WFI: భారత రెజ్లింగ్ సమాఖ్యను రద్దు చేసిన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వేదికపై భారత్కు పెద్ద అవమానం జరిగింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య.. భారత రెజ్లింగ్ సమాఖ్య సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్ఐ విఫలమైనందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు యూఎమ్డబ్ల్యూ వెల్లడించింది. దీంతో సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో భారత రెజ్లర్లు ‘తటస్థ అథ్లెట్స్ ‘గా పోటీ పడాల్సి ఉంటుంది.
Read Also: NTR 100 Rupees Coin: ఎన్టీఆర్ పేరుతో రూ.100 నాణెం.. విడుదల కార్యక్రమంలో కొత్త ట్విస్ట్
Also Read
- Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
- 16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
- YS Jagan: వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
- SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
అయితే, గత కొంత కాలం నుంచి డబ్ల్యూఎఫ్ఐ వరుస వివాదాల్లో చిక్కుకుంది. దీంతో ఆ సంస్థకు జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. వాస్తవానికి భారత రెజ్లింగ్ గవర్నింగ్ బాడీ అయిన డబ్ల్యూఎఫ్ఐకు 2023 జూన్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, భారత రెజ్లర్ల వరుస నిరసనలు, వివిధ రాష్ట్ర యూనిట్ల లీగల్ పిటిషన్ల కారణంగా ఎన్నికలు పదే పదే వాయిదా పడ్డాయి. రెజ్లింగ్ కు ప్రపంచ పాలక సంస్థ అయిన యూడబ్ల్యూడబ్ల్యూ.. భారత రెజ్లింగ్ సమాఖ్య సభ్యత్వాన్ని సస్పెండ్ చేయడంతో రాబోయే వరల్డ్ ఛాంపియన్ షిప్స్ లో భారత్ తరఫున ఆడేందుకు మన రెజర్లకు ఛాన్స్ ఉండదు.
Read Also: Encounters: బాలికలను రక్షించేందుకు ఎన్కౌంటర్లు అవసరం.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
ఇక, డబ్ల్యూఎఫ్ఐ గవర్నింగ్ బాడీలోని 15 స్థానాలకు ఆగస్టు 12న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీని కోసం భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు యూపీకి చెందిన సంజయ్ సింగ్ సహా నలుగురు అభ్యర్థులు సోమవారం ఢిల్లీలోని ఒలింపిక్ భవన్ లో అధ్యక్ష పదవికి నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన కార్యదర్శిగా చండీగఢ్ కుస్తీ సంఘానికి చెందిన దర్శన్ లాల్, కోశాధికారిగా బ్రిజ్ భూషణ్ అనుచరుడు ఉత్తరాఖండ్ కు చెందిన ఎస్పీ దేశ్వాల్ నామినేట్ అయ్యారు. డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపించడంతో డబ్ల్యూఎఫ్ఐ బాడీని మొదట జనవరిలో, ఆ తర్వాత మేలో సస్పెండ్ చేసింది.
Read Also: TS Govt: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మరో ముందడుగు
అయితే, డబ్ల్యూఎఫ్ఐ రోజువారీ వ్యవహారాలను ప్రస్తుతం భూపేందర్ సింగ్ బజ్వా నేతృత్వంలోని భారత ఒలింపిక్ సంఘం ఏర్పాటు చేసిన అడ్ హాక్ కమిటీ చూసుకుంటుంది. కాగా.. ఎన్నికలు ఆలస్యమైతే సస్పెండ్ చేస్తామని గతంలోనే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ డబ్ల్యూఎఫ్ఐకు వార్నింగ్ ఇచ్చింది. తాజాగా భారత రెజ్లింగ్ సమాఖ్య సభ్యత్వాన్ని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య రద్దు చేసింది.
తాజావార్తలు
-
Mahakali Release Date: ‘మహాకాళి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ ఫీమేల్ సూపర్ హీరో మూవీ!
-
Joe Root Record: ఒక్క పరుగుతో చేజారిన హిస్టరీ.. విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును మిస్సయిన జో రూట్..
-
Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్లో కొత్త ట్రెండ్
-
Jaipur Tension Over School Row: జైపూర్లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
ట్రెండింగ్
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!