ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని నందిగామ మండలంలోని రాఘవపురం, పల్లగిరి, కమ్మవారిపాలెం గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాలకు వెళ్లిన ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వందలాదిగా తరలివచ్చి ప్రచారంలో మొండితోకపై పూల వర్షం కురిపించారు. మీ గ్రామాలకు మంచి జరిగితేనే జగనన్నను ఆశీర్వదించండి.. మా పాలనలో మార్పు కనపడితే మద్దతు ఇవ్వండి.. అంటూ ప్రజలను ఓటు అభ్యర్థించారు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు.
Read Also: Komatireddy: మోడీ ..అచ్చేదిన్ తెస్తా అనే పేరుతో ప్రధాని అయ్యారు..
ఇక, మొండితోక జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. రెండోసారి కూడా తమ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని నందిగామ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు అన్నారు. ల్యాండ్ యాక్ట్ విధానం ప్రజలకు మంచి జరుగుతుంది.. 94 దేశాలలో ఈ ల్యాండ్ యాక్ట్ అమల్లో ఉందన్నారాయన. ప్రజల భూములకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మొండితోక జగన్ మోహన్ రావు తెలిపారు.