Amaravathi: అమరావతిలో భాగస్వామ్యానికి యోకోహామా సిద్ధం.. ముగ్గురు సభ్యుల అధికార ప్రతినిధి బృందం పర్యటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravathi: అమరావతిని గ్రీన్ అండ్ రెసిలియంట్ సిటీగా మలచడం కోసం యోకోహామాతో సిటీ-టు-సిటీ భాగస్వామ్యాన్ని కుదుర్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ బృందం యోకోహామా నగరంలో “క్లైమేట్ యాక్షన్, స్మార్ట్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిటీ మేనేజ్మెంట్లో టెక్నాలజీ వినియోగం, ఆర్థిక అభివృద్ధి” నమూనాలను కూడా అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా హోకుబు స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ బృందం యోకోహామా సిటీలో ఐదు రోజుల అధ్యయన పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో వర్షపు నీరు, మలిన జలాలు, డ్రైనేజ్ మేనేజ్మెంట్ కోసం యోకోహామా కంట్రోల్ సెంటర్ను కూడా పరిశీలన చేశారు.
Drunk Driving: మద్యం మత్తులో లవర్తో బెట్టింగ్.. సముద్రంలోకి కారు.. చివరకు?
Also Read
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
యకోహోమాను జపాన్లో ప్రధాన వృద్ధి కేంద్రంగా ఎలా మలిచారో దాని విజన్ను ఆరు ప్రధాన ప్రాజెక్టుల మాస్టర్ప్లాన్గా అమలుచేసిన విధానాన్ని జపాన్ ప్రతినిధులు వివరించారు. విభాగాల మధ్య సమన్వయం, ముఖ్యంగా రవాణా మరియు నగరాభివృద్ధి సమన్వయం, అర్బన్ డిజైన్ అంశాలపై దృష్టి, ప్రైవేట్ రంగం సహకారాన్ని అర్బన్ డెవలప్మెంట్లోకి తీసుకురావడం వంటి అంశాలే యోకోహామా ఏర్పాటుకు కీలకం అనే దిశగా చర్చ జరిగింది.
Vijayawada Diarrhea: విజయవాడలో డయేరియా విజృంభణ.. 100 దాటిన కేసులు!
1,800 గ్లోబల్ కంపెనీల కార్యాలయాలు ఉన్న యోకోహామా, పరిశోధకులకు, ఇంజినీర్లకు ఉత్తమమైన వ్యాపార వాతావరణ కేంద్రంగా ఉండడం పై ఏపీ అధికారుల దృష్టి సారించనున్నారు. యోకోహామా తమ సొంత అర్బన్ డెవలప్మెంట్ మోడల్పై ఆధారపడి, నగర ప్రణాళిక నుంచి ఆపరేషన్ వరకు విస్తృత సేవలను అందించడానికి ఆసక్తి చూపుతోంది. సిటీ-టు-సిటీ భాగస్వామ్యానికి యోకోహామా సమగ్ర అర్బన్ డెవలప్మెంట్ ప్లాన్ మరియు అర్బన్ డిజైన్ అమలుపై దృష్టి పెట్టింది. ప్రైవేట్ రంగ పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి “సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, మలిన జలాలు, స్లడ్జ్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, పవర్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్, పునరుత్పాదక ఇంధనం కోసం స్మార్ట్ టెక్నాలజీ అందించడానికి చర్చలు జరపనున్నారు.
తాజావార్తలు
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?