Vijaya Sai Reddy: లంచాలు తిని కంచాలు మోగించేది టీడీపీనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేలా రెండు రోజుల పాటు సమీక్షా సమావేశాలు నిర్వహించామని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ పార్టీ మోతలు ఎందుకు.. లంచాలు తీసుకొని కంచాలు కొట్టడం ఎందుకు.. అన్ని కోర్టులు తిరస్కరించాకే చంద్రబాబు జైల్లో ఖైదీగా ఉన్నాడు.. ఎవరి కోసం హారన్లు.. ఎవరి కోసం విజిల్స్? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏ మొహం పెట్టుకొని ఇవాళ ఈ ఆందోళనకు పిలుపునిచ్చారు? అని విజయసాయిరెడ్డి మండిపడ్డాడు. రాజ్యాంగంపై, చట్టంపై నమ్మకం లేని అసాంఘిక శక్తులుగా టీడీపీ పార్టీ మారిందని విమర్శలు గుప్పించాడు.
Read Also: Ayodhya idol: అయోధ్యలోని ఓ రహస్య ప్రాంతంలో తయారవుతున్న రాముడి శిల్పం
Also Read
ఆంధ్రలో కంటే ఢిల్లీలో కంచాలు కొడితే బాగుంటుంది అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అవినీతి మోతా మోగించాడు కాబట్టే.. చంద్రబాబు ఇంట్లో ఈగల మోతా.. జైల్లో దోమల మోతా ఉంది.. ఈడీ ఆఫీస్ ముందు తప్పుడు కేసు అని లోకేశ్ కొట్టొచ్చు.. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఇంటి ముందు నీకు మద్దతు పలుకుతున్న రేవంత్ రెడ్డి నుంచి జయప్రకాష్ నారాయణ వరకు అందరూ కలిసి కంచాలు కొట్టవచ్చుగా అంటూ నారా లోకేశ్ కు విజయసాయిరెడ్డి చురకలు అంటించాడు. గత రెండు వారాలుగా నారా లోకేశ్ ఢిల్లీలో దాక్కున్నాడు.. నలుగురు ఎంపీలతో పాటు తమకు మద్దతు పలికిన వివిధ పార్టీ నేతలతో కలిసి లోకేశ్ ఢిల్లీలో ఈడీ ఆఫీస్ ముందు కంచాలు కొడితే బాగుంటుంది అని ఆయన అన్నారు.
Read Also: Theft of shoes: బూట్లు దొంగిలించిన దొంగ కోసం పోలీసుల గాలింపు
ఈ ఆందోళన ద్వారా మీరు ప్రజలకు ఏమి చెప్పదలచుకున్నారు.. ఢిల్లీలో దాక్కున్న లోకేశ్ ధైర్యవంతుడా… ఉత్తర కుమారుడా అని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రశ్నించాడు. ప్రాజెక్ట్ ప్రారంభం కాకుండా ఇన్నర్ రింగ్ రోడ్ లో స్కాం జరిగింది అని విజయసాయిరెడ్డి అన్నారు. అభ్యర్థుల విషయంలో కొన్ని మార్పులు చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.. దసరా నుంచి వైజాగ్ నుంచే ప్రభుత్వ పాలన ఉంటుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదు.. షెడ్యూల్ ప్రకారమే ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు జరుగుతాయి.. ప్రత్యేక హోదా కోసం మా పోరాటం కొనసాగుతోంది అని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Bonalu 2026: గోల్కొండ నుంచి లాల్దర్వాజా వరకు.. బోనాల జాతరకు సర్వం సిద్ధం..
-
US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
-
Shabad Murder Case : చనిపోవడానికి ముందు రాజ్కుమార్ సెల్ఫీ వీడియో.. విస్తుపోయే నిజాలు..!
-
Trump: ఇకపై హార్ముజ్ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
-
Asian U23 Athletics: స్వర్ణ పతకంతో మెరిసిన తెలంగాణ బిడ్డ.. సీఎం రేవంత్ అభినందనలు..
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!