Xi Jinping: ‘పంచశీల’, ‘అలీన విధానం’పై చైనా అధినేత ప్రశంసలు..
- పంచశీలపై జిన్పింగ్ ప్రశంసలు..
- చైనా అధినేత నుంచి భారత్ అనుకూల వ్యాఖ్యలు..
- గ్లోబల్ సౌత్పై పట్టుపెంచుకునే ప్రయత్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xi Jinping: చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్, భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అలీన విధానం, పంచశీలను పొగిడారు. ప్రస్తుత వివాదాలను అంతం చేయడానికి, గ్లోబల్ సౌత్ లో పట్టు పెంచుకోవాలని చూస్తున్న చైనా నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. 71 ఏళ్ల జిన్పింగ్ చైనా 70వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో భారతదేశ ‘పంచశీల’ ఒప్పందం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది చైనా-భారత్ రెండు దేశాలు శాంతియుత సహజీవనంతో ఉండేందుకు నెహ్రూ, అప్పటి చైనా నేత చౌఎన్ లై మధ్య కుదిరిన ఒప్పందం. 1954 ఏప్రిల్ 29న ఇరు దేశాలు దీనిపై సంతకం చేశాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు, సరిహద్దు సమస్యలను పరిష్కరించేందుకు పంచశీల రూపుదిద్దుకుంది. అయితే, ఇది అనుకున్న లక్ష్యాలను సాధించలేదు. 1962 చైనా-భారత్ యుద్ధంతో దీనిని చైనా ఉల్లంఘించింది.
Read Also: JDU Meeting : నేడు ఢిల్లీలో జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకోనున్న నితీశ్ కుమార్
Also Read
- CJI Surya Kant: లండన్లో సీజేఐ సూర్యకాంత్కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
- SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
‘‘శాంతియుత సహజీవనం యొక్క ఐదు సూత్రాలు కాలానికి సమాధానమిచ్చాయి. దీని ప్రారంభం అనివార్యమైన చారిత్రక పరిణామం. గతంలో చైనా నాయకత్వం పూర్తిగా 5 సూత్రాలను మొదటగా పేర్కొంది. అవి సార్వభౌమాధికారం మరియు ప్రాదేశికత పట్ల పరస్పర గౌరవం సమగ్రత’, ‘పరస్పర దురాక్రమణ’, ‘ఒకరి అంతర్గత వ్యవహారాల్లో పరస్పరం జోక్యం చేసుకోకపోవడం’, ‘సమానత్వం మరియు పరస్పర ప్రయోజనం’ మరియు ‘శాంతియుత సహజీవనం’’’ అని జిన్ పింగ్ అన్నారు. ‘‘చైనా-ఇండియా, చైనా-మయన్మార్ సంయుక్త ప్రకటనలో వారు ఐదు సూత్రాలను చేర్చారు. ఇది దేశాల మధ్య సంబంధాల కోసం ప్రాథమిక నిబంధనలను రూపొందించాలని సంయుక్తంగా పిలుపునిచ్చింది’’ అని జిన్పింగ్ అన్నారు. ‘పంచశీల’, శాంతియుత సహజీవనానికి సంబంధించిన ఐదు సూత్రాలు ఆసియా (భారతదేశం)లో పుట్టాయి, త్వరగా ప్రపంచ స్థాయికి ఎదిగాయని 1955లో 20కి పైగా ఆసియా మరియు ఆఫ్రికా దేశాలు బాండుంగ్ సమావేశానికి హాజరయ్యాయని జిన్ పింగ్ తన ప్రసంగంలో గుర్తు చేశారు.
ప్రస్తుతం చైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. జిన్ పింగ్ కలల ప్రాజెక్ట్ ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ)’ ద్వారా అనేక దేశాలను కలిపి ఆయా దేశాల మార్కెట్ క్యాప్చర్ చేయాలని భావించిన చైనా యూఎస్, ఈయూ నుంచి వ్యూహాత్మక పోటీ ఎదుర్కొంటోంది. చైనా ఇటీవల సంవత్సరాల్లో గ్లోబల్ సౌత్గా పిలుస్తున్న భారత్, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో తన ప్రభావాన్ని పటిష్టం చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా నుంచి ఇలాంటి భారత అనుకూల మాటలు వస్తున్నాయనే అభిప్రాయం ఉంది.
తాజావార్తలు
-
The Earth: భూగర్భ జలాల దోపిడి.. 31.5 అంగుళాలు వంగిన భూమి!
-
CJI Surya Kant: లండన్లో సీజేఐ సూర్యకాంత్కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
-
IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Stree Ride : మహిళల కోసం ‘స్త్రీ రైడ్’.. ఇక డ్రైవర్ కూడా మహిళే..!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!