Ys Sharmila: పేరుకే నోటిఫికేషన్లు.. ఉద్యోగాలేవీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల్ని మోసం చేస్తోందని మండిపడ్డారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పేరుకు మాత్రమే ఉద్యోగుల నోటిఫికేషన్స్.. ముందుకు రాని ఉద్యోగాలు అంటూ విమర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబట్ పల్లి లో ఖాళీగా ఉన్న లక్ష 91 వేల ఉద్యోగాలకు వెంటనే పూర్తిస్థాయిలో నోటిఫికేషన్ లు ఇవ్వాలని, అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించాలని నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు తెలంగాణ వైస్సార్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల.
కేసీఆర్ ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు అని కొత్త మోసం మొదలు పెట్టాడన్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా 50 వేల నోటిఫికేషన్ అంటాడు కానీ దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు అదే 50 వేల ఉద్యోగాలు అని రీల్ తిప్పారు..మళ్ళీ ఇప్పుడు మునుగోడు ఎన్నికలు వచ్చాయి..మళ్ళీ 50వేల ఉద్యోగాలు అని ఊరిస్తున్నాడన్నారు. త్వరలో 50 వేల ఉద్యోగాలు అని రీల్ తిప్పుతున్నాడు..ఎన్నికలకు ముందు స్విచ్ వేయడం…ఎన్నికల తర్వాత స్విచ్ ఆఫ్ చేయడం మాత్రమే కేసీఅర్ కి తెలుసు.
Also Read
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
- Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
- Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
కేసీఆర్ పనులు గడప దాటవు.. మాటలు మాత్రం కోటలు దాటుతాయి..మాట మాత్రం గడప దాటాదు..వంగడానికి చేతకానోడు వరి చేను మొత్తం నేనే కోశాను అన్నాడట..అలా ఉంది కేసీఅర్ తీరు అని విమర్శించారు..ఉద్యోగాలు ఇవ్వాలంటే ఎన్నికలే కావాలా….ఎప్పుడంటే అప్పుడు నోటిఫికేషన్లు వేయొచ్చు కదా అన్నారు షర్మిల. 10 లక్షల మంది కార్పొరేషన్ల ద్వారా లోన్లు కావాలని దరఖాస్తు పెట్టుకున్నారు ఉద్యోగాలు ఇవ్వరు..కనీసం ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించడం చేత కాదు అసలు పరిపాలన చేతకాదని ఎద్దేవా చేశారు.
ఉద్యోగాల కల్పనలో వైఫల్యం వల్లే 8 ఏళ్ల నుంచి నిరుద్యోగం పెరిగింది..విద్యార్థులు ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..ముందు రెండు లక్షల ఉద్యోగాలు కనిపిస్తుంటే భర్తీ చేయడం చేతకాదన్నారు. అందుకే 40లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్రంలో ఉన్నారు..ఇంకా ఎంత మంది నిరుద్యోగులను పొట్టన పెట్టుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల. అచ్చంపేట నియోజక వర్గంలో రమేష్ అనే నిరుద్యోగి చావుకు కేసీఅర్ కారణం కాదా అని ప్రశ్నించారు షర్మిల.
Read Also: Babri Masjid Demolition Case: బాబ్రీ కేసులో అన్ని ధిక్కార పిటిషన్లను క్లోజ్ చేసిన సుప్రీంకోర్టు
తాజావార్తలు
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!