Xi Jinping: ‘పంచశీల’, ‘అలీన విధానం’పై చైనా అధినేత ప్రశంసలు..
- పంచశీలపై జిన్పింగ్ ప్రశంసలు..
- చైనా అధినేత నుంచి భారత్ అనుకూల వ్యాఖ్యలు..
- గ్లోబల్ సౌత్పై పట్టుపెంచుకునే ప్రయత్నం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xi Jinping: చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్, భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అలీన విధానం, పంచశీలను పొగిడారు. ప్రస్తుత వివాదాలను అంతం చేయడానికి, గ్లోబల్ సౌత్ లో పట్టు పెంచుకోవాలని చూస్తున్న చైనా నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. 71 ఏళ్ల జిన్పింగ్ చైనా 70వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో భారతదేశ ‘పంచశీల’ ఒప్పందం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది చైనా-భారత్ రెండు దేశాలు శాంతియుత సహజీవనంతో ఉండేందుకు నెహ్రూ, అప్పటి చైనా నేత చౌఎన్ లై మధ్య కుదిరిన ఒప్పందం. 1954 ఏప్రిల్ 29న ఇరు దేశాలు దీనిపై సంతకం చేశాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు, సరిహద్దు సమస్యలను పరిష్కరించేందుకు పంచశీల రూపుదిద్దుకుంది. అయితే, ఇది అనుకున్న లక్ష్యాలను సాధించలేదు. 1962 చైనా-భారత్ యుద్ధంతో దీనిని చైనా ఉల్లంఘించింది.
Read Also: JDU Meeting : నేడు ఢిల్లీలో జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకోనున్న నితీశ్ కుమార్
Also Read
- Ragi Jaggery Cookies Recipe: మైదాకు గుడ్బై.. ఇంట్లోనే హెల్తీ రాగి-బెల్లం కుకీస్ తయారు చేయండిలా..
- Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ 'జీరా రైస్' ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
‘‘శాంతియుత సహజీవనం యొక్క ఐదు సూత్రాలు కాలానికి సమాధానమిచ్చాయి. దీని ప్రారంభం అనివార్యమైన చారిత్రక పరిణామం. గతంలో చైనా నాయకత్వం పూర్తిగా 5 సూత్రాలను మొదటగా పేర్కొంది. అవి సార్వభౌమాధికారం మరియు ప్రాదేశికత పట్ల పరస్పర గౌరవం సమగ్రత’, ‘పరస్పర దురాక్రమణ’, ‘ఒకరి అంతర్గత వ్యవహారాల్లో పరస్పరం జోక్యం చేసుకోకపోవడం’, ‘సమానత్వం మరియు పరస్పర ప్రయోజనం’ మరియు ‘శాంతియుత సహజీవనం’’’ అని జిన్ పింగ్ అన్నారు. ‘‘చైనా-ఇండియా, చైనా-మయన్మార్ సంయుక్త ప్రకటనలో వారు ఐదు సూత్రాలను చేర్చారు. ఇది దేశాల మధ్య సంబంధాల కోసం ప్రాథమిక నిబంధనలను రూపొందించాలని సంయుక్తంగా పిలుపునిచ్చింది’’ అని జిన్పింగ్ అన్నారు. ‘పంచశీల’, శాంతియుత సహజీవనానికి సంబంధించిన ఐదు సూత్రాలు ఆసియా (భారతదేశం)లో పుట్టాయి, త్వరగా ప్రపంచ స్థాయికి ఎదిగాయని 1955లో 20కి పైగా ఆసియా మరియు ఆఫ్రికా దేశాలు బాండుంగ్ సమావేశానికి హాజరయ్యాయని జిన్ పింగ్ తన ప్రసంగంలో గుర్తు చేశారు.
ప్రస్తుతం చైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. జిన్ పింగ్ కలల ప్రాజెక్ట్ ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ)’ ద్వారా అనేక దేశాలను కలిపి ఆయా దేశాల మార్కెట్ క్యాప్చర్ చేయాలని భావించిన చైనా యూఎస్, ఈయూ నుంచి వ్యూహాత్మక పోటీ ఎదుర్కొంటోంది. చైనా ఇటీవల సంవత్సరాల్లో గ్లోబల్ సౌత్గా పిలుస్తున్న భారత్, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో తన ప్రభావాన్ని పటిష్టం చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా నుంచి ఇలాంటి భారత అనుకూల మాటలు వస్తున్నాయనే అభిప్రాయం ఉంది.
తాజావార్తలు
-
Ragi Jaggery Cookies Recipe: మైదాకు గుడ్బై.. ఇంట్లోనే హెల్తీ రాగి-బెల్లం కుకీస్ తయారు చేయండిలా..
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ సెలబ్రేషన్స్.. రెండో ఈవెంట్కు ముఖ్య అతిథిగా నాగ చైతన్య ?
-
Infinix Hot 70 Pro: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో రిలీజ్.. డ్యూయల్ డిస్ప్లే, 144Hz స్క్రీన్, 6000mAh బ్యాటరీ
-
RAW NTR: ‘ఊరు–వాడ’ కార్యక్రమంపై ‘రా ఎన్టీఆర్’ కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
ట్రెండింగ్
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!