Telangana Election Results: తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన పిన్న వయస్కులు వీరే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Young Candidates Won in Telangana Elections 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తయ్యాయి. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. తొలి రౌండ్ నుంచే కాంగ్రెస్ తన హవా కొనసాగించింది. అధికార బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తూ.. ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 64 సీట్లు (మ్యాజిక్ ఫిగర్ 60) కైవసం చేసుకోగా.. బీఆర్ఎస్ 39 సీట్లు గెలిచింది. బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందగా.. ఎంఐఎం 7 సీట్లలో సత్తాచాటింది. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పిన్న వయస్కు వారు గెలిచారు. 30 ఏళ్లకు తక్కువగా ఉన్న ముగ్గురు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
యశస్విని రెడ్డి:
అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజక వర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్విని రెడ్డి గెలిచారు. ఆమె వయసు 26. 30 ఏళ్ల రాజకీయ సుధీర్ఘ అనుభవం ఉన్న నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై సుమారు 14వేల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. దాంతో తెలంగాణ రాజకీయాల్లో ఇదో సంచలనంగా మారింది. యశస్వినికి ఐటీ శాఖ అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. 2018లో బీటెక్ పూర్తి చేసిన యశస్విని.. వివాహం అనంతరం అమెరికాకు వెళ్లిపోయారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
మైనంపల్లి రోహిత్:
మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు భారి మెజారిటీతో గెలిచారు. తన సమీప బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పద్మా దేవేందర్ రెడ్డిపై సుమారు 9 వేల ఓట్లతో జయకేతనం ఎగురవేశారు. రోహిత్ వయసు 26. మైనంపల్లి హన్మంతరావు కుమారుడే ఈయన. మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మైనంపల్లి హన్మంతరావు.. బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి సుమారు 25వేల ఓట్లతో గెలిచారు. రోహిత్ రావు మేడ్చల్లోని మెడిసిటీ వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు.
పర్ణికా రెడ్డి:
నారాయణపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన చిట్టెం పర్ణికా రెడ్డి గెలుపొందారు. ఆమె వయసు 30. బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్ రెడ్డిపై దాదాపు 8 వేల ఓట్ల ఆధిక్యతో విజయం సాధించారు. పర్ణిక ప్రస్తుతం భాస్కర వైద్య కళాశాలలో పీజీ చేస్తున్నారు. పర్ణిక తాత చిట్టెం నర్సిరెడ్డి మక్తల్ ఎమ్మెల్యేగా.. తండ్రి చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి పీసీసీ సభ్యుడిగా పని చేశారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!