వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి వెళ్లలేదని కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకుంటే.. ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్దామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా టైం ఇస్తామని కూడా వాళ్ళు క్లారిటీ ఇవ్వరు అని వైఎస్ జగన్ మండిపడ్డారు. నేను అసెంబ్లీకి వెళ్లవద్దని ఎవరికీ చెప్పలేదన్నారు. వాళ్ళు మాట్లాడే సమయం ఇవ్వరనే అలాంటి నిర్ణయం తీసుకున్నామని వైఎస్ జగన్ తెలిపారు.