Off The Record: బీఆర్ఎస్లో గుద్దులాటలు.. చిచ్చు రేపిన మండల అధ్యక్షుల ఎంపిక!
- భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్లో గుద్దులాటలు
- చిచ్చు రేపిన మండల అధ్యక్షుల ఎంపిక
- కీచులాడుకుని దిగజారుస్తున్నారంటూ కేడర్ కంగారు
- భద్రాచలం ఉప ఎన్నిక జరిగితే పోటీ చేస్తానంటున్న రేగా
- భద్రాచలం ఇన్ఛార్జ్ని ప్రకటించని అధిష్టానం
- పార్టీ పదవుల్ని ఎవరికి వారే ప్రకటించేసుకుంటున్న వైనం
- పుండు మీద కారంలా రేగా కాంతారావు తాజా ప్రకటన
- ఎంపిక నిర్ణయం జిల్లా అధ్యక్షుడిదేనని అనడంపై అభ్యంతరం
- రేగా వర్సెస్ అదర్స్గా మారిపోయిన వాతావరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలిసికట్టుగా పనిచేయాల్సిన టైంలో అక్కడ గులాబీ నేతలు తన్నులాటలు, తలకపోతలతో టైంపాస్ చేస్తున్నారా? జిల్లా అధ్యక్షుడికి, నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందా? చివరికి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులను కూడా నియమించుకోలేని దుస్థితి ఏ జిల్లాలో ఉంది? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి?.
భద్రాద్రి జిల్లా గులాబీ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. జిల్లా అధ్యక్షుడి మీద ముగ్గురు నేతలు విరుచుకుపడుతున్నారు. అదీకూడా… తమ ఫీలింగ్స్ని ఏ మాత్రం దాచుకోకుండా… ఓపెన్ వార్ డిక్లేర్ చేయడం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావు పేట మండల అధ్యక్షుల ఎంపిక వివాదం చిచ్చు రాజేసిందట. ఇప్పటికే… జిల్లాలో పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటే… ఇప్పుడు ఈ వర్గపోరు పుట్టి ముంచే ప్రమాదం కనిపిస్తోందని కేడర్ కంగారు పడుతోంది. పార్టీ అధికారంలో లేని సమయంలో కలుపుగోలుగా ఉండాల్సిన వాళ్ళు కీచులాడుకుని మరీ దిగజారుస్తున్నారన్నది కింది స్థాయిలో ఉన్న అభిప్రాయం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలిచింది. అయితే… గెలిచాక కాంగ్రెస్ గూటికి చేరిపోయారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. దాంతో… పార్టీ ఫిరాయింపుల క్రమంలో ఉప ఎన్నిక అంటూ జరిగితే… తానే పోటీ చేస్తానంటున్నారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎంఎల్ఎ రేగా కాంతారావు. కానీ… పార్టీ ఇన్ఛార్జ్ని మాత్రం నియమించకపోవడంతో… టిక్కెట్ రేగాకా, మరొకరికా అన్నది అర్ధంకాని పరిస్థితి.
Also Read
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
ఈ క్రమంలో పరస్పర విమర్శలతో వీధికెక్కుతున్నారు పార్టీ నాయకులు. ఓవైపు స్థానిక ఎన్నికలకు అన్ని పార్టీలు పరుగులు పెడుతుంటే… మా వాళ్ళు మాత్రం కీచులాటలతో టైంపాస్ చేస్తున్నారంటూ భద్రాచలం బీఆర్ఎస్ కేడర్ అసహనంగా ఉందట. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కొద్ది రోజుల క్రితం ఏకంగా ప్రెస్మీట్ పెట్టిమరీ.. పార్టీలో పరిస్తితి దారుణంగా ఉందని, నేతలను గుర్తించడం లేదని ఆరోపించారు. కాగా… వర్గ విభేదాలతో మూడేళ్లుగా అశ్వారావు పేట మండల అధ్యక్షుడిని నియమించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అటు ఇల్లెందు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో మండల, పట్టణ అధ్యక్షుల ఎంపిక నియోజకవర్గ ఇన్ఛార్జ్లు మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షుడి మధ్య వివాదం రేపింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు సంబంధం లేకుండానే జిల్లా అధ్యక్షులను నియమించడం వాళ్ళ ఆగ్రహానికి కారణం అయ్యింది. ఇల్లెందు పట్టణ అధ్యక్ష పదవికి రేగా కాంతారావు ఒకరిని నియమించగా…..వెంటనే మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పేరుమీద మరొకరిని నియమిస్తున్నట్టు మరో ప్రకటన వచ్చింది. ఇల్లెందులో ఉన్న రెండు వర్గాలు చెరొకరిని పట్టణ అద్యక్షులుగా ప్రకటించాయి. అలాగే కొత్తగూడెం నియోజకవర్గంలోని చుంచుపల్లి, సుజాతనగర్ మండలాలకు పార్టీ అధ్యక్షులను జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ప్రకటించారు. ఇది కూడ వివాస్పదం అయ్యింది.
Also Read: Mini Projector Tips: మినీ ప్రొజెక్టర్ కొంటున్నారా?.. ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే!
మాజీ మంత్రి, సీనియర్ అయిన వనమా వెంకటేశ్వర రావుకు సంబందం లేకుండానే వీటిని ప్రకటించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఎటు చూసినా…. వర్గ విభేదాలతో భద్రాద్రి బీఆర్ఎస్లో అయోమయ పరిస్థితులు ఉన్నాయి. ఆ గొడవ అలా కొనసాగుతుండగానే…తాజాగా రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగా చేసిన మరోప్రకటనతో నేతల్లో ఆగ్రహం కట్టలు తెచుకుందట. నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు పేరు ప్రతిపాదించే అధికారం మాత్రమే ఉంటుందని, తుది నిర్ణయం మాత్రం జిల్లా అధ్యక్షుడిదే కాబట్టి…అనవసరంగా పార్టీని డిస్ట్రబ్ చేయడం మాని స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టాలన్నది ఆయన ప్రకటన సారాంశం. దీంతో… ఆయనేంటి మాకు వార్నింగ్ ఇచ్చేదేంటని మాట్లాడుతున్నారట నియోజకవర్గ స్థాయి నాయకులు. మరోవైపున పార్టీ అధిష్టానం కూడా జిల్లాలో ఉన్న పరిస్థితిని తెలుసుకుని చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదన్న అసంతృప్తి పెరుగుతోంది. దీన్ని ఇలాగే వదిలేస్తే భద్రాద్రి జిల్లాలో గులాబీ రెక్కలు వేటికవే ఊడిపోవడం ఖాయమన్న వాదన బలపడుతోంది.
తాజావార్తలు
-
Delhi: 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. విదేశీ టూర్లు రద్దు.. పొదుపు మంత్రం ప్రకటించిన ఢిల్లీ సర్కార్
-
Kerala: ‘‘కాంగ్రెస్ ముస్లిం లీగ్’’.. సీఎం ఎంపికపై బీజేపీ ఫైర్..
-
Vizag: విశాఖలో ఘోర విషాదం.. పెళ్లి దండలతోనే నవ వధువు మృతి
-
Pawan Kalyan : పొదుపు చర్యలపై ప్రజలకు ఇబ్బంది కలగొద్దు..!
-
NTR Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డేకి ప్రశాంత్ నీల్ గిఫ్ట్ రెడీ.. ఇక రచ్చ రచ్చే!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?