Lady Harrasment : కుర్రాళ్లు జాగ్రత్త.. ఎంజాయ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఆంటీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lady Harrasment : సాధారణంగా కుర్రాళ్లు అమ్మాయిలను వేధిస్తుంటారు. వారి వేధింపులు భరించలేక చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్న వార్తలు విన్నాం. కానీ ఓ వివాహిత కారణంగా ఓ యువకుడు చనిపోయిన ఘటన అనంతపురం జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాయదుర్గం పట్టణానికి చెందిన కుత్తీష్ అలియాస్ పృథ్వీ (30) ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే పట్టణానికి చెందిన ఓ వివాహితతో తనకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త సన్నిహిత సంబంధానికి దారి తీసింది. దానిని ఆసరాగా తీసుకుని వివాహిత బ్లాక్ మెయిల్ కు పాల్పడింది.
Read Also:Ram Charan: బాబాయ్ సినిమా గ్లిమ్ప్స్ అబ్బాయికి బాగా నచ్చేసిందట…
Also Read
- Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
- TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
- INDW Vs PAKW: రీచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్.. పాకిస్థాన్ ముందు భారత్ టార్గెట్ ఎంతంటే..
- Harmanpreet Kaur: రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన హర్మన్ప్రీత్ కౌర్.. దేశ చరిత్రలోనే తొలి ప్లేయర్గా..

వారు చనువుగా ఉన్నప్పుడు జరిపిన ఫోన్ సంభాషణలు, ఇద్దరు కలిసి తీసుకున్న ఫోటోలను చూపించి గత కొద్ది కాలంగా తనను వేధిస్తోందని గతంలో కుత్తీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను ఇబ్బంది పెడుతున్నాడని ఆ మహిళ కూడా యువకుడిపై ఫిర్యాదు చేసింది. పరస్పర ఫిర్యాదులపై పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. వారం కిందట సదరు వివాహిత ఎస్పీని కలిసి స్పందనలో ఫిర్యాదు కూడా చేసింది. దీంతో పోలీసులు ఇద్దరినీ పిలిపించి విచారణ చేశారు. శనివారం తిరిగి విచారణకు రావాలని ఇద్దరికీ సమాచారం అందించారు. గురువారం రాత్రి వివాహిత కుత్తీష్కు తన ఇంటికి రమ్మని ఫోన్ చేసింది. అతను వెళ్లకపోవడంతో మరొక వ్యక్తిని తీసుకురమ్మని పంపింది. దీంతో తప్పని పరిస్థితిలో కుత్తీష్ ఆమె ఇంటికి వెళ్లాడు.
Read Also:How To Become Rich: ధనవంతులు కావాలనుకుంటున్నారా.. అయితే ఈ 10చిట్కాలు పాటించండి
ఇంటికొచ్చాక అక్కడ జరిగిన విషయాన్ని తన భార్య లలితకు చెప్పాడు. శనివారం పోలీసు స్టేషన్కు వెళ్లాల్సి ఉందని, ఎవరినీ పంపినా ఆమె వద్దకు ఇంకోసారి వెళ్లొద్దని భార్య చెప్పింది. ఇంతలో బంధువుల పెళ్లికి ఉండడంతో అక్కడికి వెళ్లి వచ్చాక పోలీసులకు ఫిర్యాదు చేద్దామని భార్య కుత్తీష్కు నచ్చచెప్పింది. ఉదయాన్నే ఆమె ఉరవకొండకు బయలుదేరింది. కానీ.. మార్గమధ్యలో వెళ్లగానే తన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందింది. భర్త మరణ వార్త విని భార్య లలిత బోరున విలపించింది. తన భర్త ఆత్మహత్య చేసుకునేందుకు వివాహిత వేధింపులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేయకపోవడంతో ఆమె స్టేషన్ ముందు కూర్చొని నిరసన తెలిపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుత్తీష్ స్నేహితులు భారీ సంఖ్యలో ఆస్పత్రికి చేరుకోవడంతో రద్దీ నెలకొంది. సదరు వివాహిత బాధితులు పట్టణంలో చాలా మంది ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
-
Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
-
CM Chandrababu : కృష్ణానది పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం.. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన
-
Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
-
TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!