Xiaomi Redmi K70 Ultra: అదిరిపోయే ఫీచర్లతో కొత్త మొబైల్ను తీసుకొచ్చిన షియోమీ..
- షియోమీ తన నూతన స్మార్ట్ఫోన్ రెడ్మీ కె70 అల్ట్రాను విడుదల చేసింది.
- ఈ స్మార్ట్ఫోన్ MediaTek Dimensity 9300+ ప్రాసెసర్తో వస్తుంది.
- 5500mAh బ్యాటరీ 120W ఛార్జింగ్తో.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi Redmi K70 Ultra: షియోమీ తన నూతన స్మార్ట్ఫోన్ రెడ్మీ కె70 అల్ట్రాను విడుదల చేసింది. కంపెనీ చైనాలో లాంచ్ చేసిన బ్రాండ్ K70 సిరీస్లో ఈ ఫోన్ అత్యంత శక్తివంతమైన ఫోన్. వేరే దేశాలలో కంపెనీ ఈ ఫోన్ ను Xiaomi 14T ప్రో పేరుతో విడుదల చేయవచ్చు. ఈ స్మార్ట్ఫోన్ MediaTek Dimensity 9300+ ప్రాసెసర్తో వస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్తో OLED స్క్రీన్ను కలిగి ఉంది. ఇంకా 5500mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్తో వస్తుంది. ఈ ఫోన్ ధర, ఇతర వివరాలను తెలుసుకుందాం.
London: ఎయిర్పోర్టులో అమానుషం.. ప్రయాణికులపై పోలీసుల దౌర్జన్యకాండ
Also Read
- Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
- Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
- Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
కంపెనీ ఈ స్మార్ట్ఫోన్ ను 5 వేరియంట్ లలో విడుదల చేసింది. ఇందులో 24GB RAM + 1TB స్టోరేజ్తో సుప్రీం ఛాంపియన్ ఎడిషన్ కూడా ఉంది. దీని ధర 46 వేల రూపాయలు. Redmi K70 Ultra యొక్క బేస్ వేరియంట్ 12GB RAM + 256GB స్టోరేజ్తో వస్తుంది. దీని ధర సుమారు రూ. 29,900. ఈ ఫోన్ బ్లాక్, స్నో వైట్, ఐస్ బ్లూ మూడు కలర్ ఆప్షన్లలో వస్తుంది. అయితే సుప్రీం ఛాంపియన్ ఎడిషన్ నారింజ, ఆకుపచ్చ రంగులలో వస్తుంది. కంపెనీ ఈ ఫోన్ ను చైనాలో విడుదల చేసింది. Redmi K70 Ultra 1.5K రిజల్యూషన్తో 6.67-అంగుళాల OLED డిస్ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్ మద్దతుతో వస్తుంది. స్క్రీన్ను రక్షించడానికి షియోమీ షీల్డ్ గ్లాస్ ను వాడింది.
Erra Matti Dibbalu: భీమిలి ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించిన వాటర్మ్యాన్ ఆఫ్ ఇండియా..
ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. దీని ప్రైమరీ లెన్స్ 50MP. ఇది కాకుండా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2MP మాక్రో లెన్స్ అందుబాటులో ఉన్నాయి. ముందు భాగంలో కంపెనీ 20MP సెల్ఫీ కెమెరాను అందించింది. ఇక ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే.. 5500mAh బ్యాటరీ అందించబడింది. ఇది 120W ఛార్జింగ్కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ ఓఎస్ తో వస్తుంది. భద్రత కోసం ఈ ఫోన్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించబడింది. ఈ పరికరం డ్యూయల్ స్పీకర్లు, IP68 రేటింగ్, Wi-Fi 7తో వస్తుంది.
తాజావార్తలు
-
Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
-
Trump: ‘కమ్యూనిస్టులకు దేవుడిపై నమ్మకం ఉండదు’.. డెమోక్రటిక్పై ట్రంప్ ఆగ్రహం
-
Dil Raju: ‘సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..’: ప్రొడ్యూసర్ దిల్ రాజు
-
Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..