Xiaomi Redmi K70 Ultra: షియోమీ తన నూతన స్మార్ట్ఫోన్ రెడ్మీ కె70 అల్ట్రాను విడుదల చేసింది. కంపెనీ చైనాలో లాంచ్ చేసిన బ్రాండ్ K70 సిరీస్లో ఈ ఫోన్ అత్యంత శక్తివంతమైన ఫోన్. వేరే దేశాలలో కంపెనీ ఈ ఫోన్ ను Xiaomi 14T ప్రో పేరుతో విడుదల చేయవచ్చు. ఈ స్మార్ట్ఫోన్ MediaTek Dimensity 9300+ ప్రాసెసర్తో వస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్తో OLED స్క్రీన్ను కలిగి ఉంది. ఇంకా 5500mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్తో వస్తుంది. ఈ ఫోన్ ధర, ఇతర వివరాలను తెలుసుకుందాం.
London: ఎయిర్పోర్టులో అమానుషం.. ప్రయాణికులపై పోలీసుల దౌర్జన్యకాండ
కంపెనీ ఈ స్మార్ట్ఫోన్ ను 5 వేరియంట్ లలో విడుదల చేసింది. ఇందులో 24GB RAM + 1TB స్టోరేజ్తో సుప్రీం ఛాంపియన్ ఎడిషన్ కూడా ఉంది. దీని ధర 46 వేల రూపాయలు. Redmi K70 Ultra యొక్క బేస్ వేరియంట్ 12GB RAM + 256GB స్టోరేజ్తో వస్తుంది. దీని ధర సుమారు రూ. 29,900. ఈ ఫోన్ బ్లాక్, స్నో వైట్, ఐస్ బ్లూ మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది. అయితే సుప్రీం ఛాంపియన్ ఎడిషన్ నారింజ, ఆకుపచ్చ రంగులలో వస్తుంది. కంపెనీ ఈ ఫోన్ ను చైనాలో విడుదల చేసింది. Redmi K70 Ultra 1.5K రిజల్యూషన్తో 6.67-అంగుళాల OLED డిస్ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్ మద్దతుతో వస్తుంది. స్క్రీన్ను రక్షించడానికి షియోమీ షీల్డ్ గ్లాస్ ను వాడింది.
Erra Matti Dibbalu: భీమిలి ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించిన వాటర్మ్యాన్ ఆఫ్ ఇండియా..
ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. దీని ప్రైమరీ లెన్స్ 50MP. ఇది కాకుండా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2MP మాక్రో లెన్స్ అందుబాటులో ఉన్నాయి. ముందు భాగంలో కంపెనీ 20MP సెల్ఫీ కెమెరాను అందించింది. ఇక ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే.. 5500mAh బ్యాటరీ అందించబడింది. ఇది 120W ఛార్జింగ్కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ ఓఎస్ తో వస్తుంది. భద్రత కోసం ఈ ఫోన్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించబడింది. ఈ పరికరం డ్యూయల్ స్పీకర్లు, IP68 రేటింగ్, Wi-Fi 7తో వస్తుంది.