Congress : బోధన్ లో కాంగ్రెస్ నేత సుదర్శన్ రెడ్డికి మరో నేత చెక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ పేరుతో చేపడుతున్న రచ్చబండ కార్యక్రమాలు.. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య పోటీకి దారితీస్తున్నాయి. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. కొందరు నేతలు పోటీపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. బోధన్తోపాటు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో ఈ రేస్ మరీ ఎక్కువగా ఉందట. బోధన్ నుంచి మరోసారి పోటీకి మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి రెడీ అవుతున్నారు. ఈ మధ్య అదే పనిగా పర్యటనలు చేస్తున్నారు. వరంగల్ డిక్లరేషన్ పేరుతో ఇంటింటా ప్రచారం మొదలుపెట్టేశారు కూడా. అయితే బోధన్కే చెందిన మరో కాంగ్రెస్ నేత కెప్టన్ కరుణాకర్రెడ్డి సైతం పోటాపోటీగా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఆయనకు పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ ఆశీసులు ఉన్నాయట. ఒకరికొకరు రాజకీయంగా చెక్ పెట్టేందుకు వేస్తున్న ఎత్తుగడలు నియోజకవర్గం కాంగ్రెస్లో వేడి పుట్టిస్తున్నాయి.
నిజామాబాద్ రూరల్లో మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నగేష్ రెడ్డిల మధ్య యుద్ధం ముదురుతోందట. వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ పోటీ చేయాలని చూస్తున్నారు. భూపతిరెడ్డి నియోజకవర్గ ఇంఛార్జ్గా ఉన్నారు. అధిష్ఠానం ఆశీసులు తనకే అనే ధీమాతో మాజీ ఎమ్మెల్సీ ఉంటే.. జనం మద్దతు తనకు ఉందని చెబుతున్నారు నగేష్రెడ్డి. ఎవరికి వారుగా నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో.. ఎవరి వెంట ఉండాలో.. ఎవరి వెంట వెళ్తే ఏమౌతుందో అనే ఆందోళనలో కేడర్ సతమతం అవుతోందట.
Also Read
- Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
- Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
- Off The Record : BRSలో సభ్యత్వాల నమోదు విషయంలో కేసీఆర్ సూచనలు పై అనుమానాలు?
- Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పరిస్థితిని చూశాక.. కొందరు సీనియర్లు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారట. టికెట్ రేస్ వల్ల కేడర్ నలిగిపోతోందని.. కాంగ్రెస్ పార్టీ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారట. నియోజకవర్గాల్లో కేవలం ఇద్దరే కాకుండా.. టికెట్ ఆశిస్తున్న మరికొందరు నేతలు కూడా వేరు కుంపట్లు పెట్టుకుంటున్నారు. ఈ సమస్యలకు ఇప్పుడే చెక్ పెట్టకపోతే ఎన్నికల నాటికి ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారట. మరి.. పీసీసీ ఈ రెండు నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి.. కేడర్కు క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
FSSAI : పామాయిల్పై కీలక ప్రకటన.. అపోహలు వద్దు.. అది సురక్షితం..!
-
Gautam Adani: అదానీకి అమెరికా బిగ్ షాక్.. రూ.2200 కోట్ల లంచాల కేసులో అదానీపై యూఎస్ సెక్యూరిటీస్ సంస్థ నయా యాక్షన్!
-
Chiranjeevi : సీఎం విజయ్’కి చిరు ఫోన్
-
Nadendla Manohar: జనసేన లక్ష్యం 25 లక్షల సభ్యత్వాలు.. కార్యకర్తలకు భరోసా.. రూ. 46 కోట్ల భీమా సాయం
-
Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!