Mahabharatham : జక్కన్న ‘మహాభారతం’.. కొత్త అనుమానాలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSMB 29 తర్వాత జక్కన్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను ఫిక్స్ చేసుకున్నాడు. మహాభారతంను ఆరు భాగాల్లో చూపించాలని బలంగా ఫిక్స్ అయిపోయాడు.అయితే ఈ లోపే లింగుస్వామి ఈసినిమాను తీస్తాననడంతో సౌత్ సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. రాజమౌళికి కూడా ఒక డ్రీం ప్రాజెక్ట్ ఉంది.అది మహాభారతం అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సబ్జెక్టు పై ఆడియన్స్ లో ఆసక్తి కనిపిస్తుంది.ఆ మాటకొస్తే మన మైథాలజీపై ఇప్పుడున్న ఆడియన్స్ కు ఇంట్రెస్ట్ మరింతగా పెరుగుతుంది. కర్ణుడు బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ‘కల్కి’ చిత్రాన్ని ఆడియన్స్ ఏ రేంజ్ కి తీసుకెళ్లారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు .సినిమా క్వాలిటీ పరంగా బాగుంది కానీ,ఎమోషనల్ కనెక్ట్ కాలేదు అని విమర్శలు ఎదురైనప్పటికీ, సినిమాలో కనిపించే పది నిమిషాల మహాభారతం ఎపిసోడ్ కోసం జనాలు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు.
జస్ట్ పదినిమిషాల మహాభారత యుద్ధానికి అంత వెయిట్ ఇచ్చిన ఆడియన్స్ ..రాజమౌళి లాంటి దర్శకుడు ఫుల్ లెన్త్ సినిమాగా తీస్తే వచ్చే వెయిట్ మాములుగా ఉండదు.అలాంటి క్రేజీ ప్రాజెక్ట్ ని రాజమౌళి ఏకంగా ఆరు భాగాల్లో చూపించాలని అనుకున్నాడు. బహుశా మహేష్ సినిమా పూర్తి అయ్యాక ఈ ప్రాజెక్టే ఉండొచ్చు.తన విజన్ లో ఉన్న మహాభారతం ని ఆడియన్స్ ముందుకు తీసుకొస్తే బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు క్రియేట్ అవుతాయి అంటూ రాజమౌళి అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు .: ఐతే తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి 700 కోట్ల రూపాయిల బడ్జెట్ తో మహాభారతం తీసే ప్లాన్ లో ఉన్నట్టు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.
Also Read
పందెం కోడి,ఆవారా లాంటి సినిమాలు తీసిన ఈ దర్శకుడు రీసెంట్ గా రామ్ పోతినేని తో ‘ది వారియర్’ సినిమా తీసి ఫెయిలయ్యాడు. అయినప్పటికీ మహాభారతం లోని అర్జునుడు, అభిమన్యుడు క్యారెక్టర్స్ ని బేస్ చేసుకొని రెండు భాగాలుగా మహాభారతంలోని ఎవరు చూపించి కోణాన్ని ఆవిష్కరిస్తానని చెబుతున్నాడు.బహుశ విరాటపర్వం లో ఉన్నప్పుడు జరిగే స్టోరీ అన్నమాట. అప్పట్లో ఈ అంశంపై ఎన్టీఆర్, ఎఎన్నార్ కలిసి నర్తనశాల, మాయాబజార్ వంటి చిత్రాలు తెరకెక్కాయి. ఈ రెండు సినిమాల్లోనూ.అభిమన్యుడు, ఉత్తర మధ్య జరిగే వివాహం వరకే చూపించారు. ఆ తర్వాత అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో మరణం చెందే వరకు చూపించలేదు. లింగ స్వామి తీయబోయే సినిమా అభిమన్యుడు మరణం వరకు ఉండబోతుందట.అలా తీస్తే ఈ ఇంపాక్ట్ రాజామౌళి సినిమా పై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే రాజమౌళి కురుక్షేత్రం యుద్ధం మీదనే మూడు భాగాలు తీయబోతున్నాడు. ఆయన తీసే మహాభారతం సిరీస్ లో అభిమన్యుడి పై కూడా ప్రత్యేకమైన సినిమా ఉంటుంది. కాబట్టి కచ్చితంగా ఎంతో కొంత ప్రభావం రాజమౌళి సినిమాపై పడే అవకాశం ఉంటుందని ఫిల్మీ క్రిటిక్స్ చెబుతున్నారు.
తాజావార్తలు
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
-
Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!