Tamilnadu : కాలేజీ ఫీజు కడతామన్నారు.. గదిలో బంధించి అత్యాచారం చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu : తమిళనాడులో దారుణం జరిగింది. కాలేజీ ఫీజు కట్టి ఆదుకుంటామని నమ్మించి ఓ యువతిపై ఇద్దరు యువకులు దారుణంగా అత్యాచారం చేశారు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థినిపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమెను మూడు రోజుల పాటు హోటల్ గదిలో బంధించి దారుణంగా రేప్ చేశారు. వారి నుంచి అతికష్టం మీద తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వారిద్దరిపై ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. నీలగిరి జిల్లాకు చెందిన 20 ఏళ్ల స్టూడెంట్ కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకెండియర్ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు కొంత కాలం కిందట విడిపోయారు. అయితే కాలేజీలో ఫీజు కట్టాల్సి రావడంతో యువతి తన తల్లిని అడిగింది. తాను ఫీజు కట్టబోనని, తండ్రిని అడగాలని ఆమె సూచించింది. దీంతో ఆ యువతి తన తండ్రిని అడిగింది. అతడు కూడా ఫీజు కట్టేందుకు నిరాకరించాడు.
Also Read
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
Read Also: AdiReddy Apparao: ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్ లకు మే 12 వరకు రిమాండ్
బాధతో తన పరిస్థితి గురించి తన కాలేజీ స్నేహితుడికి విషయం చెప్పింది. సాయం చేయాలని కోరింది. అతడి ద్వారా ఆమెకు కోయంబత్తూరు జిల్లా కొండయంపాళయంకు చెందిన జర్మన్ రాజేష్, పి రవీంద్రన్ పరిచయం అయ్యారు. వాళ్లు తనకు కాలేజీ ఫీజు కడతామని హామీ ఇచ్చారు. దీంతో ఆ యువతి వారిని నమ్మింది. ఆమెను ఏప్రిల్ 23న ఇద్దరు నిందితులు ఓ హోటల్ కు తీసుకెళ్లి బంధించారు. మూడు రోజులు పాటు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదని ఆమెను బెదిరించారు. అయితే వారి బారి నుంచి యువతి తప్పించుకుంది.
ఏప్రిల్ 26న మహిళా పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన అఘాయిత్యాన్ని వారికి వివరించింది. నిందితులపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులిద్దరిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన అధికారులు హోటల్ కు వెళ్లి చూడగా..వారు అప్పటికే అక్కడి నుంచి పరారయ్యారు. తరువాత వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం ఓ ప్రదేశంలో పోలీసులు వారిని కనిపెట్టారు. దీంతో నిందితులు భయపడిపోయి, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఓ భవనంపై నుంచి దూకడంతో వారి కాళ్లకు గాయాలు అయ్యాయి. నిందితులిద్దరినీ కోయంబత్తూర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ (సీఎంసీహెచ్)లో చేర్చారు. శుక్రవారం వీరిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేయడంతో.. పోలీసులు వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
Read Also:ROHIT SHARMA : రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్.. తొండాట ఆడిన సంజూ శాంసన్
తాజావార్తలు
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
-
PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
-
Shani Parivartan 2026: మే 17న శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం
-
Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
-
Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..