Mahabharatham : జక్కన్న ‘మహాభారతం’.. కొత్త అనుమానాలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSMB 29 తర్వాత జక్కన్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను ఫిక్స్ చేసుకున్నాడు. మహాభారతంను ఆరు భాగాల్లో చూపించాలని బలంగా ఫిక్స్ అయిపోయాడు.అయితే ఈ లోపే లింగుస్వామి ఈసినిమాను తీస్తాననడంతో సౌత్ సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. రాజమౌళికి కూడా ఒక డ్రీం ప్రాజెక్ట్ ఉంది.అది మహాభారతం అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సబ్జెక్టు పై ఆడియన్స్ లో ఆసక్తి కనిపిస్తుంది.ఆ మాటకొస్తే మన మైథాలజీపై ఇప్పుడున్న ఆడియన్స్ కు ఇంట్రెస్ట్ మరింతగా పెరుగుతుంది. కర్ణుడు బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ‘కల్కి’ చిత్రాన్ని ఆడియన్స్ ఏ రేంజ్ కి తీసుకెళ్లారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు .సినిమా క్వాలిటీ పరంగా బాగుంది కానీ,ఎమోషనల్ కనెక్ట్ కాలేదు అని విమర్శలు ఎదురైనప్పటికీ, సినిమాలో కనిపించే పది నిమిషాల మహాభారతం ఎపిసోడ్ కోసం జనాలు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.
జస్ట్ పదినిమిషాల మహాభారత యుద్ధానికి అంత వెయిట్ ఇచ్చిన ఆడియన్స్ ..రాజమౌళి లాంటి దర్శకుడు ఫుల్ లెన్త్ సినిమాగా తీస్తే వచ్చే వెయిట్ మాములుగా ఉండదు.అలాంటి క్రేజీ ప్రాజెక్ట్ ని రాజమౌళి ఏకంగా ఆరు భాగాల్లో చూపించాలని అనుకున్నాడు. బహుశా మహేష్ సినిమా పూర్తి అయ్యాక ఈ ప్రాజెక్టే ఉండొచ్చు.తన విజన్ లో ఉన్న మహాభారతం ని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు క్రియేట్ అవుతాయి అంటూ రాజమౌళి అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు .: ఐతే తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి 700 కోట్ల రూపాయిల బడ్జెట్ తో మహాభారతం తీసే ప్లాన్ లో ఉన్నట్టు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
Also Read
- Tollywood: ఫేక్ హౌస్ఫుల్స్... డమ్మీ కలెక్షన్స్! టాలీవుడ్లో కొత్త "మైండ్ గేమ్"!
- Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్'కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
- Anchor Charmila : స్టార్ ప్రొడ్యూసర్స్ హీరోయిన్ ఆఫర్ ఇచ్చినా వద్దన్న యాంకర్ చర్మిల.. అసలు కారణం ఇదే!
- Charmila Nalluri Background : ట్రెండింగ్ యాంకర్ చర్మిల బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
పందెం కోడి,ఆవారా లాంటి సినిమాలు తీసిన ఈ దర్శకుడు రీసెంట్ గా రామ్ పోతినేని తో ‘ది వారియర్’ సినిమా తీసి ఫెయిలయ్యాడు. అయినప్పటికీ మహాభారతం లోని అర్జునుడు, అభిమన్యుడు క్యారెక్టర్స్ ని బేస్ చేసుకొని రెండు భాగాలుగా మహాభారతంలోని ఎవరు చూపించి కోణాన్ని ఆవిష్కరిస్తానని చెబుతున్నాడు.బహుశ విరాటపర్వం లో ఉన్నప్పుడు జరిగే స్టోరీ అన్నమాట. అప్పట్లో ఈ అంశంపై ఎన్టీఆర్, ఎఎన్నార్ కలిసి నర్తనశాల, మాయాబజార్ వంటి చిత్రాలు తెరకెక్కాయి. ఈ రెండు సినిమాల్లోనూ.అభిమన్యుడు, ఉత్తర మధ్య జరిగే వివాహం వరకే చూపించారు. ఆ తర్వాత అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో మరణం చెందే వరకు చూపించలేదు. లింగ స్వామి తీయబోయే సినిమా అభిమన్యుడు మరణం వరకు ఉండబోతుందట.అలా తీస్తే ఈ ఇంపాక్ట్ రాజామౌళి సినిమా పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే రాజమౌళి కురుక్షేత్రం యుద్ధం మీదనే మూడు భాగాలు తీయబోతున్నాడు. ఆయన తీసే మహాభారతం సిరీస్ లో అభిమన్యుడి పై కూడా ప్రత్యేకమైన సినిమా ఉంటుంది. కాబట్టి కచ్చితంగా ఎంతో కొంత ప్రభావం రాజమౌళి సినిమాపై పడే అవకాశం ఉంటుందని ఫిల్మీ క్రిటిక్స్ చెబుతున్నారు.
తాజావార్తలు
-
2027 ODI World Cup: ప్రపంచ కప్కు పసికూన నేరుగా అర్హత.. రెండుసార్లు ఛాంపియన్కు బిగ్ షాక్!
-
Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
-
Vikram Controversy: అరుదైన కోతితో విక్రమ్ వీడియో వైరల్ .. విచారణ చేపట్టిన అటవీ శాఖ.. అసలు కథేంటి?
-
FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
-
Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!