YSRCP: రేపటి నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు.. వైసీపీ వ్యూహాలు ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: ప్రజల, రాష్ట్ర ప్రయోజనాలే అజెండాగా పార్లమెంట్లో మా విధానం ఉంటుందని వైసీపీ ఎంపీ, ఆ పార్టీ లోక్సభా పక్ష నేత మిథున్ రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశాల పూర్తి అజెండాపై ఇప్పటి వరకు స్పష్టత లేదన్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎంపీలకు మార్గనిర్దేశం చేశారని తెలిపారు. జమిలి ఎన్నికల ప్రభావం రాష్ట్రంపై ఎక్కువగా ఉండదన్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు రాష్ట్రంలో ఏక కాలంలోనే కొనసాగుతున్నాయన్నారు. చంద్రబాబు అవినీతిపై ఆధారాలు లేకపోతే కోర్టు ఎందుకు రిమాండ్ విధిస్తుందని ప్రశ్నించారు. తప్పు చేయకపోతే చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ దేశం వదిలి ఎందుకు పారిపోయారన్నారు. ప్రభుత్వ డబ్బు షెల్ కంపెనీల ద్వారా ఎలా రూటింగ్ అయ్యిందో ఐటీ , ఈడీ ఆధారాలతో సహా బయట పెట్టాయన్నారు. ఐటీ, ఈడీలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కాదు కదా అంటూ ఆయన తెలిపారు.
Also Read: AP CM Jagan: రెండు రోజుల పాటు సీఎం జగన్ బిజీ షెడ్యూల్ ఇదే..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
చంద్రబాబు పీఎ శ్రీనివాస్ రెండు వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారని ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అభియోగాలు మోపిందని ఆయన తెలిపారు. చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టారన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ప్రియ శిష్యుడని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీకి రాష్ట్రంలో ఓట్ బ్యాంకు లేదని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. ఎంత మంది కలిసి వచ్చినా జగన్కే ప్రజల మద్దతు ఉందని.. మేం ప్రజలనే నమ్ముకున్నామన్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..