YS Jagan: మోంథా తుపాను బాధిత ప్రాంతాల్లో వైయస్ జగన్ పర్యటన..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు మోంథా తుపాను (Montha Cyclone) కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో ఈ నెల 4వ తేదీ (మంగళవారం) నాడు పర్యటించనున్నారు. పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు సంఘీభావం తెలిపేందుకు, వారికి అండగా నిలబడేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టనున్నారు. వైయస్ జగన్ పర్యటన కృష్ణా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కొనసాగుతుందని వైయస్సార్ సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం పత్రికా ప్రకటనలో తెలిపారు.
JD Vance divorce: అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ – ఉషకు విడాకులు ఇస్తాడా? వైరల్గా మారిన పోస్ట్!
Also Read
మోంథా తుపాను కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు, గాలులకు పంటలు పెద్ద ఎత్తున నష్టపోయి రైతులు కుదేలయ్యారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం తీరుపై వైయస్సార్సీపీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. గత వైయస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేసి రైతులకు తీవ్ర నష్టం కలిగించిందని ఆరోపించారు. గత 18 నెలల కాలంలో 16 సార్లు అల్పపీడనాలు, తుపాన్ల రూపంలో రైతులు పంటలు నష్టపోయినా ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం అందలేదని పేర్కొన్నారు. దాదాపు రూ. 600 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని వెల్లడించారు. వైయస్సార్సీపీ హయాంలో రైతుకు అండగా నిలిచిన ఆర్బీకేలు, ఈ-క్రాప్ విధానాలను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. గతంలో ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో ఆదుకునే విధానానికి స్వస్తి పలికారని, ఇవన్నీ రైతులకు పెనుశాపంగా మారాయని పేర్కొన్నారు.
Ind vs Aus: దుమ్ము దులిపిన టీమిండియా బ్యాటర్లు.. దక్షిణాఫ్రికాకు భారీ టార్గెట్..!
మోంథా తుపాను రైతుల నడ్డి విరిచినా, ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రైతులను ఆదుకునేందుకు స్పష్టమైన ప్రకటన గానీ.. కార్యాచరణ గానీ వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా, సంఘీభావంగా జగన్ పర్యటించనున్నారు. రైతుల తరఫున వారి గొంతును గట్టిగా వినిపించి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్ని నాని, తలశిల రఘురాం స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Bolla Kiran : గంజాయి ముఠా గుట్టురట్టు.. బొల్లా కిరణ్ దారుణాలు వెలుగులోకి..
-
Football Club: సంచలనం.. రూ.100కే ఫుట్బాల్ క్లబ్ అమ్మకం..
-
BRICS Summit: ఉద్రిక్తతల వేళ.. భారత్కు ఇరాన్ అధ్యక్షుడు..
-
BJP: ఇటు చూడు రాహుల్ గాంధీ.. ‘‘హగ్’’ కామెంట్స్కు ఇందిరాగాంధీతో సమాధానం..
-
George Krish: లాంచ్ రోజే శర్వానంద్ సెన్సేషన్.. ‘జార్జ్ క్రిష్’ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ లాక్!
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!