Zambia Cholera Outbreak: కలరాతో 600 మంది మృతి.. జాంబియాకు భారత్ సాయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
600 Peoples Dies in Zambia Due to Cholera: ఆఫ్రికా దేశం అయిన జాంబియా.. ఆ దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జాంబియాను ప్రస్తుతం కలరా వ్యాధి పట్టిపీడిస్తోంది. వేలాది మంది ఈ అతిసార వ్యాధి బారినపడగా.. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఓ అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. అక్టోబర్ 2023 నుంచి దాదాపు 600 మంది కలరా వ్యాధితో మరణించారు. 15,000 మందికి పైగా కలరాతో బాధపడుతున్నారు. దేశంలోని మొత్తం పది ప్రావిన్స్ల్లో తొమ్మిదింటిలో ఈ వ్యాధి ప్రబలింది.
సాధారణంగా కలరాతో మరణాల రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉంటుంది. కానీ జాంబియాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడ మరణాల రేటు నాలుగు శాతం కంటే ఎక్కువగా ఉండటం జాంబియా దేశ ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఇప్పటికే అనేక మంది ప్రాణాలను బలిగొన్న కలరా వ్యాప్తిని అరికట్టడానికి జాంబియా శ్రమిస్తోంది. ఎక్కువ కేసులు ఉన్న లుసాకాలో నేషనల్ హీరోస్ స్టేడియం వెలుపల తాత్కాలిక చికిత్సా కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం సామూహిక టీకా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. అధికారులు ప్రభావిత ప్రాంతాలకు రోజుకు 2.4 మిలియన్ లీటర్ల స్వచ్ఛమైన నీటిని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించే ప్రచారాన్ని కూడా చేపట్టారు.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
Also Read: California Rainstorm: కాలిఫోర్నియాలో రికార్డు వర్షపాతం.. ముగ్గురు మృతి!
జాంబియాలో పరిస్థితులు దిగజారడంతో.. విశ్రాంత వైద్య సిబ్బంది సేవలను కూడా ప్రభుత్వం తీసుకుంటోంది. ఓ వైపు సహాయక చర్యలు కొనసాగుతుంటే.. మరోవైయిపు భారీ వర్షాలు వైద్య సేవలు, సురక్షిత నీటి సరఫరాకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో జాంబియాకు భారత్ సాయం అందించింది. క్లోరిన్ మాత్రలు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, నీటి శుద్ధి యంత్రాలతో కూడిన 3.5 టన్నుల మానవతా సాయాన్ని పంపించింది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!