఉంది. రేవంత్తోపాటే ఆయన కూడా కాంగ్రెస్లో చేరారు. 2018లోనే సూర్యాపేట టికెట్ ఆశించి భంగపడ్డారు కూడా. రేవంత్ పీసీసీ చీఫ్ అయ్యాక రమేష్రెడ్డి గేర్ మార్చేశారు. వ్యూహాత్మకంగా స్థానికత అంశాన్ని చర్చల్లో పెడుతున్నారనే వాదన ఉంది. ఈ విషయంలో దామోదర్రెడ్డి వర్గం గుర్రుగా ఉందట. అందుకే రానున్న రోజుల్లో ఈ వర్గపోరు ఏ విధంగా బరస్ట్ అవుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?