Gadikota Srikanth Reddy: పవన్కు చిత్తశుద్ధి ఉంటే సీఐ అంజూయాదవ్కు క్షమాపణలు చెప్పాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gadikota Srikanth Reddy: జనసేన అధినేత పవన్ కల్యాణ్కు చిత్తశుద్ధి ఉంటే శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేవారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎక్కడో చిన్న సంఘట జరిగితే రాయలసీమ గుండాలు అన్నప్పుడు పవన్ ఎందుకు ప్రశ్నించ లేదు? అని నిలదీశారు. చంద్రబాబును సంతృప్తి చేయటమే పవన్ కల్యాణ్ అజెండా అని విమర్శించారు. హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలి.. రాజకీయం అంటే ఒక బాధ్యత.. ఊగిపోతూ మాట్లాడటం.. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయటం కాదు అని హితవుపలికారు.. ధైర్యం ఉంటే 2014లో టీడీపీ మేనిఫెస్టోను కార్యకర్తల ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికి పంపించాలని డిమాండ్ చేశారు. మేం ప్రతి ఇంటికి మేనిఫెస్టో తీసుకుని వెళుతున్నాం.. అమరావతిలో పేదవాళ్ళు ఉండకూడదన్న టీడీపీకి, అన్ని వర్గాల వారు ఉండాలని 50 వేల మందికి ఇంటి స్థలాలు ఇచ్చిన జగన్ కు పొంతన ఉందా? చంద్రబాబు 14 ఏళ్ళ పాలన, జగన్ నాలుగేళ్ల పాలన పై చర్చకు మేం సిద్ధం అంటూ సవాల్ చేశారు.
చంద్రబాబు ఎంతో మందిని బలి పశువులను చేశాడు.. ఈ సారి చంద్రబాబు చేతిలో బలి పశువు పవన్ కల్యాణ్ అని వ్యాఖ్యానించారు గడికోట శ్రీకాంత్ రెడ్డి.. నేను, సీఎం జగన్ కలసి ఒకేచోట చదివామని పవన్ చెబుతున్నారు.. నేను కడపలో చదివితే, జగన్ హైదరాబాద్ లో చదివారని గుర్తుచేశారు. వాస్తవాలు తెలియకుండా పవన్ మాట్లాడుతున్నారు.. ఇది సరైంది కాదని హెచ్చరించారు. ఇక, సీఐ అంజూయాదవ్ ను మహిళ అని కూడా చూడకుండా బూతులు తిట్టారు అంటూ ఫైర్ అయ్యారు.. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సీఐ చేయి చేసుకున్నారన్న ఆయన.. పవన్ కు చిత్తశుద్ధి ఉంటే సీఐ అంజూయాదవ్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థ ఆత్మ స్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేయటం కరెక్ట్ కాదు.. మీ లాంటి రౌడీ షీపర్లను అడ్డుకట్ట వేయటానికి పోలీసు వ్యవస్థ ఉండాలన్నారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
వేదిక ఎక్కి చెప్పులు చూపించటం, తోలు తీస్తా, తాట తీస్తా అనడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు శ్రీకాంత్రెడ్డి.. 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయగలం అని టీడీపీ, జనసేన ఎందుకు చెప్పలేకపోతున్నారు.. ప్రజాదరణ లేదని ఇక్కడే అర్థం అవుతుందని ఎద్దేవా చేశారు. ఇక, బీజేపీ మా పై ఆరోపణలు చేసే ముందు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.. ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్ ఏమయ్యిందో బీజేపీ సమాధానం చెప్పాలన్న ఆయన.. రాజకీయం కోసం ఆరోపణలు చేయటం కరెక్ట్ కాదన్నారు. మాది సెక్యులర్ పార్టీ.. యూనిఫాం సివిల్ కోడ్ పై మా విధానాలు ఆ రోజు ఖచ్చితంగా చెబుతాం అని స్పష్టం చేశారు గడికోట శ్రీకాంత్ రెడ్డి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!