TDP : చింతమనేని ని ఎవరు ఇరికించారు..ఎవరు చూపించారు ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పఠాన్చెరు కోడిపందాల కేసు తర్వాత టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రియాక్షన్ ఇది. తొలుత కోడిపందాలు జరిగిన ప్రదేశంలోనే లేనని చెప్పిన ఆయన.. పోలీసులు వీడియోలు రిలీజ్ చేశాక టోన్ మార్చేశారు. కోడిపందాలకు.. తనకు ఉన్న అవినాభావ సంబంధాన్ని స్వయంగా వెల్లడించారు. అక్కడితో ఆగితే బాగోదని అనుకున్నారో ఏమో.. తన వీక్ నెస్ను అడ్డంగా పెట్టుకుని తనపై స్కెచ్ వేశారని చింతమనేని చెప్పడంతో చర్చ దానిపైకి మళ్లింది. పైగా కోడి పందాల వద్ద పోలీసులే తనకు సమాచారం ఇచ్చి అక్కడి నుంచి తప్పించారని కొత్త అంశాన్ని బయటపెట్టారు. దీంతో చింతమనేనిని కోడి పందాల కేసులో ఇరికించింది ఎవరు? పోలీసులు ఎలా తప్పించారు అనే ప్రశ్నలు చర్చగా మారాయి.
వాస్తవానికి చింతమనేని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు.. టీడీపీ పవర్లో ఉండగా.. దెందులూరు పరిధిలో ఓ రేంజ్లో కోడిపందాలు నిర్వహించేవారు. ఈ అలవాటు ముందు నుంచీ ఉన్నా.. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసిన విన్యాసాలు మరింత పాపులారీటిని తీసుకొచ్చాయి. కానీ.. 2019 ఎన్నికల తర్వాత పరిస్థితి మారిపోయింది. ఈ మూడేళ్ల కాలంలో 60కిపైగా కేసులు నమోదయ్యాయి. అనేకసార్లు జైలుకెళ్లారు. బెయిల్పై బయటకొచ్చారు. ఈ కేసులు చాలవన్నట్టు ఇప్పుడు తెలంగాణలోనూ కొత్తగా కోడిపందాల కేసు. అందులో ఆయనే Aవన్. కోడి పందాల కోసం కర్ణాటకు వెళ్లి.. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నట్టు చింతమనేని చెబుతున్నారు. కోడిపందాలు జరుగుతుండగా.. పోలీసులు వచ్చి వెళ్లిపోవాలని చెప్పారని.. ఆ తర్వాత అక్కడ కేసులో ఇరికించే కుట్ర చేశారని తెలిపారు చింతమనేని.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
ఇంత జరిగినా.. కోడిపందాలతో ఇమేజ్ డ్యామేజ్ అవుతుందేమోనని ఎవరు చెప్పినా.. చింతమనేని అంగీకరించడం లేదు. చిన్నప్పటి నుంచి తనకు కోడిపందాలు వ్యసనంగా వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అది తెలుసంటూనే.. తనదైన శైలిలో ముక్తాయింపు ఇస్తున్నారు. కోడిపందాలపై పెట్టే కేసులు పెద్దవి కావని.. ఈజీగా బయటపడొచ్చనేది ఆయన అభిప్రాయం కావొచ్చు. అందుకే తెగించేశారని అనేవాళ్లూ ఉన్నారు. తనకేదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆ మధ్య కోర్టులో ప్రైవేట్ కేసు వేశారు చింతమనేని. తనపై నమోదవుతున్న కేసులను తిప్పికొట్టేందుకు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఒకవైపు తన భద్రతకు ముప్పు ఉందని చెబుతూనే.. ఈ విధంగా కోడిపందాల కోసం రాష్ట్రాలకు రాష్ట్రాలు వెళ్లడం.. అక్కడ నుంచి తప్పించుకురావడం ఎందుకని ప్రశ్నించేవాళ్లూ ఉన్నారు.
పఠాన్చెరు పరిధిలోని నమోదైన కేసు విషయంలో అసలేం జరిగిందో కానీ.. చింతమనేని ప్రస్తావించిన అంశాలు రాజకీయంగా చర్చగా మారాయి. చింతమనేని కావాలని అన్నారో లేక నిజంగానే అలా జరిగిందో కానీ.. జూదం కేసులో ట్విస్ట్ ఇచ్చారు. మరి.. లోగుట్టు ఏంటో.. ఏం జరిగిందో.. బయటకొస్తుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!