Karumuri Sunil Kumar: బాబు, పవన్కు ఓపెన్ ఛాలెంజ్.. నిరూపిస్తే రాజకీయాలకు గుడ్బై.. మీరు సిద్ధమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karumuri Sunil Kumar: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఏలూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్.. చంద్రబాబు, పవన్ తణుకు సభ అట్టర్ ప్లాప్ అన్న ఆయన.. హైదరాబాద్ లో నా కుటుంబానికి రెండు స్టీల్ ఫ్యాక్ట్రరీలు చూపిస్తే కూటమి అభ్యర్థులకు గిఫ్ట్ గా ఇచ్చేస్తా.. ఫ్యాక్టరీలు ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటా.. నిరూపించలేకపోతే మీరు రాజకీయాలు వదిలేస్తారా..? అంటూ బహిరంగ సవాల్ విసిరారు.. ఎవరో పనికిమాలిన వాళ్లు స్క్రిప్ట్ ఇస్తే పవన్, బాబు చదివేశారు.. పవన్ కోసం బట్టలు చించుకున్నవారిని నట్టేట ముంచారు.. మీ పార్టీ వాళ్లకు న్యాయం చేయలేని వారు ప్రజలకు ఏం చేస్తారు..? అని ప్రశ్నించారు.
Read Also: Beauty Tips: ఎప్పటికీ యవ్వనంగా కనిపించాలంటే.. ఈ తప్పులు చేయొద్దు..
Also Read
- Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
- Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
- Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
- Congress: రాహుల్ గాంధీ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. అధికారులు, మీడియా షాక్..
తానొక మానవ అతీత శక్తి అని పవన్ కల్యాణ్ అనుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు కారుమూరి సునీల్.. పవన్ కల్యాణ్, చంద్రబాబు.. బాబు, కొడుకులను ఇద్దరినీ ఒడిస్తా అంటున్నారు.. ముందు మీ గెలుపు గురించి ఆలోచించండి అని సూచించారు. ఒక బీసీ యువకుడిని సీఎం వైఎస్ జగన్.. ఏలూరు పార్లమెంట్ బరిలో నిలబెట్టారు. పవన్ యువకులకు ఎన్ని సీట్లు ఇచ్చారు.. బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారు..? అని నిలదీశారు. మమ్మల్ని గోస్తాని నదిలో కలిపేస్తా అంటున్నారు.. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చేతికి గాజులు వేసుకుని కూర్చోలేదు అంటూ హెచ్చరించారు. గాయత్రి మంత్రం అంటూ 24 సీట్లు అన్నారు.. ఇపుడు ఇచ్చిన 21 సీట్లలో 11 సీట్లు టీడీపీ వాళ్లకే ఇచ్చారు? అని ఎద్దేవా చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత తణుకులో రెండు సార్లు గెలిచిన బీసీ అభ్యర్థి కారుమూరే అన్నారు. ఇక, తణుకులో జనసేన నిలబడిందంటే విడివాడ వల్లే.. అలాంటి వ్యక్తి గొంతు పవన్ కల్యాణ్ తడిగుడ్డతో కోసేశారంటూ విమర్శలు గుప్పించారు ఏలూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్.
తాజావార్తలు
-
Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
-
Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
-
Ranabaali : పెళ్లి వల్ల రణబాలి వాయిదా?
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Tilak Varma: నేను బ్యాటింగ్ చేయలేను.. జింబాబ్వే టీ20 మ్యాచ్కు ముందు తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!