Zombie Virus: మరో ప్రాణాంతక మహమ్మారిగా జాంబీ వైరస్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zombie Virus: గ్లోబల్ వార్మింగ్ కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గడ్డకట్టిన మంచు కరగడం ప్రారంభించినప్పటి నుండి ముప్పు పెరిగింది. ఇటీవల శాస్త్రవేత్తలు ఆర్కిటిక్ ప్రాంతంలో గడ్డకట్టిన స్థితిలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన ‘‘ జాంబీ వైరస్’’ను గుర్తించారు. దాదాపుగా 48,500 ఏళ్లుగా ఆర్కిటిక్ ప్రాంతంలో ఇది గడ్డకట్టిన స్థితిలో ఉంది. ఆర్కిటిక్, ఇతర ప్రదేశాల్లో చాలా ఏళ్లుగా పలు వైరస్లు మంచులో నిద్రాణస్థితిలో ఉన్నాయి. అయితే వీటి వల్ల కలిగే ప్రమాదాల గురించి శాస్త్రవేత్తలు సంవత్సరాలుగా హెచ్చరిస్తున్నారు. ప్రమాదకర వైరస్ మానవుల్లో ప్రాణాంతకవ్యాధిని కలిగించే సామర్థ్యాన్ని కలిగించే అవకాశం ఉంది.
Read Also: Ayodhya Ram Temple: అయోధ్యకు భారీగా తరలిన భక్తులు.. తోపులాట
Also Read
- UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
- Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
- CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
అయితే ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ వల్ల ధృవాల వద్ద ఉన్న మంచు క్రమంగా కరుగుతోంది. దీంతో ఈ వైరస్ల ముప్పు మరింతగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైరస్ లపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా జాంబీ వైరస్ వల్ల వచ్చే ప్రమాదాలను ఎదుర్కొనేందుకు ఫ్రెంచ్ శాస్త్రవేత్త, ఆర్కిటిక్ లో సేకరించిన వైరస్ లను మళ్లీ పునరుద్ధరించాడు. ఆర్కిటిక్ టండ్రా, అలస్కా, కెనడా, రష్యాలోని సైబిరియా ప్రాంతాలు అనేక పురాతన వైరస్ కు మంచులో గడ్డకట్టిన స్థితిలో కలిగి ఉన్నాయి. సాధారణంగా మంచు ప్రాంతాల్లో ఎన్నో రకాల డేంజరస్ వైరస్లు ఉంటాయి. మానవాళికి వాటి వల్ల ఏమైనా ముప్పు ఉందా? అనే విషయంపై శాస్త్రవేత్తలు ఎప్పుడూ పరిశోధనలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజా పరిశోధనలో ఈ జాంబీ వైరస్ బయటపడింది. ఇలాంటి బ్యాక్టీరియా, వైరస్ లను పునరుజ్జీవింపచేయడం ద్వారా మానవాళికి ఎంత ముప్పును కలిగిస్తాయో తెలుసుకోవడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న యాంటీబయాటిక్స్ వల్ల బ్యాక్టీరియాను కొంతలో కొంత అరికట్టవచ్చు. అయితే వైరస్ ఇందుకు భిన్నంగా ఉంటుంది. సరైన వ్యాక్సిన్ లేకపోతే వైరస్ మానవాళిపై విధ్వంసం సృష్టిస్తుంది. ఇందుకు ఉదాహరణ కరోనా వైరస్. గతంలో సైబీరియాలో మంచు కరగడం వల్ల రెయిన్ డీర్ లలో ఆంత్రాక్స్ వ్యాప్తి కారణం అయిన విషయాన్ని పరిశోధకులు గుర్తు చేశారు.
