సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఓ యువకుడు రీల్ కోసం తలకిందులుగా స్టంట్ చేశాడు. కాకపోతే ఈ స్టంట్ లో భాగంగా స్కూల్ స్లాబ్ కూలిపోవడంతో అతడు చనిపోయాడు. యువకుడి శ్రమపై ఆధారపడిన నిరుపేద కుటుంబం కుదేలైంది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బాంద్రా జిల్లాలో చోటుచేసుకుంది. 21 ఏళ్ల శివమ్ రీల్ కోసం స్టంట్ చేయడానికి ఓ స్కూల్ ప్రాంగణంలోకి వెళ్లాడు. అక్కడ స్కూల్ టెర్రస్ పై తలకిందులుగా వేలాడుతున్నాడు. అతను తన చేతుల్లో ఉంచుకుని ఎక్సర్ సైజ్ చేస్తున్నట్లు స్టంట్ చేశాడు.
Also Read: Qutub Minar: త్రివర్ణంలో మెరిసిన కుతుబ్ మినార్.. ఎన్నికల వేళ అవగాహనలో భాగంగా.. వీడియో వైరల్..
ఇక అలా చేస్తున్న సమయంలో పాఠశాల స్లాబ్ ఊడిపోయింది. స్లాబ్ యొక్క శకలాలు శివపై పడ్డాయి, దాంతో అతను పడిపోయాడు. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకున్నారు. కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉన్న శివం ఆకస్మిక మరణం భరించలేకపోయారు. యువకుడి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Race car Accident: ప్రేక్షకుల మీదకి దూసుకెళ్లిన రేస్ కారు.. ఏడుగురు మృతి.. వీడియో వైరల్..
మరోవైపు, శివమ్ స్నేహితులు చిత్రీకరించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై సోషల్ మీడియా నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందించారు. ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ ప్రమాదాల బారిన పడవద్దని యువతకు హెచ్చరించారు పోలీసులు.