AP Postal Ballot votes: ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై టీడీపీ- వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Postal Ballot votes: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై టీడీపీ- వైసీపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పోలింగ్ ముగిసిన తర్వాత కొద్ది రోజులుగా మౌనంగా ఉన్న నేతలు ఇప్పుడు మళ్లీ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఈసీ పెట్టిన నిబంధనలపై కొత్త వివాదం కొనసాగుతుంది. ఇక, పోస్టల్ బ్యాలెట్టుపై ఆర్వో సీల్ లేదా సంతకం లేకున్నా లెక్కించవచ్చు అని తెలిపింది. ఈ నిబంధనల సడలింపుపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే ఏపీ అదనపు సీఈవోను కలిసి కంప్లైంట్ చేశారు. పోస్టల్ బ్యాలెట్ కవర్ల దగ్గర నుంచి, 13ఏ, 13బీ నిబంధనలు అన్నీ ముందే చెప్పారు.. ఇప్పుడు మళ్లీ సడలింపులు ఏమిటని మాజీ మంత్రి పేర్ని్నాని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Read Also: Ramajogayya Sastry : దేనికైనా కాస్త ఓపిక, సహనం ఉండాలి.. వైరల్ అవుతున్న రామజోగయ్య శాస్త్రి ట్వీట్..
Also Read
కాగా, నిబంధనలకు విరుద్దంగా సడలింపు జరిగిందని వైసీపీ ఆరోపిస్తుంది. ఇక, ఓటమి భయంతోనే పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ రాద్దాంతం చేస్తోందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆర్వోలు చేసే తప్పిదానికి తమ ఓటు మురిగిపోవడం కరెక్ట్ కాదని ఉద్యోగ సంఘాలు తెలియజేస్తున్నాయి. మరోవైపు ఏపీ ఎన్నికల్లో ఈసారి రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 5 లక్షల 39 వేల 189 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ కాగా.. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 38 వేల 865 ఓట్లు వేసినట్లు ఈసీ ప్రకటించింది. భారీగా పోలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కారణంగా ఎన్నికల ఫలితాలు సైతం కాస్త ఆలస్యంగా వెల్లడయ్యే ఛాన్స్ ఉంటుంది.
తాజావార్తలు
-
Trump-Iran: ఇరాన్తో ఒప్పందం ముగిసింది.. ఇక దాడులే.. ట్రంప్ ప్రకటనతో మళ్లీ ఉద్రిక్తతలు
-
TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఈ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
-
Garuda Puranam: ఈ 5 రకాల వ్యక్తులతో స్నేహం చేస్తే జీవితమే నరకం.. గరుడ పురాణం హెచ్చరిక కూడా ఇదే!
-
Harish Rao: మెచ్చుకోవాల్సింది పోయి.. ఏంటి ఈ చిల్లర రాజకీయాలు.?
-
EPFO EPF Interest: పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. జూలై 15 నాటికి వడ్డీ జమ.. రూ.1.44 లక్షల కోట్లు క్రెడిట్!
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..