Khammam Crime: భూమి కోసం కూల్ డ్రింక్లో విషం కలిపి అక్కను చంపిన తమ్ముడు.. మూడేళ్ల తర్వాత వెలుగులోకి..
- ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర్ గ్రామానికి చెందిన దూదిపాళ్ళ కనకమ్మ 2021 మే 5న మృతి
- సాధారణ మరణం కాదని బంధువులు అనుమానం
- తన తమ్ముడు కోమటి వెంకటేశ్వరరావు.. అక్క పేరు మీద ఉన్న 6 ఎకరాల భూమి కోసం కూల్ డ్రింక్లో విషమిచ్చి చంపాడని ఫిర్యాదు
- ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో కూల్ డ్రింక్ లో ఫాయిజన్ వున్నట్లుగా గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khammam Crime: మానవ సంబంధాలు ఎటు పోతున్నాయో కొన్ని ఘటనలు చూస్తుంటే అర్థం కావడం లేదు.. ఆస్తుల కోసం, భూముల కోసం.. తల్లిదండ్రులను, తోబుట్టువులను కూడా కాటికి పంపిస్తున్నారు కొందరు దుర్మార్గులు.. తాజాగా, అక్క పేరు మీద ఉన్న ఆరు ఎకరాల భూమి కోసం కూల్ డ్రింక్ లో విషం ఇచ్చి చంపిన తమ్ముడి ఘటన ఖమ్మం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది..
Read Also: EPFO: ఆధార్ కేవైసీ ఉంటే ఈజీగా క్లెయిమ్ చేసుకోవచ్చు
Also Read
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
- Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజర్ గ్రామానికి చెందిన దూదిపాళ్ళ కనకమ్మ 2021 మే 5న మృతిచెందగా.. ఆమెది సాధారణ మరణం కాదని బంధువులు అనుమానించారు. తన తమ్ముడు కోమటి వెంకటేశ్వరరావు.. అక్క పేరు మీద ఉన్న ఆరు ఎకరాల భూమి కోసం కూల్ డ్రింక్లో విషమిచ్చి చంపాడని ఆరోపిస్తూ ఆమె అన్నలు కోమటి నాగేశ్వరరావు, కోమటి ముత్తయ్యలు వీఎం బంజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టటంతో సోమవారం వచ్చిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో కూల్ డ్రింక్ లో ఫాయిజన్ వున్నట్లుగా తేలింది.. దీంతో.. సత్తుపల్లి రూరల్ సీఐ వెంకటేష్ ఆద్వర్యంలో.. నిందితుడు కోమటి వెంకటేశ్వరరావు పై సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అరెస్ట్ చేసి.. సత్తుపల్లి కోర్టులో హాజరు పర్చారు. ఇక, నిందితుడికి 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది కోర్టు.. ఆ తర్వాత సత్తుపల్లి సబ్ జైల్కు తరలించారు.. మూడు సంవత్సరాల తరువాత హత్య కేసులో ఫారెన్సీక్ నివేదిక ఆధారంగా నిందితుడుని పోలీస్ లు రిమాండ్ కు తరలించారు పోలీసులు..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi-Kohli: సెల్ఫిష్ అంటూ విరాట్ కోహ్లీని తిట్టిన వైభవ్ సూర్యవంశీ.. అసలు విషయం ఏంటంటే?
-
Job Crisis Explained: ఇంజినీర్లు, డాక్టర్లు ఉన్నారు కానీ ప్లంబర్లు లేరు..ఇండియాలో ఈ సైలెంట్ సంక్షోభానికి కారణమేంటి?
-
Viral News: 3 రోజుల్లో ఒంటరిగా 6000కిలోమీటర్ల ప్రయాణం.. RCB కోసం మహిళా ఫ్యాన్ ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు!
-
KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
-
Delhi: ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.! 10 మంది మృతి, పలువురికి గాయాలు.!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!