ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్పై టీడీపీ సీనియర్ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం యనమల రామకృష్ణుడు, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు అసెంబ్లీ లాబీలో విడివిడిగా మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. ఇండియా కూటమికి జగన్ దగ్గరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. జగన్కు ఢిల్లీ స్థాయిలో షెల్టర్ కావాలని, ఇండియా కూటమికి కూడా పార్టీలు కావాలన్నారు. జగన్ ధర్నాకు ఇండియా కూటమి పార్టీలు రావడమే దీనికి సంకేతమని ఆయన వ్యాఖ్యానించారు. అంఏతకాకుండా.. ఇండియా కూటమిలో చేరడం జగనుకు అనివార్యమని ఆయన పేర్కొన్నారు.
Katrina Kaif: వాట్ ఏ ఫిల్మ్.. విజయ్ సినిమాపై కత్రినా కైఫ్ పొగడ్తలు!
ఇన్నాళ్లూ బీజేపీని అడ్డం పెట్టుకుని జగన్ పబ్బం గడుపుకున్నారని, ఇప్పుడు ఎన్డీఏలో మేము. జనసేన ఉన్నామన్నారు యనమల రామకృష్ణుడు. ఎన్డీఏ కూటమిలోకి జగన్ రాలేని పరిస్థితి అని, షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. కూటమి పార్టీగా జగన్ ఇండియాలో భాగస్వామిగా ఉండబోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. ఇండియా కూటమిలో చేరేంత ధైర్యం జగన్ కు ఉందా..? అని ఆయన ప్రశ్నించారు. అంత సాహసం చేస్తాడని అనుకోవడం లేదన్నారు.
Kamala Harris vs Donald Trump: చర్చకు రెడీ అంటునన్న కమలాహారిస్.. ఇప్పుడే వద్దన్న ట్రంప్