Site icon NTV Telugu

Cyber Fraud: జెమినీ ఏఐ ఫోటో ఎడిట్ యాప్‌లో ఫోటోను అప్లోడ్ చేసిన యువకుడు.. అకౌంట్‌ నుంచి రూ.70 వేలు మాయం

Gemini

Gemini

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో సైబర్ మోసం వెలుగుచూసింది. సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలతో బురిడీ కొట్టిస్తున్నారు. కొన్ని రోజుల నుంచి జెమినీ ఏఐ ఫోటో ఎడిట్ యాప్ ద్వారా ఫొటోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసుకుని సంబరపడిపోతున్నారు. 3డీ ప్రింట్, నానో బనాన ఇలా రకరకాలుగా ఫోటోలను ఎడిట్ చేస్తుంది జెమినీ ఏఐ. అయితే జెమినీ ఏఐ ట్రెండింగ్ ఫోటో ఎడిట్ యాప్‌తో యువకుడికి రూ.70 వేల నష్టం వాటిల్లింది. ట్రెండింగ్‌లో ఉన్న ఏఐ ఫోటో ఎడిట్ యాప్‌తో ఓ యువకుడు కష్టార్జిత డబ్బును కోల్పోయిన సంఘటన సంచలనం రేపింది.

Also Read: Minor R*ape Case: వీడు మనిషికాదు.. 75 ఏళ్ల వ్యక్తి తన స్నేహితుడి కూతురిపై అత్యాచారం.. గర్భవతి కావడంతో..

ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన ఓ యువకుడు ఇటీవల “జెమినీ” అనే ఫోటో ఎడిట్ యాప్‌లో తన ఫోటోను అప్లోడ్ చేశాడు. కొద్దిసేపటికే అకౌంట్‌ నుంచి రూ.70 వేల రూపాయలు మాయం కావడంతో షాక్‌కు గురయ్యాడు. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, సైబర్ నేరగాళ్లు ఈ మోసానికి పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Exit mobile version