MLA Adeep Raju : వైసీపీలో రాజకీయ విమర్శలకు కేంద్రంగా అదీప్ రాజు.. తాడేపల్లికి పిలిచి తలంటారట..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారపార్టీలో ఆయనో యువ ఎమ్మెల్యే. సొంత కెపాసిటీకంటే పార్టీగాలి కలిసొచ్చి పదవులోకి వచ్చారు. ఎన్నికల్లో ఏనుగంత బలం అనుకున్న అనుచరులు, బంధువులే ఇప్పుడు వీక్ పాయింట్ అయ్యారు. ఐనవాళ్లను కంట్రోల్ చెయ్యలేక… హైకమాండ్ అక్షింతలు భరించలేక అడకత్తెరలో నలిగిపోతున్నారట. ఇంత నెగిటివిటీ మూటగట్టుకున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆ గొడవలేంటి?
అన్నంరెడ్డి అదీప్రాజు. విశాఖ జిల్లా పెందుర్తి వైసీపీ ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగడం..పరవాడ, సబ్బవరం మండలాల్లో వైసీపీకి ఆదరణ లభించడంతో 34 ఏళ్లలోనే ఎమ్మెల్యే అయ్యారు అదీప్రాజు. గెలిచిన తర్వాత మొదటి రెండేళ్లు బాగానే గడిచినా.. ఇప్పుడు అసలు సినిమా స్టార్ట్ అయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా భవిష్యత్పై అదీప్రాజ్ కు చాలా ఆశలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీ బలంగానే కనిపిస్తోంది. అనుచరులు, బంధువుల చర్యలు కారణంగా వివాదాలకు, రాజకీయ విమర్శలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు అదీప్రాజు.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
పెందుర్తి పరిధిలో ఏ వివాదం చెలరేగినా దానివెనక అధికారపార్టీ నాయకుడు లేక.. ఎమ్మెల్యే అనుచరుడి పేరు బయటకు రావడం చర్చగా మారుతోంది. ల్యాండ్ బ్యాంక్ అధికంగా ఉన్న ప్రాంతం కావడంతో ఇక్కడ భూ వివాదాలు ఎక్కువ. ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులకు సంబంధించిన ఏ అంశం విమర్శలకు తావిచ్చినా వైరిపక్షాలు ఊరుకోవడం లేదు. ఇదే అదీప్రాజుకు తలనొప్పిగా మారుతోందట. కొన్ని వ్యవహారాలు ఆయనకు తెలిసి జరుగుతుండగా.. మరికొన్ని వివాదం రేగిన తర్వాత ఎమ్మెల్యే నోటీసుకు వెళ్తున్నాయట. వయసుతోపాటు రాజకీయ అనుభవం తక్కువ కావడం.. సీనియర్ల మాట కాదనలేకపోవడంతో ఇబ్బందలు వస్తున్నాయని చెబుతున్నారట అదీప్.
ఇటీవల పెందుర్తిలో నడిరోడ్డులో మద్యం మత్తులో ఇద్దరు యువకులు వైద్యురాలి కుటుంబాన్ని వేదించారు. ఎదురు మాట్లాడితే పొడిచి పారేస్తానని బెదిరించారు మనోహర్ అనే వ్యక్తి. చివరకు ఆ మనోహర్ తన అనుచరుడే అని అదీప్రాజు అంగీకరించారు. ఈ గొడవ ఎంత సంచలనమైందో.. ఎమ్మెల్యేకు అంతే డ్యామేజ్ అయ్యిందట. అంతకు ముందు ఇటువంటిదే మరో ఘటన జరిగింది. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో వార్డు అధ్యక్షుడుగా ఉన్న దొడ్డి కిరణ్ అనే చోటా నాయకుడు దర్జాగా ప్రభుత్వ భూమిని ఆక్రమించాడు. అడ్డుకున్న రెవెన్యూ సిబ్బందిపైన దాడికి తెగబడ్డాడు. స్వయంగా కలెక్టర్ జోక్యం చేసుకుని నిందితుణ్ణి అరెస్ట్ చేయించాల్సి వచ్చింది. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేకు సంబంధం లేదన్నది పార్టీ వర్గాల మాట. కానీ అదీప్రాజు జోక్యం చేసుకుని చేతులు కాల్చుకున్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉందట. ఇటీవల సబ్బవరం మండలం గొల్లలపాలెం భూవివాదంలో జరిగిన ఘర్షణ చిన్నదే అయినా పెద్ద రచ్చే అయ్యింది. ఎమ్మెల్యే స్వగ్రామం రాంపురంలో చెరువు ఆక్రమణ.. పరవాడ మండలంలో రొయ్యల చెరువుల భూముల తగువు విమర్శలకు దారితీసింది. చివరకు పార్టీ పెద్దలు కల్పించుకుని డ్యామేజ్ కంట్రోల్ చేశారు.
కొన్ని అంశాలపై నేరుగా CMOకు ఫిర్యాదులు వెళ్తున్నాయట. రాజకీయంగా ఎమ్మెల్యే అభద్రతకు లోనయ్యే పరిణామాలు పెందుర్తిలో కనిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్బాబు పెందుర్తి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఇదే సమయంలో పంచకర్లపై అదీప్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ అధిష్ఠానం సీరియస్గా తీసుకుందని తెలుస్తోంది. పెందుర్తిలో జరుగుతున్న పరిణామాలపై గుర్రుగా ఉన్న పార్టీ పెద్దలు ఎమ్మెల్యేను తాడేపల్లికి పిలుపించుకున్నారట. సుమారు 2 గంటలపాటు సమావేశం జరిగింది. మరోసారి ఆరోపణలు వస్తే సహించబోమని హెచ్చరించినట్టు ప్రచారం జరుగుతోంది. మరి.. ఎమ్మల్యే అదీప్రాజు తీరు మార్చుకుంటారో లేక.. పాత పద్ధతిలోనే వెళ్తారో చూడాలి.
తాజావార్తలు
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!