YSRCP: వైసీపీ నాల్గో జాబితా.. ఉమ్మడి తూర్పు గోదావరిలో రెండు చోట్ల అభ్యర్థుల మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP: నాలుగో జాబితాలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి కొవ్వూరు, గోపాలపురం అభ్యర్థులను మార్చింది వైసీపీ అధిష్టానం .. కొవ్వూరు మంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వనితను గోపాలపురానికి, గోపాలపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న తలారి వెంకట్రావు కొవ్వూరుకు మార్చింది. 2009లో టీడీపీ నుంచి గోపాలపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన తానేటి వనిత తర్వాత కాలంలో వైసీపీలో చేరి కొవ్వూరు నుంచి పోటీ చేశారు. 2014లో కొవ్వూరు నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓటమిపాలైన తానేటి వనిత.. 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పటి నుంచి మంత్రిగా ఉన్న ఆమె మరోసారి పోటీకి సిద్ధమవుతున్నా అందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు కనిపించలేదు. వర్గ పోరు కామన్ గా ఉండే నియోజకవర్గం కావడంతో ప్రతి చిన్న విషయం అక్కడ చిలికిచిలికి గాలివానగా మారుతుంది. ఈ నేపథ్యంలో మంత్రి వనితను కొవ్వూరు నుంచి గోపాలపురానికి మార్చారు. గతంలో గోపాలపురం నియోజకవర్గంలో పనిచేసిన అనుభవం ఉండడంతో ఈసారి ఎన్నికల్లో వనితకు గోపాలపురం నుంచి పోటీ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని టార్గెట్ తో వైసీపీ కనిపిస్తుంది.
Read Also: Cyber Insurance : జీవిత బీమాను మరచిపోండి.. ఇకపై సైబర్ బీమా చేయించుకోండి
Also Read
- Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
ఇక, గత ఎన్నికల్లో వైసీపీ నుంచి తలారి వెంకట్రావు భారీ మెజార్టీతో విజయం సాధించారు. పార్టీ కార్యక్రమాలు తూచా తప్పకుండా పాటించడం, నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నాలు చేస్తూ గోపాలపురంలో తనకి ఉన్న పట్టు నిలబెట్టుకునే పనిలో ఉన్నారు తలారీ. నియోజకవర్గంలో తాగునీటి సమస్యలతోపాటు, రహదారుల ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. పేదల ఇళ్ళనిర్మాణంలో ఆలస్యం సమస్యగామారింది. ఎస్సీ రిజర్వుడు సీటు కావడంతో వైసీపీ అధిష్టానం ఈసెగ్మెంట్పై ఇప్పటికే ప్రత్యేక ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లేందుకు తలారి చుట్టు ఉన్న వివాదాలను చక్కదిద్దే ప్రయత్నాల్లో భాగంగా ఆయన్ను గోపాలపురం నుంచి మార్చారు. వచ్చే ఎన్నికల్లో కొవ్వూరు నుంచి తలారి పోటీ చేయనున్నారు. మొదటినుంచి తానేటి వనిత వర్గానికి తలారి వెంకటరావు వర్గానికి గోపాలపురంలో బేదాభిప్రాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అటు మంత్రి వనితను ఇటు తలారి వెంకట్రావును వైసీపీ అధిష్టానం మార్చినట్టుగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
-
Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
-
Honor 600S 5G: 8100mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor 600S 5G.. Snapdragon చిప్, Android 16తో కొత్త ఫోన్
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!