YSRCP Syamala : మాజీ సీఎం కుటుంబ సభ్యులకు కూడా రక్షణ లేదు..
- టీడీపీ, జనసేన సోషల్ మీడియా తోడేళ్ళు తెగ మొరుగుతున్నారు
- రెడ్ బుక్ రాజ్యాంగంలో మునిగిపోతున్న పోలీస్ వ్యవస్థ
- మాజీ సీఎం కుటుంబ సభ్యులకు కూడా రక్షణ లేదు
- ఈ వ్యవస్థను అడ్డం పెట్టుకుని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు
- టీడీపీ, జనసేన పెంచి పోషిస్తుంది కాబట్టి కేసులు నమోదు కావు
- వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల టీడీపీ-జనసేనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత కొన్ని నెలలుగా ఈ రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు సోషల్ మీడియాలో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, మహిళలను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. మహిళల పట్ల గౌరవం ఉందని చెప్పే వారే, వారికి ఇచ్చిన హామీలను వదిలేసినప్పుడే వారి నిజమైన స్వభావం బయటపడిందని మండిపడ్డారు. రాజ్యంలో పోలీస్ వ్యవస్థ ‘రెడ్ బుక్ రాజ్యాంగం’లో మునిగిపోతోందని, మాజీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు కూడా రక్షణ లేకుండా పోతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థను అడ్డం పెట్టుకుని టీడీపీ, జనసేన నాయకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీల మహిళా నేతలపై బరితెగించి పోస్టులు పెట్టినా, వారికి కేసులు పెట్టడం లేదని, ఎందుకంటే వారిని టీడీపీ-జనసేనే పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు.
READ MORE: Jaat Movie : జాట్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే..?
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
సోషల్ మీడియా దుర్వినియోగంపై ఇప్పటికే వందల ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ చర్యలు లేవని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. కిరణ్ అనే వ్యక్తి చేసిన తప్పుకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసు నమోదు చేయడమే దీనికి ఉదాహరణ అని చెప్పారు. ఆయన అరెస్ట్ కూడా ప్రజల మభ్యపెట్టడానికి వేసిన ముసుగు మాత్రమేనని పేర్కొన్నారు. హోంమంత్రి అనిత గతంలో విజయమ్మపై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ప్రజలకి గుర్తున్నాయన్నారు. ఇప్పుడు కూడా ఆమె ప్రచార ఆర్భాటాలకే పరిమితమై, మహిళల పరిరక్షణలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. జగన్ పర్యటన సమయంలో టీడీపీకి చెందిన మహిళా నేతను ‘రౌడీ’గా సంబోధించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. నటన చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు కానీ మానవతా విలువలు లేవని విమర్శించారు.
READ MORE: AIADMK-BJP: బీజేపీ, అన్నాడీఎంకే పొత్తును ప్రకటించిన అమిత్ షా..
ఐటీడీపీ కార్యకర్త కిరణ్ చంద్రబాబు పేరే చెప్పినా, ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల ప్రశ్నించారు. ఐటీడీపీని సృష్టించినవాళ్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లేనని, వారే ఈ హద్దుల్లేని సోషల్ మీడియా తీరుకు బాధ్యత వహించాలని ఆమె స్పష్టం చేశారు. మహిళల వ్యక్తిత్వ హననం జరుగుతున్నా ఈ నేతలు కామెడీ స్కిట్లాగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడిని ‘సైకో’ అని పిలిచిన వారెవరో చెప్పాలని డిమాండ్ చేశారు. పిఠాపురం అభ్యర్థి పవన్ కళ్యాణ్ ప్రజలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసినా ఎందుకు కేసులు నమోదు కాలేదని ప్రశ్నించారు. సోషల్ మీడియా కార్యకర్తలు రెచ్చిపోతుంటే నేతలు చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నారని మండిపడ్డారు.
READ MORE: Traffic Advisory : హైదరాబాద్లో హనుమాన్ శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..!
చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే ఇచ్చిన ఫిర్యాదులపై ఎంతమేరకు కేసులు నమోదయ్యాయో ప్రభుత్వం వెల్లడించాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల డిమాండ్ చేశారు. మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే, సోషల్ మీడియాలో టార్గెట్ చేసి మానసికంగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితిని వివరించారు. ఇది ఓ ఆర్గనైజ్డ్ క్రైమ్కి రూపం దాల్చిందని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. చివరగా, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పీ4 కాదు కానీ ఏ4 అమలవుతుందని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!