Modi In USA: “మీరే భారత బ్రాండ్ అంబాసిడర్లు”.. ప్రవాసులపై మోడీ ప్రశంసలు..
- మీరే భారత బ్రాండ్ అంబాసిడర్లు..
- ఎన్ఆర్ఐలు భారత్-అమెరికా మధ్య అనుసంధానకర్తలు..
- ఏఐ అంటే అమెరికా-భారత్..
- ఈ రోజు 5జీ మార్కెట్ అమెరికా కన్నా పెద్దది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi In USA: భారతదేశానికి మీరే బ్రాండ్ అంబాసిడర్లు అంటూ అమెరికాలోని ప్రవాస భారతీయులపై ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలు కురిపించారు. అమెరికాలో పర్యటిస్తున్న మోడీ ఈ రోజు న్యూయార్క్లోని నసావు కొలీజియంలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడారు. లాంగ్ ఐలాండ్లోని కొలీజయం వద్దకు ప్రధాని రాగానే ప్రవాసులు ఘనంగా స్వాగతం పలికారు. ‘‘మోడీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్’’ ఈవెంట్కి 14 వేల మంది ఎన్ఆర్ఐలు, సెలబ్రిటీలు, ఇండో అమెరికన్ కమ్యూనిటీ తరలించి వచ్చింది. ‘‘భారత్ మాతాకీ జై’’ అంటూ మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నమస్తే యూఎస్ అంటూ విష్ చేశారు.
తాను ఇక్కడికి సుదూర తీరాల నుంచి వచ్చానని, గతంలో నేను ఓ పార్టీ కార్యకర్తగా ఇక్కడికి వచ్చానని, ఏ పదవి లేనప్పుడు అమెరికాలోని 29 రాష్ట్రాలు తిరిగానని చెప్పారు. ఎన్ఆర్ఐలు భారత్ అమెరికా మధ్య అనుసంధానకర్తలుగా ఉన్నారని అన్నారు. మీరంతా మన దేశానికి ప్రతినిధులు, దూతలుగా ఉన్నారని అన్నారు. భిన్నత్వాన్ని అర్థం చేసుకుని జీవించడం మన మూలాల్లోనే ఉందని, భాషలు అనేకం భావం ఒక్కటే అని, మనం ఎక్కడికెళ్లిన ఒక కుటుంబంలా వ్యవహరిస్తామని అన్నారు.
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
Read Also: Iran: ఇరాన్లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకై పేలుడు.. 51 మంది మృతి
భారత్, అమెరికా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని, భారత్లో ఎన్నికలు ముగిశాయి, ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పారు. అమెరికా మొత్తం జనాభా కంటే భారత్లో రెట్టింపు ఓటర్లు ఉన్నారని, భారత ప్రజాస్వామ్యం యొక్క ఈ స్థాయిన చూసినప్పుడు మేము మరింతగా గర్వపడుతున్నామని చెప్పారు. ప్రపంచానికి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, నాకు మాత్రం ఏఐ అంటే అమెరికా-ఇండియా అని అన్నారు.
ప్రపంచంలో తాను ఎక్కడి వెళ్లినా, ప్రతీ నాయకుడు ప్రవాస భారతీయులను కొనియాడుతారని, నిన్న ప్రెసిడెంట్ బైడెన్ తనను డెలావర్లోని అతని ఇంటికి తీసుకెళ్లారని, అతడి ఆప్యాయత నాకు హృదయానికి హత్తుకునే క్షణమని, ఆ గౌరవం 140 కోట్ల మంది భారతీయులకు దక్కతుందని అన్నారు. ఈ రోజు భారతదేశం 5జీ మార్కెట్ అమెరికా కన్నా పెద్దదని, కేవలం రెండేళ్లలోనే ఇది సాధ్యమైందని,ప్రస్తుతం మేడ్ ఇన్ ఇండియా 6జీ కోసం పనిచేస్తున్నామని అన్నారు. మహిళా సాధికారత కోసం పనిచేస్తున్నామని, ప్రస్తుతం ఇండియా అవకాశాలకు నిలయమని చెప్పారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!