వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో వివేకా హత్య కేసులో 39వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటివరకు నిందితులు ఎవరు అన్నది తేల్చటం సిబిఐ అధికారులకు కూడా పెద్ద సమస్యగా మారింది. కాగా, ఈ కేసులో కొత్త కొత్త పేర్లు తెరమీదకు రావటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజాగా ఎర్రగంగిరెడ్డి, అతని సోదరుడు సిద్దారెడ్డి సీబీఐ విచారణకు హాజరైనారు. మరో ఇద్దరు అనుమానితులను కూడా సీబీఐ ప్రశ్నిస్తోంది.