YSRCP Syamala : మాజీ సీఎం కుటుంబ సభ్యులకు కూడా రక్షణ లేదు..
- టీడీపీ, జనసేన సోషల్ మీడియా తోడేళ్ళు తెగ మొరుగుతున్నారు
- రెడ్ బుక్ రాజ్యాంగంలో మునిగిపోతున్న పోలీస్ వ్యవస్థ
- మాజీ సీఎం కుటుంబ సభ్యులకు కూడా రక్షణ లేదు
- ఈ వ్యవస్థను అడ్డం పెట్టుకుని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు
- టీడీపీ, జనసేన పెంచి పోషిస్తుంది కాబట్టి కేసులు నమోదు కావు
- వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల వ్యాఖ్యలు
వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల టీడీపీ-జనసేనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత కొన్ని నెలలుగా ఈ రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు సోషల్ మీడియాలో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, మహిళలను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. మహిళల పట్ల గౌరవం ఉందని చెప్పే వారే, వారికి ఇచ్చిన హామీలను వదిలేసినప్పుడే వారి నిజమైన స్వభావం బయటపడిందని మండిపడ్డారు. రాజ్యంలో పోలీస్ వ్యవస్థ ‘రెడ్ బుక్ రాజ్యాంగం’లో మునిగిపోతోందని, మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు కూడా రక్షణ లేకుండా పోతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థను అడ్డం పెట్టుకుని టీడీపీ, జనసేన నాయకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీల మహిళా నేతలపై బరితెగించి పోస్టులు పెట్టినా, వారికి కేసులు పెట్టడం లేదని, ఎందుకంటే వారిని టీడీపీ-జనసేనే పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు.
READ MORE: Jaat Movie : జాట్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే..?
Also Read
- Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
- RCB Vs GT: ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లీ.. మరో రికార్డు బద్దలు కొట్టిన విరాట్..
సోషల్ మీడియా దుర్వినియోగంపై ఇప్పటికే వందల ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ చర్యలు లేవని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. కిరణ్ అనే వ్యక్తి చేసిన తప్పుకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసు నమోదు చేయడమే దీనికి ఉదాహరణ అని చెప్పారు. ఆయన అరెస్ట్ కూడా ప్రజల మభ్యపెట్టడానికి వేసిన ముసుగు మాత్రమేనని పేర్కొన్నారు. హోంమంత్రి అనిత గతంలో విజయమ్మపై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ప్రజలకి గుర్తున్నాయన్నారు. ఇప్పుడు కూడా ఆమె ప్రచార ఆర్భాటాలకే పరిమితమై, మహిళల పరిరక్షణలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. జగన్ పర్యటన సమయంలో టీడీపీకి చెందిన మహిళా నేతను ‘రౌడీ’గా సంబోధించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. నటన చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు కానీ మానవతా విలువలు లేవని విమర్శించారు.
READ MORE: AIADMK-BJP: బీజేపీ, అన్నాడీఎంకే పొత్తును ప్రకటించిన అమిత్ షా..
ఐటీడీపీ కార్యకర్త కిరణ్ చంద్రబాబు పేరే చెప్పినా, ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల ప్రశ్నించారు. ఐటీడీపీని సృష్టించినవాళ్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లేనని, వారే ఈ హద్దుల్లేని సోషల్ మీడియా తీరుకు బాధ్యత వహించాలని ఆమె స్పష్టం చేశారు. మహిళల వ్యక్తిత్వ హననం జరుగుతున్నా ఈ నేతలు కామెడీ స్కిట్లాగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడిని ‘సైకో’ అని పిలిచిన వారెవరో చెప్పాలని డిమాండ్ చేశారు. పిఠాపురం అభ్యర్థి పవన్ కళ్యాణ్ ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసినా ఎందుకు కేసులు నమోదు కాలేదని ప్రశ్నించారు. సోషల్ మీడియా కార్యకర్తలు రెచ్చిపోతుంటే నేతలు చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారని మండిపడ్డారు.
READ MORE: Traffic Advisory : హైదరాబాద్లో హనుమాన్ శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..!
చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే ఇచ్చిన ఫిర్యాదులపై ఎంతమేరకు కేసులు నమోదయ్యాయో ప్రభుత్వం వెల్లడించాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల డిమాండ్ చేశారు. మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే, సోషల్ మీడియాలో టార్గెట్ చేసి మానసికంగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితిని వివరించారు. ఇది ఓ ఆర్గనైజ్డ్ క్రైమ్కి రూపం దాల్చిందని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. చివరగా, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పీ4 కాదు కానీ ఏ4 అమలవుతుందని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Silver Price: సిల్వర్ మార్కెట్ హీట్.. వెండి ధరల్లో అనూహ్య మార్పులు..
-
West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
-
Chips and Soft Drinks Side Effects : చిప్స్ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే ఈ ప్రమాదాలు తప్పవు.!
-
Minumula Payasam Recipe: నడుము నొప్పికి చెక్.. 60 ఏళ్లలోనూ ఉక్కులాంటి బలం ఇచ్చే ‘మినుముల పాయసం’!
-
AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!