కార్పొరేటర్ల తీరుపై వైసీపీ శ్రేణుల గుర్రు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓడ దాటేదాక ఓడ మల్లన్న.. ఒడ్డు దిగాక బోడి మల్లన్న. ప్రస్తుతం ఆ నగరంలో మున్సిపల్ కార్పొరేటర్ల తీరు అలాగే ఉందట. ఎన్నికల్లో గెలిచేదాకా.. స్థానికులకు అనేక హామీలు గుప్పించారు. ఇప్పుడు అదే ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతుంటే.. అంతా గాయబ్. ఎందుకిలా?
వరదల టైమ్లో వైసీపీ కార్పొరేటర్లు ఏమయ్యారు?
Also Read
వరదలకు తిరుపతి మునిగిపోయింది. రోజులు గడుస్తున్నా నగరంలోని చాలా ప్రాంతాలు నీటిలోనే నానుతున్న పరిస్థితి. ప్రజలు హాహాకారాలు పెడుతుంటే.. తిరుపతి మున్సిపల్ కార్పొరేటర్ల తీరు విమర్శలకు దారితీస్తోంది. మొత్తం 50 డివిజన్లలో 48 డివిజన్లు వైసీపీకే దక్కాయి. తొలి కార్పొరేషన్ను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. మరి వరదల సమయంలో వైసీపీ కార్పొరేటర్లు ఏమయ్యారు? తమ డివిజన్లలోని ప్రజలు అల్లాడుతుంటే ఎక్కడున్నారు? అని తిరుపతి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఆదుకోవాలని బాధితులు ఫోన్ చేసినా స్పందన లేదా?
ఎప్పుడూ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి చుట్టూ కనిపించే కార్పొరేటర్లు.. వరదల సమయంలో ఎమ్మెల్యే తిరుగుతుంటే.. ఆయన వెనక కనిపించలేదు. ఈ మధ్యే అధికారం చేపట్టిన కార్పొరేటర్లు ఉత్సాహంగా పనిచేస్తారని అంతా అనుకున్నారు. పార్టీ కేడర్ కూడా అదే ఆశించింది. అలాంటిది ప్రజలు వరదలతో అల్లాడుతుంటే.. కార్పొరేటర్ల అలికిడే లేదు. ముఖ్యంగా 8 డివిజన్ల పరిధిలోని 40 వేల మంది వరదలకు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. తమను ఆదుకోవాలని స్థానికులు ఫోన్ చేసినా కొందరు కార్పొరేటర్ల ఆన్సన్ చేయలేదట. ఇదే విషయాన్ని తమ దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యే భూమనకు ఫిర్యాదు చేశారట ప్రజలు.
తూతూ మంత్రంగా మేయర్, డిప్యూటీ మేయర్ పర్యటనలు..!
తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష.. తన సొంత ఆస్పత్రికే పరిమితం అయ్యారన్నది టీడీపీ, జనసేన నేతల ఆరోపణ. వరద ప్రభావిత ప్రాంతాల్లో పెద్దగా పర్యటించలేదని విమర్శిస్తున్నాయి. సొంత డివిజన్లోని ప్రజలు వరదలకు అల్లాడుతుంటే కనిపించని మేయర్.. కేంద్ర బృందం పర్యటనలో మాత్రం అన్నీ తానై వ్యవహరించారు. డిప్యూటీ మేయర్గా ఉన్న ఎమ్మెల్యే భూమన తనయుడు సైతం ప్రధాన రోడ్డుపై పర్యటించి చేతులు దులుపుకొన్నారనే విమర్శలు ఉన్నాయి.
కొత్తగా కార్పొరేటర్లు అయిన వారికీ ప్రజల గోడు పట్టలేదా?
తిరుపతి పరిధిలోని శ్రీకృష్ణనగర్లో వాటర్ ట్యాంక్ భూమిలో నుంచి పైకి రావడం.. చాలా ఇళ్లు భూమిలోకి కుంగిపోవడం.. బీటలు వారడంతో జనాలు భయాందోళన చెందారు. వారికి ధైర్యం చెప్పడానికి.. సహాయ చర్యల వేగం పెంచడానికి కార్పొరేటర్లు చొరవ తీసుకుంటే రాజకీయంగా మైలేజ్ వచ్చేదన్నది అధికారపార్టీ శ్రేణుల వాదన. కొత్తగా కార్పొరేటర్లు అయినవాళ్లకు సైతం ప్రజల గోడు పట్టకపోవడం పార్టీ వర్గాలనే ఆశ్చర్య పరుస్తోందట. మరి.. కష్టకాలంలో గాయబైన కార్పొరేటర్లు ఎప్పుడు తమ పంథాను మార్చుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
-
School Midday Meal: సర్కార్ బడుల్లో చికెన్ బిర్యానీ.. సీఎం డ్రీమ్ ప్రాజెక్ట్పై మంత్రి కీలక ప్రకటన
-
Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్రూఫ్, 6 ఎయిర్బ్యాగ్స్తో అదిరిపోయే ఫీచర్లు
-
BCCI Umpires: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై అంపైర్లు అప్రమత్తంగా ఉండాల్సిందే.. లేదంటే..!
-
Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్తో హీరో ఫైట్!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!