YSRCP Syamala : మాజీ సీఎం కుటుంబ సభ్యులకు కూడా రక్షణ లేదు..
- టీడీపీ, జనసేన సోషల్ మీడియా తోడేళ్ళు తెగ మొరుగుతున్నారు
- రెడ్ బుక్ రాజ్యాంగంలో మునిగిపోతున్న పోలీస్ వ్యవస్థ
- మాజీ సీఎం కుటుంబ సభ్యులకు కూడా రక్షణ లేదు
- ఈ వ్యవస్థను అడ్డం పెట్టుకుని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు
- టీడీపీ, జనసేన పెంచి పోషిస్తుంది కాబట్టి కేసులు నమోదు కావు
- వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల టీడీపీ-జనసేనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత కొన్ని నెలలుగా ఈ రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు సోషల్ మీడియాలో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, మహిళలను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. మహిళల పట్ల గౌరవం ఉందని చెప్పే వారే, వారికి ఇచ్చిన హామీలను వదిలేసినప్పుడే వారి నిజమైన స్వభావం బయటపడిందని మండిపడ్డారు. రాజ్యంలో పోలీస్ వ్యవస్థ ‘రెడ్ బుక్ రాజ్యాంగం’లో మునిగిపోతోందని, మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు కూడా రక్షణ లేకుండా పోతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థను అడ్డం పెట్టుకుని టీడీపీ, జనసేన నాయకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీల మహిళా నేతలపై బరితెగించి పోస్టులు పెట్టినా, వారికి కేసులు పెట్టడం లేదని, ఎందుకంటే వారిని టీడీపీ-జనసేనే పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు.
READ MORE: Jaat Movie : జాట్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే..?
Also Read
- Mahanadu : 'స్త్రీ శక్తి' థీమ్తో టీడీపీ మహానాడు.. 20 కీలక తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
- PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
- CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
- RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
సోషల్ మీడియా దుర్వినియోగంపై ఇప్పటికే వందల ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ చర్యలు లేవని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. కిరణ్ అనే వ్యక్తి చేసిన తప్పుకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసు నమోదు చేయడమే దీనికి ఉదాహరణ అని చెప్పారు. ఆయన అరెస్ట్ కూడా ప్రజల మభ్యపెట్టడానికి వేసిన ముసుగు మాత్రమేనని పేర్కొన్నారు. హోంమంత్రి అనిత గతంలో విజయమ్మపై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ప్రజలకి గుర్తున్నాయన్నారు. ఇప్పుడు కూడా ఆమె ప్రచార ఆర్భాటాలకే పరిమితమై, మహిళల పరిరక్షణలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. జగన్ పర్యటన సమయంలో టీడీపీకి చెందిన మహిళా నేతను ‘రౌడీ’గా సంబోధించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. నటన చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు కానీ మానవతా విలువలు లేవని విమర్శించారు.
READ MORE: AIADMK-BJP: బీజేపీ, అన్నాడీఎంకే పొత్తును ప్రకటించిన అమిత్ షా..
ఐటీడీపీ కార్యకర్త కిరణ్ చంద్రబాబు పేరే చెప్పినా, ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల ప్రశ్నించారు. ఐటీడీపీని సృష్టించినవాళ్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లేనని, వారే ఈ హద్దుల్లేని సోషల్ మీడియా తీరుకు బాధ్యత వహించాలని ఆమె స్పష్టం చేశారు. మహిళల వ్యక్తిత్వ హననం జరుగుతున్నా ఈ నేతలు కామెడీ స్కిట్లాగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడిని ‘సైకో’ అని పిలిచిన వారెవరో చెప్పాలని డిమాండ్ చేశారు. పిఠాపురం అభ్యర్థి పవన్ కళ్యాణ్ ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసినా ఎందుకు కేసులు నమోదు కాలేదని ప్రశ్నించారు. సోషల్ మీడియా కార్యకర్తలు రెచ్చిపోతుంటే నేతలు చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారని మండిపడ్డారు.
READ MORE: Traffic Advisory : హైదరాబాద్లో హనుమాన్ శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..!
చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే ఇచ్చిన ఫిర్యాదులపై ఎంతమేరకు కేసులు నమోదయ్యాయో ప్రభుత్వం వెల్లడించాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల డిమాండ్ చేశారు. మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే, సోషల్ మీడియాలో టార్గెట్ చేసి మానసికంగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితిని వివరించారు. ఇది ఓ ఆర్గనైజ్డ్ క్రైమ్కి రూపం దాల్చిందని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. చివరగా, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పీ4 కాదు కానీ ఏ4 అమలవుతుందని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Mahanadu : ‘స్త్రీ శక్తి’ థీమ్తో టీడీపీ మహానాడు.. 20 కీలక తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
-
PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!