Read Also: Stock Market : హాంకాంగ్ను అధిగమించి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద స్టాక్ మార్కెట్గా అవతరించిన భారత్
Aix-Marseille విశ్వవిద్యాలయానికి చెందిన జన్యు శాస్త్రవేత్త జీన్-మిచెల్ క్లావేరీ ఇలా అన్నారు. ఈ జాంబీ వైరస్ వ్యాప్తిపై పరిశోధనలు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. కొత్త వ్యాధి వ్యాప్తిని ప్రారంభించే సామర్థ్యం ఉన్న వైరస్లు అక్కడ ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ వైరస్లు మానవులకు సోకి కొత్త వ్యాధిని వ్యాప్తిని చేయగలవని ఆయన చెప్పారు. ఇంకా, రోటర్డ్యామ్లోని ఎరాస్మస్ మెడికల్ సెంటర్కు చెందిన శాస్త్రవేత్త మారియన్ కూప్మాన్స్ ఇదే విషయాన్ని అంగీకరించారు. “పర్మాఫ్రాస్ట్లో అక్కడ ఏ వైరస్లు ఉన్నాయో మాకు తెలియదు, కానీ ప్రేరేపించగల సామర్థ్యం ఒకటి ఉండే ప్రమాదం ఉందని నేను భావిస్తున్నానని అన్నారు. ఆర్కిటిక్ శాశ్వత మంచులో ఘనీభవించిన పురాతన “జాంబీ వైరస్”లను సూక్ష్మజీవులు అని కూడా పిలుస్తారు. అవి పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతల సమయంలో విడుదలైతే భూమిపై పెద్ద వ్యాధిని వ్యాప్తి చేస్తాయని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇది జాంబీ వైరస్ల వల్ల సంభవించే వ్యాధి ప్రారంభ కేసులను భయంకరమైన వ్యాప్తికి ముందే గుర్తించగలమని సైంటిస్ట్ జీన్-మిచెల్ క్లావేరీ వెల్లడించారు. తాము ఇప్పుడు స్పష్టమైన ముప్పును ఎదుర్కొంటున్నామన్నారు. దానిని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా వుండాలని జన్యు శాస్త్రవేత్త జీన్-మిచెల్ క్లావేరీ అన్నారు.
2014లో సైబీరియాలో శాస్త్రవేత్తల బృందం ఈ జాంబీ వైరస్లలో కొన్నింటిని పునరుద్ధరించింది. వేల సంవత్సరాల పాటు శాశ్వత మంచులో పాతిపెట్టబడినప్పటికీ, ప్రత్యక్ష వైరస్లు ఇప్పటికీ ఒకే కణజీవులకు సోకగలవని అధ్యయనం వెల్లడించింది. సిబెనాలో ప్రయోగించిన వైరస్ అమీబా వంటి ఏకకణ జీవులకు మాత్రమే సోకింది. మానవులకు సోకలేదని తెలిసింది. ఈ వైరస్లు మానవులలో అనారోగ్యాన్ని ప్రేరేపించగలవని మరో శాస్త్రవేత్త క్లావెన్ పేర్కొన్నారు. శాశ్వత మంచు జీవ పదార్థాన్ని సంరక్షించగలదు కాబట్టి, ఈ వైరస్లు ఇప్పటికీ ప్రపంచానికి ముప్పు కలిగిస్తాయి. వాతావరణ మార్పు ఫలితంగా ఆర్కిటిక్ శాశ్వత మంచు కరుగుతుంది, తద్వారా జాంబీ వైరస్లు విడుదలయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.
తాజావార్తలు
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్కు అసలు విలన్ ఎవరు.?
-
UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
-
KRMB : కృష్ణా నీళ్లపై మళ్లీ పంచాయితీ.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
Mobile SIM Card Rules 2026: మీకు తెలియకుండానే మీ పేరుపై సిమ్ ఉందా? ఇలా చెక్ చేయండి.. రిపోర్ట్ చేయండి..
-
Dil Raju: ‘టాక్సిక్’పై దిల్ రాజు రూ.120 కోట్ల బిగ్ బెట్? ఇక అంతా యశ్పైనే!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!