YS Jagan: వైద్యులతో వైఎస్ జగన్ భేటీ.. సంక్షోభంలో పేదల వైద్యం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలువురు వైద్యులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలు దాదాపు నిలిచిపోయిన పరిస్థితులపై వైద్యులు ఆయన దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లారు. ఆరోగ్యశ్రీ సేవలు సక్రమంగా అందకపోవడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది పేద రోగులు అవసరమైన వైద్య చికిత్స పొందలేకపోతున్నారని, చికిత్సల కోసం అవసరమైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్వోసీ)లను పారదర్శకంగా జారీ చేయడం లేదని జగన్కు వివరించారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. పేదవారికి కూడా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించాలనే మహోన్నత లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పరిధిని మరింత విస్తరించామని జగన్ పేర్కొన్నారు. చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకునే కాలంలో కూడా రోగులకు ఆర్థిక సహాయం అందించే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. పేద కుటుంబాలకు వైద్య ఖర్చులు భారంగా మారకుండా అనేక సంస్కరణలు చేపట్టామని చెప్పారు.
Also Read
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని జగన్ పేర్కొన్నారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ఆసుపత్రుల అభివృద్ధి, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు వంటి కీలక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామని వివరించారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని జగన్ స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు, చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్న బాధితులకు వైఎస్సార్సీపీ పార్టీ తరఫున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు వైసీపీ అధినేత వైఎస్ జగన్..
తాజావార్తలు
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు’కి అనసూయ పరోక్ష కౌంటర్?
-
BCCI: ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి తొలి అంతర్జాతీయ అవకాశం
-
Peddi Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!