YSRCP: వైసీపీ నాల్గో జాబితా.. ఉమ్మడి తూర్పు గోదావరిలో రెండు చోట్ల అభ్యర్థుల మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: నాలుగో జాబితాలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి కొవ్వూరు, గోపాలపురం అభ్యర్థులను మార్చింది వైసీపీ అధిష్టానం .. కొవ్వూరు మంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వనితను గోపాలపురానికి, గోపాలపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న తలారి వెంకట్రావు కొవ్వూరుకు మార్చింది. 2009లో టీడీపీ నుంచి గోపాలపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన తానేటి వనిత తర్వాత కాలంలో వైసీపీలో చేరి కొవ్వూరు నుంచి పోటీ చేశారు. 2014లో కొవ్వూరు నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓటమిపాలైన తానేటి వనిత.. 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పటి నుంచి మంత్రిగా ఉన్న ఆమె మరోసారి పోటీకి సిద్ధమవుతున్నా అందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు కనిపించలేదు. వర్గ పోరు కామన్ గా ఉండే నియోజకవర్గం కావడంతో ప్రతి చిన్న విషయం అక్కడ చిలికిచిలికి గాలివానగా మారుతుంది. ఈ నేపథ్యంలో మంత్రి వనితను కొవ్వూరు నుంచి గోపాలపురానికి మార్చారు. గతంలో గోపాలపురం నియోజకవర్గంలో పనిచేసిన అనుభవం ఉండడంతో ఈసారి ఎన్నికల్లో వనితకు గోపాలపురం నుంచి పోటీ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని టార్గెట్ తో వైసీపీ కనిపిస్తుంది.
Read Also: Cyber Insurance : జీవిత బీమాను మరచిపోండి.. ఇకపై సైబర్ బీమా చేయించుకోండి
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
ఇక, గత ఎన్నికల్లో వైసీపీ నుంచి తలారి వెంకట్రావు భారీ మెజార్టీతో విజయం సాధించారు. పార్టీ కార్యక్రమాలు తూచా తప్పకుండా పాటించడం, నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నాలు చేస్తూ గోపాలపురంలో తనకి ఉన్న పట్టు నిలబెట్టుకునే పనిలో ఉన్నారు తలారీ. నియోజకవర్గంలో తాగునీటి సమస్యలతోపాటు, రహదారుల ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. పేదల ఇళ్ళనిర్మాణంలో ఆలస్యం సమస్యగామారింది. ఎస్సీ రిజర్వుడు సీటు కావడంతో వైసీపీ అధిష్టానం ఈసెగ్మెంట్పై ఇప్పటికే ప్రత్యేక ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లేందుకు తలారి చుట్టు ఉన్న వివాదాలను చక్కదిద్దే ప్రయత్నాల్లో భాగంగా ఆయన్ను గోపాలపురం నుంచి మార్చారు. వచ్చే ఎన్నికల్లో కొవ్వూరు నుంచి తలారి పోటీ చేయనున్నారు. మొదటినుంచి తానేటి వనిత వర్గానికి తలారి వెంకటరావు వర్గానికి గోపాలపురంలో బేదాభిప్రాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటు మంత్రి వనితను ఇటు తలారి వెంకట్రావును వైసీపీ అధిష్టానం మార్చినట్టుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!
-
Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
-
Salim Kumar Passed Away : ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత.!
-
Spirit : ‘స్పిరిట్’ ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?
-
NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!