YS Jagan: కాసేపట్లో లోక్భవన్కు వైఎస్ జగన్.. గవర్నర్ను కలిసేందుకు 40 మందికి మాత్రమే అనుమతి!
- కాసేపట్లో లోక్భవన్కు వైఎస్ జగన్
- కోటి సంతకాల ప్రతులను గవర్నర్కు అందజేయనున్న జగన్
- వైసీపీకి చెందిన 40 మందికి మాత్రమే గవర్నర్ను కలిసేందుకు అనుమతి
- ఇప్పటికే లోక్భవన్కు చేరిన కోటి సంతకాల ప్రతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాసేపట్లో లోక్భవన్కు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేరుకోనున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను గవర్నర్కు అందజేయనున్నారు. వైసీపీకి చెందిన 40 మందికి మాత్రమే గవర్నర్ను కలిసేందుకు అనుమతిని ఇచ్చారు. ఇప్పటికే కోటి సంతకాల ప్రతులు లోక్భవన్కు చేరాయి. గవర్నర్కు కలిసేందుకు జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లాల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో జగన్ విజయవాడ బయలుదేరారు.
విజయవాడ నుంచి బందర్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్దకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్లనున్నారు. అంబేద్కర్ విగ్రహనికి నివాళులర్పించి.. కాలినడకన లోక్భవన్కు వెళ్లనున్నారు. జగన్ వెంట వైసీపీ నేతలు నడుస్తున్నారు. పోలీసుల నిబంధనల మేరకు 40 మందితో లోక్భవన్కు జగన్ వెళ్లనున్నారు. గవర్నర్ను కలిసి కోటి సంతకాల పత్రాలను అందించిన అనంతరం.. జగన్ మీడియాతో మాట్లాడనున్నారు. ఈరోజు ఉదయం పార్టీ కీలక నేతలతో జగన్ సమావేశం అయిన విషయం తెలిసిందే.
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
Also Read: Rajeev Shukla-BCCI: మ్యాచ్ రద్దుపై ఫాన్స్ ఫైర్.. స్పందించిన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్!
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ చొప్పున 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మించాలని వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వం ద్వారానే కార్పొరేట్ వైద్యం అందించాలని టర్గెట్ పెట్టుకున్నారు. రాష్ట్రంలో వైద్య, విద్యా అవకాశాలను విస్తరించడం కోసమే ఈ అడుగు వేశారు. ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి కాగా.. వైసీపీ దిగిపోయేనాటికి మరో 10 కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక కాలేజీల నిర్మాణం నిర్లక్ష్యం చేసింది. చివరకు పీపీవీ విధానం పేరిట ప్రైవేటీకరణ చేస్తోంది. దీనిని వ్యతిరేకిస్తూ.. కోటి సంతకాల సేకరణ పేరిట ప్రజా ఉద్యమానికి జగన్ పిలుపు ఇచ్చారు. అక్టోబర్లో గ్రామాల స్థాయిలో ‘రచ్చబండ’ పేరిట మొదలైన సంతకాల సేకరణ.. ఇప్పుడు కోటి సంతకాలను పూర్తి చేసింది. కోటి సంతకాల ప్రతులను గవర్నర్కు అందించేందుకు జగన్ వెళ్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!