WFI: భారత రెజ్లింగ్ సమాఖ్యను రద్దు చేసిన యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వేదికపై భారత్కు పెద్ద అవమానం జరిగింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య.. భారత రెజ్లింగ్ సమాఖ్య సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్ఐ విఫలమైనందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు యూఎమ్డబ్ల్యూ వెల్లడించింది. దీంతో సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో భారత రెజ్లర్లు ‘తటస్థ అథ్లెట్స్ ‘గా పోటీ పడాల్సి ఉంటుంది.
Read Also: NTR 100 Rupees Coin: ఎన్టీఆర్ పేరుతో రూ.100 నాణెం.. విడుదల కార్యక్రమంలో కొత్త ట్విస్ట్
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
అయితే, గత కొంత కాలం నుంచి డబ్ల్యూఎఫ్ఐ వరుస వివాదాల్లో చిక్కుకుంది. దీంతో ఆ సంస్థకు జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. వాస్తవానికి భారత రెజ్లింగ్ గవర్నింగ్ బాడీ అయిన డబ్ల్యూఎఫ్ఐకు 2023 జూన్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, భారత రెజ్లర్ల వరుస నిరసనలు, వివిధ రాష్ట్ర యూనిట్ల లీగల్ పిటిషన్ల కారణంగా ఎన్నికలు పదే పదే వాయిదా పడ్డాయి. రెజ్లింగ్ కు ప్రపంచ పాలక సంస్థ అయిన యూడబ్ల్యూడబ్ల్యూ.. భారత రెజ్లింగ్ సమాఖ్య సభ్యత్వాన్ని సస్పెండ్ చేయడంతో రాబోయే వరల్డ్ ఛాంపియన్ షిప్స్ లో భారత్ తరఫున ఆడేందుకు మన రెజర్లకు ఛాన్స్ ఉండదు.
Read Also: Encounters: బాలికలను రక్షించేందుకు ఎన్కౌంటర్లు అవసరం.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
ఇక, డబ్ల్యూఎఫ్ఐ గవర్నింగ్ బాడీలోని 15 స్థానాలకు ఆగస్టు 12న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీని కోసం భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు యూపీకి చెందిన సంజయ్ సింగ్ సహా నలుగురు అభ్యర్థులు సోమవారం ఢిల్లీలోని ఒలింపిక్ భవన్ లో అధ్యక్ష పదవికి నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన కార్యదర్శిగా చండీగఢ్ కుస్తీ సంఘానికి చెందిన దర్శన్ లాల్, కోశాధికారిగా బ్రిజ్ భూషణ్ అనుచరుడు ఉత్తరాఖండ్ కు చెందిన ఎస్పీ దేశ్వాల్ నామినేట్ అయ్యారు. డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపించడంతో డబ్ల్యూఎఫ్ఐ బాడీని మొదట జనవరిలో, ఆ తర్వాత మేలో సస్పెండ్ చేసింది.
Read Also: TS Govt: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మరో ముందడుగు
అయితే, డబ్ల్యూఎఫ్ఐ రోజువారీ వ్యవహారాలను ప్రస్తుతం భూపేందర్ సింగ్ బజ్వా నేతృత్వంలోని భారత ఒలింపిక్ సంఘం ఏర్పాటు చేసిన అడ్ హాక్ కమిటీ చూసుకుంటుంది. కాగా.. ఎన్నికలు ఆలస్యమైతే సస్పెండ్ చేస్తామని గతంలోనే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ డబ్ల్యూఎఫ్ఐకు వార్నింగ్ ఇచ్చింది. తాజాగా భారత రెజ్లింగ్ సమాఖ్య సభ్యత్వాన్ని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య రద్దు చేసింది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!