AP Crime: నూజివీడులో యువకుడి దారుణ హత్య.. రోలుతో కొట్టి.. బిల్డింగ్ పై నుంచి తోసివేసి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: ఏలూరు జిల్లా నూజివీడు పట్టణం శాంతినగర్ కు చెందిన యశ్వంత్ రెడ్డి (16) సంవత్సరాల యువకుడిని దారుణంగా హత్య చేశారు.. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన కొవ్వూరి రామిరెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు కొవ్వూరి సందీప్ కాగా చిన్న కుమారుడు యశ్వంత్ రెడ్డి. 25 సంవత్సరాల క్రితం వారి వ్యాపారాల నిమిత్తం నూజివీడుకి వచ్చారు. అమరావతి ఫర్నిచర్స్ హోమ్ నీడ్స్ షాప్ పెట్టుకుని వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఏం జరిగిందో తెలియదు.. కానీ, ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో యశ్వంత్ రెడ్డి రూమ్లో లేకపోవడంతో ఇంటి చుట్టూ వెతికి చూడగా బిల్డింగ్ పైనుంచి కిందికి పడి ఉండటం గమనించారు .
Read Also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఇక, యశ్వంత్ రెడ్డి రూమ్ అంతా రక్తపు మరకలతో నిండిపోయి ఉంది. పచ్చడి నూరే రోలుతో తలపై మోది చంపినట్లు తెలుస్తుంది. ఇక, యశ్వంత్ రెడ్డిని కొట్టిన తర్వాత రూమ్ లో నుంచి బయటకు తీసుకువచ్చి మూడవ ఫ్లోర్ నుంచి కింద పడేసినట్టు రక్తపు మరకలు చూస్తే అర్థం అవుతుందంటున్నారు పోలీసులు.. ఉదయం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ మూర్తి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యశ్వంత్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ వేగవంతం చేశారు. అయితే, యశ్వంత్ రెడ్డిని కొట్టి చంపేసింది ఎవరు? అనేది తేల్చే పనిలో పడిపోయారు పోలీసులు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!