Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Off The Record Cadre Serious On Ycp Corporators In Flood Affected Areas

కార్పొరేటర్ల తీరుపై వైసీపీ శ్రేణుల గుర్రు..!

Published Date :December 2, 2021 , 8:55 pm
By Manohar
కార్పొరేటర్ల తీరుపై వైసీపీ శ్రేణుల గుర్రు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఓడ దాటేదాక ఓడ మల్లన్న.. ఒడ్డు దిగాక బోడి మల్లన్న. ప్రస్తుతం ఆ నగరంలో మున్సిపల్‌ కార్పొరేటర్ల తీరు అలాగే ఉందట. ఎన్నికల్లో గెలిచేదాకా.. స్థానికులకు అనేక హామీలు గుప్పించారు. ఇప్పుడు అదే ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతుంటే.. అంతా గాయబ్‌. ఎందుకిలా?

వరదల టైమ్‌లో వైసీపీ కార్పొరేటర్లు ఏమయ్యారు?

Also Read

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
  • Off The Record : సర్ సర్వేకు మజ్లిస్ మార్క్ ట్రీట్‌మెంట్‌ మొదలైందా?
  • Off The Record : స్వరం మార్చిన గుత్తా సుఖేందర్ రెడ్డి..?
  • Off The Record : కాంగ్రెస్ హనుమంతుడికి పవర్ సంజీవని దొరకదా..?

వరదలకు తిరుపతి మునిగిపోయింది. రోజులు గడుస్తున్నా నగరంలోని చాలా ప్రాంతాలు నీటిలోనే నానుతున్న పరిస్థితి. ప్రజలు హాహాకారాలు పెడుతుంటే.. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేటర్ల తీరు విమర్శలకు దారితీస్తోంది. మొత్తం 50 డివిజన్లలో 48 డివిజన్లు వైసీపీకే దక్కాయి. తొలి కార్పొరేషన్‌ను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. మరి వరదల సమయంలో వైసీపీ కార్పొరేటర్లు ఏమయ్యారు? తమ డివిజన్లలోని ప్రజలు అల్లాడుతుంటే ఎక్కడున్నారు? అని తిరుపతి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఆదుకోవాలని బాధితులు ఫోన్‌ చేసినా స్పందన లేదా?

ఎప్పుడూ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి చుట్టూ కనిపించే కార్పొరేటర్లు.. వరదల సమయంలో ఎమ్మెల్యే తిరుగుతుంటే.. ఆయన వెనక కనిపించలేదు. ఈ మధ్యే అధికారం చేపట్టిన కార్పొరేటర్లు ఉత్సాహంగా పనిచేస్తారని అంతా అనుకున్నారు. పార్టీ కేడర్‌ కూడా అదే ఆశించింది. అలాంటిది ప్రజలు వరదలతో అల్లాడుతుంటే.. కార్పొరేటర్ల అలికిడే లేదు. ముఖ్యంగా 8 డివిజన్ల పరిధిలోని 40 వేల మంది వరదలకు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. తమను ఆదుకోవాలని స్థానికులు ఫోన్‌ చేసినా కొందరు కార్పొరేటర్ల ఆన్సన్‌ చేయలేదట. ఇదే విషయాన్ని తమ దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యే భూమనకు ఫిర్యాదు చేశారట ప్రజలు.

తూతూ మంత్రంగా మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పర్యటనలు..!

తిరుపతి మేయర్‌ డాక్టర్‌ శిరీష.. తన సొంత ఆస్పత్రికే పరిమితం అయ్యారన్నది టీడీపీ, జనసేన నేతల ఆరోపణ. వరద ప్రభావిత ప్రాంతాల్లో పెద్దగా పర్యటించలేదని విమర్శిస్తున్నాయి. సొంత డివిజన్‌లోని ప్రజలు వరదలకు అల్లాడుతుంటే కనిపించని మేయర్‌.. కేంద్ర బృందం పర్యటనలో మాత్రం అన్నీ తానై వ్యవహరించారు. డిప్యూటీ మేయర్‌గా ఉన్న ఎమ్మెల్యే భూమన తనయుడు సైతం ప్రధాన రోడ్డుపై పర్యటించి చేతులు దులుపుకొన్నారనే విమర్శలు ఉన్నాయి.

కొత్తగా కార్పొరేటర్లు అయిన వారికీ ప్రజల గోడు పట్టలేదా?

తిరుపతి పరిధిలోని శ్రీకృష్ణనగర్‌లో వాటర్‌ ట్యాంక్‌ భూమిలో నుంచి పైకి రావడం.. చాలా ఇళ్లు భూమిలోకి కుంగిపోవడం.. బీటలు వారడంతో జనాలు భయాందోళన చెందారు. వారికి ధైర్యం చెప్పడానికి.. సహాయ చర్యల వేగం పెంచడానికి కార్పొరేటర్లు చొరవ తీసుకుంటే రాజకీయంగా మైలేజ్‌ వచ్చేదన్నది అధికారపార్టీ శ్రేణుల వాదన. కొత్తగా కార్పొరేటర్లు అయినవాళ్లకు సైతం ప్రజల గోడు పట్టకపోవడం పార్టీ వర్గాలనే ఆశ్చర్య పరుస్తోందట. మరి.. కష్టకాలంలో గాయబైన కార్పొరేటర్లు ఎప్పుడు తమ పంథాను మార్చుకుంటారో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cadre serious
  • flood affected areas
  • ycp corporators

తాజావార్తలు

  • Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్

  • Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్‌ పెట్టండి..!

  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ

  • Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?

  • OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions