YSRCP : విద్యుత్‌ ఛార్జీల పెంపుపై నేడు వైసీపీ నిరసనలు

  • విద్యుత్‌ ఛార్జీల పెంపుపై నేడు వైసీపీ నిరసనలు
  • ఏపీ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన వైసీపీ.
Ysrcp

Ysrcp

YSRCP : ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలపై అదనపు భారాన్ని మోపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. విద్యుత్ ఛార్జీల పెంపుతో సామాన్యులపై భారాన్ని పెంచిన ప్రభుత్వ నిర్ణయం దారుణమని ఆ పార్టీ నేతలు విమర్శించారు. విద్యుత్ ఛార్జీల పెంపు కారణంగా ప్రజలపై రూ. 15,000 కోట్ల అదనపు భారం పడిందని వైసీపీ ఆరోపించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపుతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో నేతలు, కార్యకర్తలు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.

Kamareddy: మిస్టరీగా ఎస్.ఐ, కానిస్టేబుల్, ఆపరేటర్ మృతి కేసు.. కీలకంగా మారిన కాల్ డేటా..

వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, “సూపర్ సిక్స్ గ్యారెంటీ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లోనే ప్రజలపై అధిక భారం మోపడం విచారకరం. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి,” అని పేర్కొన్నారు. ప్రభుత్వంపై నిరసన ప్రదర్శనలు చేపట్టే వరకు వైసీపీ తన ఉద్యమాన్ని కొనసాగిస్తుందని పార్టీ నేతలు స్పష్టం చేశారు. పార్టీ జిల్లా ఇన్‌చార్జులతో పాటు కార్యకర్తలకు శుక్రవారం నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

WHO Chief: బాంబు దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన డబ్ల్యూహెచ్‌వో అధ్యక్షుడు