NTV Telugu Site icon

Clash: ‘బలగం’ సినిమా ప్రదర్శన వద్ద యువకుల ఘర్షణ.. ఓ వ్యక్తి దుర్మరణం

Balagam Movie

Balagam Movie

Clash in Jagitial District: జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారాంలో ఆదివారం అర్థరాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గుర్రం ప్రవీణ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానిక ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామస్థులు తెలుగు సినిమా ‘బలగం’ సినిమాను పబ్లిక్ స్క్రీనింగ్‌లో చూస్తున్నప్పుడు, మద్యం మత్తులో ఉన్న కొంతమంది యువకులు ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు.

Read Also: Bride Fires: వివాహ వేడుకలో గన్ పేల్చిన పెళ్లి కూతురు.. పాపం పెళ్లి కొడుకు..

వాగ్వాదం తీవ్రంగా మారడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వీరిపై ప్రత్యర్థి వర్గం ఇనుప రాడ్లతో దాడి చేయడంతో గుర్రం ప్రవీణ్, వెంకటేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందగా, వెంకటేష్‌ను జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తుల కథనం ప్రకారం శివరాత్రి నరేష్, భాగ్యరాజ్ అనే ఇద్దరు యువకులను ప్రత్యర్థి వర్గంగా గుర్తించారు. మాచారం అందుకున్న మల్యాల పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రవీణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే దాడికి పాల్పడింది శివరాత్రి నరేష్, భాగ్యరాజ్‌గా భావిస్తున్నారు.