Vijayasai Reddy: కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం.. ఈసారి కూడా మాదే విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఢిల్లీలో హీట్ పుట్టిస్తోంది.. దొంగ ఓట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి పోటాపోటీగా ఫిర్యాదులు అందాయి.. మొదట కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి రాష్ట్రంలో ఓట్ల తొలగింపుపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేస్తే.. ఆ వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం అదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది.. అంశం ఒకటే అయినా.. ఎవ్వరి వైఖరి వారికి ఉంది.. ఇక, కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడారు వైసీపీ రాస్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి.. అన్ని అంశాలను పరిశీలిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం హామీ ఇచ్చిందన్నారు. దొంగ ఓట్లను తయారు చేయడంలో చంద్రబాబు వ్యవహరించిన తీరును కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించామన్న ఆయన. వెన్నుపోటు పొడుస్తారు, ఎన్టీఆర్ ఫొటోకు దండ వేస్తారని చంద్రబాబుపై మండిపడ్డారు.
2015, 2016, 2017లో ఎన్ని దొంగ ఓట్లు నమోదు అయ్యాయో, మా పార్టీ సానుభూతిపరుల ఓట్లను ఏ రకంగా తొలగించారో కేంద్ర ఎన్నికల సంఘానికి వివరంగా తెలియజేశామని తెలిపారు సాయిరెడ్డి.. 60 నియోజకవర్గాల్లో ఎంత మేరకు దొంగ ఓట్లు ఉన్నాయో తెలియజేశాం. చంద్రబాబ హయాంలో నమోదైన దొంగ ఓట్లు తొలగిస్తారేమోననే ఉద్దేశంతోనే ఢిల్లీకి వచ్చారని విమర్శించారు. సాక్ష్యాలతో సహా వివరాలను అందజేశాం. అన్ని నియమ. నిబంధనలను ఏ రకంగా చంద్రబాబు దుర్వినియేగం చేశారో తెలియజేశామన్న ఆయన.. సర్వే సంస్థల ద్వారా చంద్రబాబు అభ్యంతరకర సమాచారాన్ని సేకరిస్తున్న విషయం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేశామని వెల్లడించారు. చంద్రబాబు ఏ మేరకు కులవాదో కూడా తెలియచేశాం. ఓటరది ఏ కులమో నమోదు చేసే పని చేస్తున్నారు. ఓటరు ఏ రాజకీయ పక్షమో కూడా సమాచారం సేకరిస్తున్నారు. ఇవన్నీ అభ్యంతరకర మైన అంశాలని ఈసీ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు.
Also Read
- Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
- Vizag: పరిచయస్తులే యమకింకరులు.. సాగర తీరంలో వరుస హత్యల వెనుక మిస్టరీ ఇదేనా?
- Nalgonda: ప్రాణం తీసిన దశాబ్ద కాలం క్రితం పగ.. బీఆర్ఎస్ నేత హత్య వెనుక ఏం జరిగిందంటే..!
- Marco Rubio: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచానికి దీర్ఘకాలిక సంక్షోభం.. మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
దొంగ ఓట్లు నమోదులో చంద్రబాబు వరల్డ్ ఛాంపియన్ అంటూ వ్యాఖ్యానించారు విజయసాయిరెడ్డి.. చంద్రబాబుతో ఈ విషయంలో ఎవరైనా పోటీ పడగలరా..? అని ప్రశ్నించిన ఆయన.. 2014 నుంచి 2019 వరకు ఏం జరిగిందో విచారణ చేయమని కోరాం.. చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం హామీ ఇచ్చిందన్నారు. దొంగ ఓట్లు ఎన్నో చేర్చినా.. మాకు 49 శాతం ఓట్లతో ప్రజలు అధికారం అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో కూడా మాదే విజయమనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. ఈసారి 51 శాతం మేరకు ఓట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఓటరు కార్డుతో ఆధార్ నెంబర్ ను లింక్ చేయాలని కూడా కోరామని తెలిపారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.
తాజావార్తలు
-
RCB vs GT : గుజరాత్పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!